Srisailam: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలంలో ఈ నెల 16 నుంచి 20 వరకు ఉగాది మహోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని ఇప్పటికే కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు క్షేత్రానికి చేరుకుంటున్నారు. ఈ ఐదు రోజుల ఉత్సవాల్లో మల్లికార్జున స్వామి, భ్రమరాంబ అమ్మవార్లకు ప్రత్యేక వాహన సేవలు, అమ్మవారికి విశేష అలంకరణలు నిర్వహించనున్నారు. ఆలయ అధికారులు ఇప్పటికే దాదాపు ఉత్సవాల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.
LPG Cylinder Delivery: రాష్ట్రంలో LPG సరఫరా నియంత్రణలోనే ఉంది.. ప్రభుత్వం కీలక ప్రకటన.!
ఉత్సవాల వివరాలు:
మార్చి 16: బృంగి వాహన సేవ, మహాలక్ష్మీ అలంకారం
మార్చి 17: కైలాస వాహన సేవ, మహాదుర్గ అలంకారం
మార్చి 18: ప్రభోత్సవం, నంది వాహన సేవ, మహాసరస్వతీ అలంకారం. రాత్రి వీరాచార విన్యాసాలు, అగ్నిగుండ ప్రవేశం
మార్చి 19: ఉదయం ఉగాది పంచాంగ శ్రవణం, సాయంత్రం రథోత్సవం. ఈ సందర్భంగా అమ్మవారికి శ్రీరామవాణి సేవిత రాజరాజేశ్వరి అలంకారం
మార్చి 20: ఉదయం పూర్ణాహుతి, రాత్రి అశ్వ వాహన సేవతో పాటు శ్రీభ్రమరాంబాదేవి నిజాలంకరణతో ఆలయ ఉత్సవాలు ముగియనున్నాయి.
Ather: ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్లపై భారీ డిస్కౌంట్.. రూ. 20,000 వరకు ఆదా..