Warangal Corona: కరోనా కొత్త వేరియంట్.. వరంగల్ ఎంజీఎంలో స్పెషల్ వార్డు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Warangal Corona: వరంగల్లో కరోనా, ఓమిక్రాన్ను పకడ్బందీగా ఎదుర్కొనగా.. కొత్త వేరియంట్ నేపథ్యంలో అధికారులు మరోసారి అప్రమత్తమయ్యారు. ఈ మేరకు వరంగల్ ఎంజీఎంలో ప్రత్యేక వైద్యుల బృందాన్ని కూడా నియమించారు. ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ నేతృత్వంలో ఒక బృందాన్ని ఏర్పాటు చేసి కొత్త వేరియంట్ వ్యాప్తిని ఎదుర్కొనేందుకు చర్యలు తీసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటికే 1,828 కొత్త వేరియంట్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యలు ముమ్మరం చేశారు. కోవిడ్ యొక్క కొత్త రూపాంతరం వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలు ప్రారంభించబడ్డాయి. గతంలో, కోవిడ్ -19 వ్యాప్తి సమయంలో, ఓమిక్రాన్, MGMలో వైరస్ బాధితుల కోసం మొత్తం 250 పడకల సామర్థ్యంతో ప్రత్యేక వార్డును కేటాయించారు. ప్రతి మంచానికి ఆక్సిజన్ సరఫరా చేసేందుకు రెండు లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్లను కూడా ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసి సేవలందిస్తున్నారు. వెంటిలేటర్లు కూడా మరమ్మతులు చేసి రోగులకు చికిత్స అందించారు. ఆ తర్వాత వైరస్ ప్రభావం పూర్తిగా తగ్గిపోయి వార్డును ఇతర అవసరాలకు వినియోగించుకుంటున్నారు. తాజాగా.. కొత్త జేఎన్-1 వేరియంట్ వ్యాప్తి చెందడంతో.. MGM అధికారులు మరోసారి ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు.
Read also: Yuvagalam Vijayotsava Sabha: నేడు యువగళం విజయోత్సవ సభ.. పాల్గొననున్న టీడీపీ, జనసేన శ్రేణులు
Also Read
ఆసుపత్రిలో 10 వెంటిలేటర్లు, 30 ఆక్సిజన్ పడకలు మరియు మరో 10 సాధారణ పడకలు ఏర్పాటు చేయబడ్డాయి. కొత్త వేరియంట్ను ఎదుర్కొనేందుకు మొత్తం 50 పడకల కోవిడ్ వార్డును సిద్ధం చేశారు. ఈ మేరకు డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ పరశురాం నేతృత్వంలో ఆర్ ఎంఓలు, నర్సింగ్ సిబ్బందికి ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. కొత్త వేరియంట్ను సమర్థంగా ఎదుర్కొనేందుకు చర్యలు తీసుకున్నట్లు చెబుతున్నారు. కేరళ రాష్ట్రంలో జేఎన్-1 వేరియంట్ కేసులు నమోదు కావడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మరిన్ని ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించాలని, పాజిటివ్గా ఉన్నవారిలో కొత్త వేరియంట్ని నిర్ధారించేందుకు తప్పనిసరిగా జన్యు శ్రేణి పరీక్షలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కింది స్థాయి అధికారులకు కూడా తగిన సూచనలు చేసింది. దీంతో ఆర్టీపీసీఆర్ పరీక్షలను కూడా పెంచేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. నవంబర్, డిసెంబర్ నెలల్లో ఎంజీఎంలో దాదాపు 560 పరీక్షలు జరిగాయని అధికారులు చెబుతున్నారు. వీరిలో ఎవరికీ కరోనా సోకలేదని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా కొత్త వేరియంట్ కేసులు పెరుగుతున్నప్పటికీ, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
Yuvagalam Vijayotsava Sabha: నేడు యువగళం విజయోత్సవ సభ.. పాల్గొననున్న టీడీపీ, జనసేన శ్రేణులు
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!