Hyderabad: 22 ఏళ్ల యువకుడిని ట్రాప్ చేసిన వివాహిత.. భర్త, పిల్లలను వదిలి ప్రియుడితో..
- 22 ఏళ్ల వ్యక్తిని ట్రాప్ చేసిన వివాహిత
- భర్త, పిల్లలను వదిలి ప్రియుడితో జంప్
- నెల రోజులుగా యువకుడి ఆచూకీ లేకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన
- యువకుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొందరి స్త్రీ, పురుషుల ప్రవర్తన కుటుంబ వ్యవస్థకు భంగం కలిగిస్తున్నాయి. ఇప్పటి వరకు పెళ్లికాని యువతీ, యువకులు ప్రేమించి పెళ్లి చేసుకునే వారు. కానీ, ఇప్పుడు ట్రెండ్ మారింది. ఆల్రెడీ పెళ్లైన వారు వారిని విడిచి పెట్టి కొత్త సంబంధాలను ఏర్పర్చుకుంటున్నారు. పరాయి వ్యక్తుల మోజులో పడి భర్త, భార్యను వదిలేయడం, భార్య భర్తను వదిలి వెళ్లడం వంటి ఘటనలు ఎక్కువైపోతున్నాయి. తాజాగ హైదరాబాద్ లో ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. 35 ఏళ్ల వయసున్న ఓ వివాహిత 22 ఏళ్ల యువకుడిని ట్రాప్ చేసింది. భర్తను పిల్లలను వదిలి ప్రియుడి కోసం నగరానికి చేరుకుంది. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Also Read:Poonam Kaur: నేను ఇబ్బంది పడ్డా.. పోసాని ఆరోగం గురించి దిగులుగా ఉంది!
Also Read
35 ఏళ్ల వయసున్న ఓ వివాహిత 22 ఏళ్ల వయసున్న ఓ యువకుడితో ఫోన్ యాప్ ద్వారా పరిచయం పెంచుకుంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇంకేముంది ప్రియుడి మోజులో భర్త పిల్లలను విడిచి అతనితో వెళ్లిపోయింది. విషయం తెలుసుకున్న ఆమె భర్త వారిపై నిఘా పెట్టి భైక్ పై వెల్తున్న ఇద్దరిని అడ్డగించాడు.. దీంతో భైక్ ను వదిలి పరారైన సంఘటన గత నెల 5 వ తేదిన పేట్ బషీరాబాద్ పీఎయస్ పరిదిలో చోటుచేసుకుంది.
Also Read:CM Revanth Reddy: ఖనిజ అక్రమ తవ్వకాలపై ప్రభుత్వం ఉక్కు పాదం..
ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా కు చెందిన మిరియం పల్లి పేరయ్య కుమారుడు గోపి (22 )ని కంప్యూటర్ ట్రైనింగ్ కోసం హైదరాబాద్ కు వచ్చాడు. కేపీహెచ్ బీలోని ఓ హాస్టల్ లో ఉంటూ కంప్యూటర్ నేర్చుకుంటున్నాడు. ఈ క్రమంలో ఫోన్ యాప్ లో గోపికి వరంగల్ జిల్లా బావోజిగూడెం కు చెందిన ఇద్దరు పిల్లల తల్లి అయిన సుకన్య (35) పరిచయం అయింది. వీరు తరచూ ఫోన్ లో మాట్లాడుకొనే వారు.. ఇది గమనించిన భర్త జయరాజ్ (38 )సుకన్యను మందలించాడు.
ఈక్రమంలో గత నెల 5 వతేదిన సుకన్య భర్త పిల్లలను వదిలి గోపిని కలవడానికి నగరానికి వచ్చింది. ప్రేమ పేరుతో యువకుడిని ట్రాప్ చేసి తీసుకెళ్లింది. నెల రోజులుగా యువకుడి ఆచూకీ లేకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇద్దరు ఫోన్లను స్విచ్చాప్ చేశారు. చివరిసారిగా బైక్ పై వెళ్తుండగా ఆ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. యువకుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!