కరీంనగర్ జిల్లాలో ఓ యువకుడు జలసమాధి అయిన ఘటన కలకలం రేపింది. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన కుటుంబ సభ్యులను దిగ్భ్రాంతికి గురిచేసింది. మృతుడిని మానకొండూర్ మండలం ఉటూరు గ్రామానికి చెందిన సంగం రాజు గా పోలీసులు గుర్తించారు. ఉన్నట్టుండి రాజు మిస్ అవ్వడంతో తల్లి స్వరూప పెట్టిన మిస్సింగ్ కేసు ఆధారంగా పోలీసుల దర్యాప్తు చేపట్టారు. సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా గాలింపు చర్యలు చేపట్టారు. Also Read:Anaganaga oka Raju : జనవరి 14న…
రోజురోజుకు మహిళలపై లైంగిక వేధింపులు ఎక్కువైపోతున్నాయి. పిల్లలపై కూడా అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారు కొందరు దుండగులు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం వెలుగుచూసింది. 12 ఏళ్ల బాలికపై పాతికేళ్ల కామాంధుడు దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటన అశ్వరావుపేట మండలం ఊట్లపల్లిలో చోటుచేసుకుంది. బాలిక అనారోగ్యంతో ఉండటంతో హాస్పిటల్ కి తీసుకెళ్లగా.. బాలిక ఐదో నెల గర్భవతి అని వైద్యులు తేల్చారు. స్థానికులు చైల్డ్ డెవలప్మెంట్ శాఖకు సమాచారం అందించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు…
ఖమ్మం జిల్లా వేంసూరు మండలం మర్లపాడు వైన్ షాపులో విషాదం చోటుచేసుకుంది. మద్యం తాగుతూ ఓ యువకుడు మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపింది. మృతుడు ఆంధ్రా లోని ఎన్టీఆర్ జిల్లా ఇనగడపకు చెందిన వేల్పుల గోపి(28)గా గుర్తించారు. వేంసూరు మండలం లింగపాలెం లోని అత్తింటికి వచ్చిన మృతుడు వేల్పుల గోపి. మృతుని బంధువులు యువకుడి మృతి పై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన. సీసీ టీవీపుటేజ్ పరిశీలిస్తున్న అధికారులు…
ఆన్ లైన్ గేమ్స్ నిండు ప్రాణాలను బలిగొంటున్నాయి. భారీగా డబ్బులు వస్తాయన్న ఆశతో పెట్టుబడులు పెట్టి ఉన్నదంతా పోగొట్టుకుంటున్నారు. అప్పులు చేసి అవి తీర్చే మార్గం లేక మానసిక వేదనతో తనువు చాలిస్తున్నారు. ఆన్ లైన్ గేమ్స్ కారణంగా కుటుంబాలు రోడ్డునపడుతున్నాయి. తాజాగా మరో యువకుడు ఆన్ లైన్ గేమ్స్ కి బలయ్యాడు. కుత్బుల్లాపూర్, సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆన్లైన్ గేమ్స్ కి అలవాటు పడి ఓ యువకుడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. Also Read:ఆయుర్వేదంలో ఆపరేషన్లకు…
ప్రేమ రెండు దేశాల మధ్య బంధాన్ని ఏర్పర్చింది. దేశాల మధ్య ఏంటీ అనుకుంటున్నారా? అవును మీరు విన్నది నిజమే.. భారత్, ఫ్రాన్స్ కు చెందిన ఇద్దరి ప్రేమికులతో ఈ రెండు దేశాల మధ్య ప్రేమ బంధం ఏర్పడింది. భారత్ లోని తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా తిమ్మాపూర్ గ్రామానికి చెందిన యువకుడు, ఫ్రాన్స్ యువతితో ప్రేమలో పడ్డాడు. ఇంకేముంది.. పెద్దలను ఒప్పించి హిందూ సంప్రదాయాల ప్రకారం ప్రేమ పెళ్లితో ఒక్కటయ్యారు. ప్రేమకు సరిహద్దులు అడ్డురావని నిరూపించారు.…
