Governor Tamilisai: క్లౌడ్ బరస్ట్పై గవర్నర్ తమిళిసై కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గోదావరి నదిలో ఒక్కసారిగా వరద విరుచుకుపడింది.. భద్రాచలం దగ్గర ఏకంగా 70 అడుగులను దాటేసింది.. ఇక, కడియం ప్రాజెక్టు ఉంటుందా..? ఊడిపోతుందా? అనే టెన్షన్ కూడా పెట్టింది.. అయితే, ఈ నేపథ్యంలో.. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం కేసీఆర్.. భారీ వర్షాలు, వరదలపై స్పందిస్తూ.. దీని వెనుక విదేశాల కుట్ర ఏమైనా ఉందోమో అనే అనుమానాలు వ్యక్తం చేశారు.. ఇప్పటికే లద్దాఖ్, ఉత్తరాఖండ్లో క్లౌడ్ బరస్ట్ చేశారని.. ఇప్పుడు గోదావరి ప్రాంతంలోనూ అదే జరిగి ఉంటుందేమో.. దీనిపై ఇంకా సమాచారం రావాల్సి ఉందన్నారు.. అయితే, యానాం పర్యటనలో ఉన్న తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్.. క్లౌడ్ బరస్ట్పై కీలక వ్యాఖ్యలు చేశారు.. ఇప్పుడు వచ్చిన వరదలు క్లౌడ్ బరస్ట్ కాదని తేల్చేసిన ఆమె.. ఎగువ ప్రాంతంలో ఎప్పుడూ వచ్చే వరదలే, కాకపోతే ఇప్పుడు కొంచెం ఎక్కువగా వరదలొచ్చాయని తెలిపారు.
Read Also: Minister Harish Rao: మోదీజీ.. పేదలు ఏం పాపం చేశారు?
Also Read
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
యానాంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన తమిళిసై… 15వ తేదీన వరదలపై రివ్యూ నిర్వహించాం.. అనుకోకుండా వరదలు ముందుగానే వచ్చాయని తెలిపారు.. ప్రతి కుటుంబానికి 5000 రూపాయలు నష్టపరిహారం ఇస్తున్నాము… 25 కేజీల బియ్యం ప్రభుత్వం ఇస్తుంది.. ప్రతి బాధితుడిని అన్ని విధాలా సురక్షిత ప్రాంతాలకు తరలించి ఆదుకుంటున్నాం.. వైద్యం విషయంలో ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.. ఇక, ఆంధ్ర ప్రాంతానికి ఇబ్బందులు లేకుండా యానాం రక్షణ వాల్ నిర్మాణం కోసం డిజైన్ రూపొందిస్తున్నామని వెల్లడించారు. రక్షణ వాల్ నిర్మాణానికి 137 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వ ప్రకటించిందని తెలిపారు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై. అయితే, తెలంగాణ సీఎం కేసీఆర్ క్లౌడ్ బరస్ట్ వ్యాఖ్యలపై ఆమె స్పందించడం.. ఆయనకు కౌంటర్ ఇచ్చినట్టు అయ్యింది.
ఇక, ఈ వ్యవహారంలో సమాచారం ఉంటే ఇవ్వండి.. ఎలాంటి విచారణ జరిపించడానికైనా కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందంటూ కేంద్రమంత్రి కిషన్రెడ్డి మరోసారి స్పష్టం చేశారు.. క్లౌడ్ బరస్ట్పై అంతర్జాతీయ కుట్ర సమాచారం ఉంటే ఇవ్వండన్న ఆయన.. ఇప్పటి వరకు ఒక దేశంలో మరో దేశం క్లౌడ్ బరస్ట్ చేసిన దాఖలాలు లేవని స్పష్టం చేశారు.. లద్దాఖ్, ఉత్తరాఖండ్లో అలా జరిగాయని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు, దానికి సంబంధించిన సమాచారం ఉంటే ఇవ్వాలి, ఏ దేశాలు, సంస్థలు కుట్రలు చేశాయో పూర్తి స్థాయిలో విచారణకు కేంద్రం సిద్ధంగా ఉందని ప్రకటించారు కేంద్రమంత్రి కిషన్రెడ్డి.
తాజావార్తలు
-
EDLI Scheme: పీఎఫ్ ఖాతా ఉందా? ఉచితంగా రూ.7 లక్షల జీవిత బీమా.. EPF అందించే ఈ ప్రయోజనం గురించి తెలుసా?
-
Women’s T20 World Cup 2026 టైటిల్ గెలిచే సత్తా ఉందా.? హర్మన్ప్రీత్ సేన బలాలు, బలహీనతలు ఇవే.!
-
Hindu Rate of Growth: ప్రధాని మోడీ ప్రస్తావించిన ‘హిందూ గ్రోత్ రేట్’ అంటే ఏంటి? షాకింగ్ నిజాలు..
-
Ravi Mohan Reunion Rumors : గర్ల్ ఫ్రెండ్ తో రవి మోహన్ ప్యాచప్… అసలేం జరుగుతోంది ?
-
2027 ODI World Cup: ఇక అంతా వారి చేతుల్లోనే.. 2027 వన్డే ప్రపంచకప్లో రో-కో ఆడతారా?
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!