Kunamneni Sambasiva Rao: గవర్నర్ కేవలం రబ్బర్ స్టాంపు మాత్రమే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో రాజ్ భవన్ వర్సెస్ ప్రగతి భవన్ ఎపిసోడ్ నడుస్తోంది. తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. . పెండింగ్లో ఉన్న బిల్లులపై సందేహాలు నివృత్తి చేసుకోవాల్సిన అవసరముందని, వాటిని పరిశీలిస్తున్నానని ఆమె చెప్పారు. రాజ్భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. అన్ని బిల్లులను సమగ్రంగా పరిశీలించేందుకే తాను సమయం తీసుకున్నానన్నారు తమిళి సై. ఇదిలా ఉంటే.. గవర్నర్ ప్రెస్ మీట్ పై కూనంనేని సాంబశివరావు స్పందించారు. గవర్నర్ కు ప్రభుత్వం చేసిన చట్టాలను తిరిగి వెనక్కి పంపించే హక్కు లేదన్నారు.
Read Also: Governor Tamilisai: నేను బిల్లులను తొక్కిపెట్టలేదు.. పరిశీలిస్తున్నానంతే!
Also Read
- Prajavani: మండల కేంద్రాల్లో ప్రజావాణి.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..
- ఆ కార్యాలయాలకు టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలు.. సెప్టెంబర్ 1 తర్వాత బిల్లులు చెల్లించొద్దు: మంత్రి శ్రీధర్ బాబు
- Hyderabad: నిత్యం వాడే మసాలాల్లో విషపూరిత కేమికల్స్.. 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం..
- Hyderabad: ఆ మార్గాల్లో వెళ్లేవారు రూట్ మార్చాల్సిందే.. ఈ ఏరియాల్లో భారీగా ట్రాఫిక్ జామ్..
ప్రభుత్వం చేసిన చట్టాలలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే ప్రభుత్వాన్ని వివరణ కోరవచ్చు. అలాగే గవర్నర్ కార్యాలయం ప్రత్యుత్తరాలు చేయొచ్చు..కానీ ఇలా మొండిగా బిల్లులకు ఆమోదం తెలపకుండా తన వద్ద నెలల తరబడి ఉంచుకోవడం ప్రజాస్వామ్యంలో మంచిది కాదు.. ఇలా చేయడం రాజ్యాంగ విరుద్ధం అవుతుందన్నారు కూనం నేని సాంబశివరావు. బిల్లుల ఆమోదంపై గవర్నర్కు సూపర్ పవర్ ఉందని చెప్పుకుంటుంది.. అలాంటివేమీ రాజ్యాంగంలో గవర్నర్లకు కల్పించలేదు. ప్రభుత్వం చేసిన చట్టాలకు ఆమోదముద్ర వేయాల్సిన బాధ్యత గవర్నర్ ది. కేవలం గవర్నర్ రబ్బర్ స్టాంపు మాత్రమే అన్నారు.
Read Also: Malavika Mohanan: బెడ్ పై ఏ హీరో హాట్.. నోరు జారి బుక్ అయిన మాస్టర్ బ్యూటీ
నీకు రాజకీయాలు చేయాలనుకుంటే, బిజెపి కండువా డ్రెస్ వేసుకొని మీ రాష్ట్రంలో రాజకీయాలు చేసుకోండి. తెలంగాణ ప్రజల మీద అక్కసు వెళ్లకక్కుతుంది మీరు..కామన్ రిక్రూట్ మెంట్ బోర్డు ఏర్పాటుకు సంబంధించిన బిల్లు విషయం పక్కన పెడితే..మిగిలిన బిల్లును ఎందుకు ఇప్పటి వరకు ఆమోదించలేదో గవర్నర్ వెల్లడించాలి..ప్రైవేటు యూనివర్సిటీ ఏర్పాటుకు కారణం కేంద్ర ప్రభుత్వం. ఇచ్చిన హామీలను,సమస్యలు పరిష్కరించకపోతే ప్రగతిభవనైనా రాజ్ భవనైన ఆందోళన చేసే హక్కు విద్యార్థులకు ఉంటుంది.. ఆమె ఫోన్ కూడా ప్రభుత్వం టాపింగ్ చేస్తుందని గవర్నర్ చెప్పడం హాస్యాస్పదంగా వుందన్నారు కూనంనేని. ఇప్పటికైనా గవర్నర్ పేచీలు పెట్టుకోవడం మానేసి గవర్నర్ గా పనిచేయాలని హితవు పలికారు.
తాజావార్తలు
-
Ghani Movie Failure: ‘గని’ ఫ్లాప్ కావడానికి కారణం ఇదేనట! తొలిసారి స్పందించిన వరుణ్ తేజ్..
-
Team India: లంకలో అడుగుపెట్టిన గిల్ సేన.. ఇక వేట మొదలుపెట్టుడే..
-
Copper Utensils Cleaning Tips: రాగి, ఇత్తడి పాత్రలు నల్లగా మారాయా?.. 5 నిమిషాల్లో కొత్త మెరుపు.. సూపర్ హోం టిప్
-
Kangana Ranaut: త్రిషపై ఉదయనిధి వ్యాఖ్యలపై కంగనా రనౌత్ ఏమన్నారంటే..!
-
Bihar Politics: బంకీపూర్లో ప్రశాంత్ కిషోర్ విజయం.. బీజేపీకి కాదు, అసలు తలనొప్పి ఆర్జేడీకే..
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!