ఆదిలాబాద్ జిల్లాలో వింత దొంగతనం చోటుచేసుకుంది. గుట్టు చప్పుడు కాకుండా దొంగతనాలకు పాల్పడుతుంటారు దుండగులు. కానీ ఓ యువ దొంగ మాత్రం యజమాని కళ్ల ముందే చోరీకి పాల్పడ్డాడు. ఇంటి ముందు ఉన్న వ్యక్తిని, బైక్ ను తీసుకెళ్లాడు ఓ యువకుడు. తర్వాత మద్యం తాగాక పట్టణంలోని పలు కాలనీలు అదే బైక్ పై తిప్పాడు. ఆ తర్వాత ఓ చోట బాధితుడిని దింపేసి బైక్ తో పరార్ అయ్యాడు యువదొంగ. మద్యం మత్తులోంచి తేరుకున్న బాధితుడు…
ములుగు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. తాడ్వాయి మండలం బిరెల్లిలో దహన సంస్కారానికి వెళ్లి చెరువులో దిగి మంకిడి పవన్ అనే యువకుడు గల్లంతయ్యాడు. గ్రామంలో రామకృష్ణ అనే వ్యక్తి చనిపోగా అతని అంతిమయాత్రలో పాల్గొని దహన సంస్కారం అనంతరం స్నేహితులతో కలిసి పవన్ అనే యువకుడు చెరువులోకి దిగాడు. అయితే నవీన్, వినయ్, రణధీర్, అనే నలుగురు స్నేహితులు అవతల ఒడ్డుకు చేరుకున్నరు. కానీ, పవన్ మాత్రం నీటిలో మునిగి గల్లంతయ్యాడు. వెంటనే వారు పోలీసులకు సమాచారం…
ఐఫోన్ కొనివ్వలేదని యువకుడు సూసైడ్ చేసుకున్నాడు.. విశాఖపట్నంలో పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.. పెందుర్తి సుజాతానగర్ లో నివాసం ఉంటున్న మృతుడు సాయి మారుతి తండ్రి చంద్రశేఖర్ స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెడుతూ ఉంటాడు.. అతని కుమారుడు సాయి మారుతి కెవిన్ కొంతకాలం హైదరాబాద్ లో సినిమా పరిశ్రమలో పనిచేసి, ఇటీవలే ఇంటికి వచ్చాడు.
తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. జలపాతాలు సైతం ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. జలసవ్వడులు వింటూ సేదతీరేందుకు పర్యాటకులు క్యూ కడుతున్నారు. అయితే అజాగ్రత్త కారణంగా విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ములుగు జిల్లా వాజేడు మండలంలోని కొంగాల జలపాతం వద్ద విషాదం చోటుచేసుకుంది. జలపాతంలో పడి యువకుడు గల్లంతయ్యాడు. సెల్ఫీ తీసుకోడానికి జలపాతం దగ్గర కి వెళ్లి జారీ పడి యువకుడు మృతి చెందాడు. Also Read:Venkatesh : వెంకీ–త్రివిక్రమ్ సినిమాలో హీరోయిన్ ఫిక్స్..…
లోన్ యాప్స్ లో అప్పులు చేసి వాటిని తీర్చేందుకు కొందరు పడుతున్న తంటాలు అన్నీ ఇన్నీ కావు. కొందరు తమకు తామే కిడ్నాప్ ప్లాన్ చేసుకుని కుటుంబ సభ్యుల నుంచే డబ్బు వసూళ్లకు పాల్పడుతున్నారు. మరికొందరు దొంగతనాలకు పాల్పడుతున్నారు. తాజాగా బంజారాహిల్స్ లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఏకంగా స్నేహితుడి ఇంట్లోనే చోరికి తెగబడ్డాడు. బంజారాహిల్స్ లో ఆడవేషంలో వచ్చి బంగారం డబ్బును దోచుకెళ్లాడు హర్షిత్. లోన్ యాప్ ల ద్వారా అప్పులు చేసి, అప్పులు తీర్చాలని…