Laxman: టీఆర్ఎస్ చీప్ పాలిటిక్స్.. మెట్రో పిల్లర్లు కబ్జా చేశారు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్లో జరగనున్న నేపథ్యంలో.. సిటీలో ఎటు చూసిన తెలంగాణ ప్రభుత్వ ఫ్లెక్సీలు, హోర్డింగ్లు కనిపిస్తున్నాయి.. ప్రభుత్వ పథకాలు, వాటితో ప్రయోజనాలు, చేపట్టిన ప్రాజెక్టులు.. ఇలా అనేక విషయాలను వివరిస్తూ ఫ్లెక్సీలు పెట్టారు.. అయితే, ఇదే సమయంలో.. తమకు హోర్డింగ్లు, ఫ్లెక్సీలు పెట్టుకునే వీలు లేకుండా.. టీఆర్ఎస్ చీప్ పాలిటిక్స్ చేస్తోందని మండిపడుతున్నారు బీజేపీ నేతలు.. హైదరాబాద్లో మీడియాతో మాట్లాడిన బీజేపీ నేత లక్ష్మణ్.. మెట్రో పిల్లర్లు కూడా కబ్జా చేశారు.. అధికారం ఉందని, డబ్బు ఉందని మీరు చేస్తున్న ప్రతి దానిని ప్రజలు గమనిస్తున్నారు.. వాళ్లు చీప్ పాలిటిక్స్కు పాల్పడుతున్నారని మండిపడ్డారు.. ఇక, హెచ్ఐసీసీ ముట్టడికి పిలుపులపై స్పందించిన లక్ష్మణ్.. ప్రజాస్వామ్య పద్ధతుల ద్వారా నిరసనలు తెలిపే అధికారం ఉంది.. కానీ, సభను అడ్డుకోవడం మంచి సంప్రదాయం కాదని హితవుపలికారు లక్ష్మణ్.
Read Also: PM Modi security: ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటన.. పటిష్ట బందోబస్తు ఏర్పాటు..
Also Read
- Telangana: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి భారీగా పెంపు..
- Petrol Price Hike: హైదరాబాద్లో మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఐదు రోజుల్లో రెండోసారి షాక్!
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- Loan: అప్పు ఇచ్చి మర్చిపోవాల్సిందే.. మళ్లీ అడిగారో కాటికే..
ఇక, తెలంగాణ గడ్డ మీద భాగ్యనగర్ వేదికగా జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి.. బీజేపీ అగ్ర నాయకత్వం హాజరు అవుతున్న ఈ మీటింగ్స్ చారిత్రాత్మక సమావేశాలు… 20 ఏళ్ల తర్వాత హైదరాబాద్ లో కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయని తెలిపారు లక్ష్మణ్.. ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభకు విజయ సంకల్ప సభగా పేరు పెట్టామని తెలిపిన ఆయన.. అధర్మం పైన ధర్మం గెలుపు కోసం… కుటుంబ, అవినీతి పాలన కు వ్యతిరేకంగా పోరాడుతున్న బీజేపీకి ప్రజలు మద్దతు ఇస్తారనే ఈ సంకల్ప సభ నిర్వహిస్తున్నామని వెల్లడించారు. తెలంగాణ కోసం అమరులు అయిన వారి కన్న కలలు నెరవేరుస్తామని చెప్పేందుకే సంకల్ప సభ అన్నారు. అయితే, కిరాయి రాజకీయ బ్రోకర్లను నమ్ముకొని రాజకీయాలు చేస్తున్నారు…. ఫ్లెక్సీ రాజకీయాలు చేసే స్థాయికి కేసీఆర్ దిగిపోయారు అంటూ ఫైర్ అయ్యారు.. పుత్ర వాత్సల్యంతో తెలంగాణ ప్రజలను కేసీఆర్ మోసం చేస్తున్నారు. స్వచ్ఛ, సమర్థ, నీతివంతమైన పాలనను తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. ఇక, బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా.. వివిధ కమ్యూనిటీలకు చెందిన 16 సమావేశాలను నిర్వహిస్తున్నామని తెలిపారు బీజేపీ నేత లక్ష్మణ్.
తాజావార్తలు
-
Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో భారీ చార్జ్షీట్ దాఖలు.. 25 మందిపై అభియోగాలు
-
Investment Tips: హోమ్ లోన్ తీర్చాలా? ఇన్వెస్ట్ చేయాలా? చేతికి బోనస్ వస్తే ఏది బెస్ట్ ఆప్షన్! నిపుణులు చెబుతున్నది ఇదే..
-
Ishan Kishan Celebration: స్టేడియం ఖాళీ చేయండి, ఇంటికి వెళ్లిపోండి.. సీఎస్కే అభిమానులను అవమానించిన ఇషాన్ ఇషాన్!
-
Chand Mera Dil: అనన్యా పాండే మూవీకి సెన్సార్ షాక్..10 సెకన్ల కిస్ సీన్ డిలీట్
-
Washing Machine Tips: వాషింగ్ మెషీన్లో ఈ 2 పదార్థాలు కలిపితే చాలు.. మీ బట్టలు కొత్తవాటిలా మెరిసిపోతాయి..!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!