Minister Harish Rao: మోదీజీ.. పేదలు ఏం పాపం చేశారు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Harish Rao Fires On PM Narendra Modi In Sangareddy: సంగారెడ్డిలో పర్యటించిన మంత్రి హరీష్ రావు.. ఈ సందర్భంగా బీజేపీ, ప్రధాని మోదీపై ధ్వజమెత్తారు. మొన్న తెలంగాణలో పర్యటించినప్పుడు ఉచితాలు ఇవ్వొద్దని మోదీ అన్నారని, మరి మీరు మాత్రం అదాని, అంబానీల కోసం పని చేయొచ్చా? అంటూ ప్రశ్నించారు. పేదలు ఏం పాపం చేశారని నిలదీసిన ఆయన.. వారికి ఉచితాలు ఎందుకు ఇవ్వకూడదని, మీరు పెద్దలకు ఎందుకు ఇస్తున్నారని అడిగారు.
భారీ వర్షాల కారణంగా వరదలు వస్తే.. సీఎం కేసీఆర్ ఒక్కరే ఈ పరిస్థితిని పరిష్కరించారని, కాంగ్రెస్ – బీజేపోల్లు హైదరాబాద్లోనే ఉండి ఏమీ చేయలేకపోయారన్నారు. కడెం ప్రాజెక్టుకు చరిత్రలో లేనంత వరద వచ్చినా, ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా చుసుకున్నామన్నారు. ప్రతిపక్షాలు కేవలం బురద రాజకీయాలు చేస్తున్నాయని, తెలంగాణకు కేంద్రం అన్యాయం చేస్తోందని, వరద సహాయం కూడా చేయలేదని విమర్శించారు. సహాయం చేయకుండా తిడితే, ప్రజలు మిమ్మల్ని క్షమించరన్నారు. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని చెప్పిన మంత్రి హరీష్.. సాయం పొందిన చేతులు దీవెనలు అందిస్తాయని చెప్పారు.
Also Read
- Bandi Bhagirath Case: బండి భగీరథ్ కేసులో కొత్త ట్విస్ట్..
- IPL Ticket Scam: బాక్స్ టికెట్ ధర 10 లక్షలు.. పెద్దల రిఫరెన్స్ పెట్టినా నో యూజ్.. భారీగా క్యాష్ చేసుకుంటున్న ఎస్ఆర్హెచ్?
- Mohammed Kala Basha: ‘కుర్చీ తాత’ ఇక లేరు.. ఒక్క డైలాగ్తో చరిత్ర సృష్టించిన బాషా గురించి ఆసక్తికర విషయాలు..
- Saraswati Pushkaralu 2026: కాళేశ్వరంలో ఆధ్యాత్మిక మహోత్సవం.. వైభవంగా సరస్వతీ అంత్య పుష్కరాలు ప్రారంభం..
బీజేపీ అధికారంలోకి వస్తే.. బాయిల దగ్గర కూడా మీటర్లు పెడతారని, పెన్షన్లు తగ్గిస్తారని, కల్యాణ లక్ష్మీ కూడా ఇవ్వరని హరీష్ పేర్కొన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ.. పేదల కడుపు కొట్టి, గద్దలకు పంచుతుందని దుయ్యబట్టారు. టీఆర్ఎస్ చట్ట సభల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు ఇస్తోందని, కేంద్రం మాత్రం మహిళలకు ప్రాధాన్యమిస్తామంటూ 8 ఏళ్ల నుంచి నాన్చుతూనే వస్తోందని కడిగిపారేశారు. బేటీ బచావో బేటీ పడావో అని గొప్ప మాటలు చెప్పుకోవడానికే బీజేపీకి సరిపోయిందని కౌంటర్లు వేశారు. డబుల్ ఇంజన్ అని బీజేపీ మొత్తుకుంటోందని మండిపడ్డారు.
ఇదే సమయంలో సంగారెడ్డిలో రూ. 50 కోట్లలో గల్లీల్లోనూ రోడ్లు వేస్తామని, వచ్చే ఆగస్టు నాటికి రోడ్లు సహా డ్రైనేజీ పనులు పూర్తి చేయాలని తాను కలెక్టర్కి ఆదేశాలిచ్చానని హరీష్ రావు చెప్పారు. మంచి నీళ్ళ కోసం సీఎం కేసీఆర్ రూ. 15 కోట్లు ఇచ్చారని, ప్రతి ఇంటికి నీళ్లు ఇస్తున్నాం, ఆరునెలల్లో స్వచ్ఛ సంగారెడ్డిని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే సంగారెడ్డిలో రూ. 500 కోట్లతో మెడికల్ కాలేజ్ కట్టుకున్నామని, రాబోయే రోజుల్లో 600 పడకలతో హాస్పిటల్ కూడా కడుతామని అన్నారు. సంగారెడ్డిలో బస్తీ దవాఖాన కూడా ఉందని తెలిపారు.
నార్మల్ డెలివరీనే అందరూ కృషి చేయాలని, అలా చేస్తే తల్లితో పాటు బిడ్డకి మంచిదని హరీష్ చెప్పారు. పైసలుంటే ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లండని, పేదలు మాత్రం ప్రభుత్వ ఆసుపత్రికే రావాలని ఆయన పిలుపునిచ్చారు. సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో అన్ని సౌకర్యాలు ఉన్నాయి, 100 మంది డాక్టర్లు పనిచేస్తున్నారు, అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసుకోకండని సూచించారు. సంగారెడ్డి ఎమ్మెల్యే టీఆర్ఎస్ కాకపోయినా, పనులన్నీ పూర్తి చేస్తామని భరోసానిచ్చారు. ఇప్పటికే 40 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం, కొత్తగా 12 లక్షల మందికి పెన్షన్లు ఇస్తాం, ఇల్లు లేని వారికి త్వరలోనే డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తామని హరీష్ రావు వెల్లడించారు.
తాజావార్తలు
-
Dragon Glimpse Records: ‘డ్రాగన్’ గ్లింప్స్తో చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్.. 24 గంటల్లో భారతీయ సినీ హిస్టరీలోనే ఆల్టైమ్ రికార్డ్!
-
IPL 2026 Playoffs Race: ముంబైపై కేకేఆర్ విజయం.. సీఎస్కే ప్లేఆఫ్స్ ఛాన్సెస్ గల్లంతే, దేవుడు దిగొస్తే తప్ప!
-
Trump vs Netanyahu: ట్రంప్ నిర్ణయంపై నెతన్యాహు తీవ్ర ఆగ్రహం.. అమెరికా ‘లెటర్ ఆఫ్ ఇంటెంట్’ పై ఇజ్రాయెల్ అనుమానాలు!
-
iQOO Pad 6 Pro: ఐకూ ప్యాడ్ 6 ప్రో విడుదల.. 13,000mAh బ్యాటరీ, 13.2-అంగుళాల 4K LCD స్క్రీన్
-
Bandi Bhagirath Case: బండి భగీరథ్ కేసులో కొత్త ట్విస్ట్..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!