Forest officials: అటవీశాఖ అధికారులకు సర్కార్ గుడ్ న్యూస్.. వారికి రూ.కోటి వరకు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Forest officials: అటవీ రక్షణలో భాగంగా విధి నిర్వహణలో అసాంఘిక శక్తుల దాడుల్లో అటవీ శాఖ అధికారులు, సిబ్బంది మరణిస్తే భారీ పరిహారం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ తో సహా, చాలా రాష్ట్రాల్లో అసాంఘిక దాడుల్లో అటవీశాఖ సిబ్బంది మరణిస్తే అందని పరిహారం అందించేందుకు సిద్దమైంది. తొలి సారి తెలంగాణ ప్రభుత్వం విధాన పరమైన నిర్ణయం ప్రకటించడంతో అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Read also: Netherlands Train Accident : నెదర్లాండ్స్ లో ఘోర రైలు ప్రమాదం
Also Read
- Telangana: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి భారీగా పెంపు..
- Petrol Price Hike: హైదరాబాద్లో మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఐదు రోజుల్లో రెండోసారి షాక్!
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- Loan: అప్పు ఇచ్చి మర్చిపోవాల్సిందే.. మళ్లీ అడిగారో కాటికే..
అటవీ శాఖ ఉద్యోగులు చాలా మంది తమ ప్రాణాలను పణంగా పెట్టి అటవీ ప్రాంతాన్ని కాపాడుతున్నారు. విధి నిర్వహణలో అనేక దాడులను ఎదుర్కోవాల్సిన క్రమంలో సంఘవ్యతిరేక శక్తులు, తీవ్రవాదుల చేతుల్లో కొంత మంది చనిపోతున్నారు. కొందరు వ్యక్తులు ప్రాణాపాయం నుంచి తప్పించుకోగలిగినప్పటికీ, వారు తీవ్రంగా గాయపడి తమ విధులకు శాశ్వతంగా దూరమయ్యే పరిస్థితులు తలెత్తు తున్నాయి. అలాంటి వారిని, వారి కుటుంబాలను ఆదుకునేందుకు కేసీఆర్ సర్కార్ గట్టి నిర్ణయమే తీసుకుంది. విధి నిర్వహణలో భాగంగా ఉగ్రవాదులు, సంఘ వ్యతిరేక శక్తుల చేతిలో మృతి చెందే అటవీశాఖ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ నష్టపరిహారం ప్రకటించింది. ర్యాంక్ వారీగా అధికారులకు రూ. 30 లక్షల నుంచి రూ. కోటి మేరకు పరిహారం అందించనుంది. ఈమేరకు తాజాగా జీవో విడుదల చేసింది. కేటగిరీల వారీగా పరిహారం నిర్ణయించబడింది. అటవీ పరిరక్షణలో భాగంగా సంఘ వ్యతిరేక శక్తుల చేతుల్లో మరణించిన బీట్ ఆఫీసర్ తత్సమాన స్థాయి ఉద్యోగులకు రూ. 30 లక్షలు, పనికి శాశ్వతంగా గైర్హాజరైతే రూ. 20 లక్షలు, తీవ్ర గాయం అయితే రూ. 3 లక్షల పరిహారం ప్రకటించారు. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, డిప్యూటీ రేంజ్ అధికారి మరణిస్తే రూ. 45 లక్షలు, పనికి శాశ్వతంగా గైర్హాజరైతే రూ. 25 లక్షలు, తీవ్ర గాయాలు అయితే రూ. 5 లక్షలు, అటవీ రేంజ్ అధికారులు చనిపోతే రూ. 50 లక్షలు, శాశ్వతంగా అసమర్థులైతే రూ. 30 లక్షలు, తీవ్ర గాయమైతే రూ. 5 లక్షలు. అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ స్థాయి ఉద్యోగులు మరణిస్తే రూ. 75 లక్షలు, డ్యూటీకి శాశ్వతంగా గైర్హాజరైతే రూ. 40 లక్షలు, తీవ్ర గాయమైతే రూ. 5 లక్షలు, ఐఎఫ్ఎస్ అధికారులు దాడుల కారణంగా విధి నిర్వహణలో మరణిస్తే రూ. కోటి, అసమర్థ గాయం అయితే రూ. 50 లక్షలు, తీవ్ర గాయాలు అయితే రూ. 6 లక్షల పరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మొత్తాన్ని బాధితులకు లేదా వారి కుటుంబ సభ్యులకు అందజేస్తారు.
Vallabhaneni Vamsi: సీఎం జగన్ సమీక్షకు డుమ్మా..! వల్లభనేని వంశీ స్పందన ఇదే..
తాజావార్తలు
-
Oil Free Poori: ఒక్క చుక్క నూనె లేకుండా పొంగే పూరీలు.. ఎలాగో చూస్తే షాకవుతారు!
-
Telangana: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి భారీగా పెంపు..
-
Petrol Price Hike: హైదరాబాద్లో మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఐదు రోజుల్లో రెండోసారి షాక్!
-
Karuppu: ఆర్జే బాలాజీ ప్లానింగ్కు ఫిదా అవుతున్న సూర్య అభిమానులు
-
Gautam Adani: అమెరికాలో అదానీ గెలిచాడు.. ఒక్క దెబ్బతో లీగల్ కేసులన్నీ క్లోజ్.. రూ.84 వేల కోట్ల ప్లాన్తో సరికొత్త చరిత్ర!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!