Congress PAC- TPCC Meeting: నేడు గాంధీభవన్లో కాంగ్రెస్ పీఏసీ, టీపీసీసీ కీలక భేటీ..
- నేడు గాంధీభవన్లో కాంగ్రెస్ పీఏసీ, టీపీసీసీ అడ్వైజరీ కమిటీ భేటీ..
- స్థానిక సంస్థల ఎన్నికలు, జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల వ్యూహం..
- పార్టీ సంస్థాగత నిర్మాణం, రాష్ట్రస్థాయి కమిటీలు, యూరియా కొరతపై చర్చ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress PAC- TPCC Meeting: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. ఇందులో భాగంగానే, టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ, టీపీసీసీ అడ్వజరీ కమిటీ ఈరోజు ( ఆగస్టు 23న) సాయంత్రం 5 గంటలకి కీలక సమావేశం కానున్నాయి. గాంధీ భవన్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో జరగనున్న ఈ మీటింగ్ కు ఏఐసీసీ ఇంచార్జ్ ప్రధాన కార్యదర్శి మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన జరుగుతుండగా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఇతర సభ్యులు పాల్గొనే అవకాశం ఉంది.
Read Also: US: న్యూయార్క్లో బస్సు బోల్తా.. ఐదుగురు మృతి.. భారతీయులుగా అనుమానం!
Also Read
- CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
- Komatireddy Rajgopal Reddy : నేను పదవులు అడుక్కోను, నేనొక ఫైటర్ను
- Bahadurguda Land Row : భూముల దగ్గర మళ్లీ ఉద్రిక్తత.. పోలీసులపై రాళ్లు, కుర్చీలు విసిరిన రైతులు..
- Adluri Laxman : కేటీఆర్ సరూర్ నగర్ సభలో మాట్లాడించింది పెయిడ్ ఆర్టిస్టులతోనే
అయితే, ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలు, జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల వ్యూహం, పార్టీ సంస్థాగత నిర్మాణం, రాష్ట్రస్థాయి కమిటీల నిర్మాణం, యూరియా కొరతపై ప్రతిపక్షాలు చేస్తున్న రాజకీయాలపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే ఎన్నికలకు వెళ్ళాలి అని రాష్ట్ర సర్కార్ చూస్తుండగా.. బీసీ రిజర్వేషన్ బిల్లు రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉండిపోయింది. కాగా, స్థానిక ఎన్నికల నిర్వహణ తేదీలపై మంత్రులు, బీసీ నేతలు వేర్వేరు అభిప్రాయాల వ్యక్తం చేయడంతోనే పీఏసీలో చర్చించాలని సీఎం రేవంత్ నిర్ణయించినట్లు సమాచారం. పార్టీ సీనియర్ నేతల అభిప్రాయాలు తీసుకున్న తరువాతే ఎన్నికల తేదీలపై ఓ క్లారిటీ రానుంది. ఇదే అంశంపై మంత్రివర్గ భేటీలో తుది నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. అలాగే, కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టుపై చర్చించేందుకు అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు లాంటి అంశాలపై చర్చించి ఖరారు చేయనున్నట్లు సమాచారం.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!