Harish Rao : కమీషన్ల కక్కుర్తి కోసమే అనవసరపు రిజర్వాయర్లు.. రేవంత్రెడ్డికి హరీష్ రావు సవాల్..!
- గొల్లపల్లి-చీర్కపల్లి రిజర్వాయర్పై హరీష్ రావు ఆగ్రహం
- కమిషన్ల కోసం ప్రాజెక్టులంటూ కాంగ్రెస్పై విమర్శలు
- పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ పనులపై ప్రశ్నలు
- సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ సవాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉమ్మడి పాలమూరు జిల్లా నీటి పారుదల ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై మాజీ మంత్రి హరీష్ రావు విరుచుకుపడ్డారు. గొల్లపల్లి-చీర్కపల్లి రిజర్వాయర్ నిర్మాణం వల్ల రైతులకు ఒరిగేదేమీ లేదని, కేవలం కమిషన్ల కక్కుర్తి కోసమే ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ముందుకు తెస్తోందని ఆయన ధ్వజమెత్తారు. ధర్నా చేస్తున్న రైతులతో భేటీ అయిన ఆయన, ఈ పోరాటం రాజకీయాల కోసం చేస్తున్నది కాదని, రైతుల భూములను కాపాడుకోవడానికి చేస్తున్న ఆత్మాభిమాన పోరాటమని పేర్కొన్నారు.
Summer Tips: చీమల బెడద భరించలేకపోతున్నారా? ఈ సింపుల్ ట్రిక్స్తో చెక్ పెట్టండి!
Also Read
- Hitech City Traffic : గంట వర్షం.. 3 గంటల నరకం..! హైదరాబాద్ ఐటీ హబ్ను ముంచేసిన భారీ వర్షం
- Weather Update : తెలంగాణకు బ్రేక్ ఇచ్చిన రుతుపవనాలు.. మళ్లీ వానల జోరు ఎప్పుడంటే.?
- Amit Shah : తెలంగాణలో పోటీ, పొత్తులపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు
- Hyderabad Crime : మల్కాజ్గిరిలో కలకలం.. భార్యపై కాల్పులు జరిపి పారిపోయిన భర్త.!
గత అరవై ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 25 రిజర్వాయర్లు మాత్రమే కడితే, బీఆర్ఎస్ తొమ్మిదేళ్ల పాలనలో 65 టీఎంసీల సామర్థ్యం గల రిజర్వాయర్లను నిర్మించిందని హరీష్ రావు గుర్తు చేశారు. “పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో మేజర్ పనులు మేమే పూర్తి చేశాం. కానీ మిగిలిపోయిన చిన్న చిన్న పనులు పూర్తి చేయడం ఈ ప్రభుత్వానికి చేతకావడం లేదు. మూడు సీజన్లు వృథా చేసి 50 టీఎంసీల నీటిని నిలుపుకునే అవకాశాన్ని చేజార్చారు” అని ఆయన మండిపడ్డారు. నాడు అనేక కేసులు వేసి ప్రాజెక్టులను అడ్డుకున్న కాంగ్రెస్ నేతలకు నేడు కాలువలు తవ్వడం కూడా సాధ్యపడటం లేదని ఎద్దేవా చేశారు.
గొల్లపల్లి-చీర్కపల్లి రిజర్వాయర్ గురించి మాట్లాడుతూ.. ఏదుల నుండే నీళ్లు పారే అవకాశం ఉన్నప్పుడు ఈ కొత్త రిజర్వాయర్ అవసరమే లేదని తాము ఆనాడే చెప్పామన్నారు. కేఎల్ఐ (KLI) పథకంలో మొదట వనపర్తి లేకపోయినా, నిరంజన్ రెడ్డి పట్టుబట్టి నీళ్లు ఇప్పించారని తెలిపారు. జూరాల వద్దే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ కట్టాల్సిందని ఇప్పుడు మాట్లాడుతున్న వారు బుద్ధి ఉన్నవారెవరూ ఆ మాట అనరని, శ్రీశైలం నుండి రోజుకు రెండు టీఎంసీలు తీసుకునేలా తాము అద్భుతమైన డిజైన్ చేశామని వివరించారు.
Summer Tips: చీమల బెడద భరించలేకపోతున్నారా? ఈ సింపుల్ ట్రిక్స్తో చెక్ పెట్టండి!
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. “కేరళ వెళ్ళి ఆరు గ్యారెంటీలు అమలు చేశామని అబద్ధాలు చెబుతున్నారు. ఇక్కడ నాలుగు రైతుబంధులను ఎగ్గొట్టి, రుణమాఫీని అసంపూర్తిగా వదిలేశారు. వనపర్తిలో ఏ ఊరికైనా వెళ్దాం.. రుణమాఫీ 100 శాతం పూర్తయిందని నిరూపిస్తే నేను రాజీనామా చేస్తాను. ఒకవేళ కాకపోతే నువ్వు రాజీనామా చేస్తావా?” అని సీఎంకు బహిరంగ సవాల్ విసిరారు. వంద రోజుల్లో గ్యారెంటీలు అమలు చేస్తామని సంతకం పెట్టి, రెండున్నర ఏళ్లు దాటినా ఇంకా కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. రైతుల భూములను కాపాడటానికి తాము ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని, రైతుల పక్షాన నిలబడి పోరాటం చేస్తామని హరీష్ రావు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Modi-Meloni: ఇటీవల రోమ్లో కలవడం ఆనందంగా ఉంది.. మోడీ రికార్డ్పై మెలోని అభినందనలు
-
Women’s T20 World Cup 2026కు కౌంట్డౌన్ స్టార్ట్.. భారత్-పాకిస్థాన్ మధ్యే తొలి పోరు.. పూర్తి వివరాలు ఇవే..
-
Sushmita Dev: మమతా బెనర్జీకి మరో షాక్.. రాజ్యసభకు రాజీనామా చేసిన సుస్మితా దేవ్!
-
Sehwag-Dhoni: టీమిండియా నుంచి తప్పించాడు, సీఎస్కేలో స్టార్ను చేశాడు.. ధోనీపై సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు!
-
Alimony: పెళ్లైన 6నెలలకే విడాకులు.. నెలకు రూ.1.40 లక్షలు సంపాదించే మహిళకు.. భరణంగా నెలకు రూ.1.35 లక్షలు
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!