TS Vs AP: తెలంగాణలో ఏపీ పోలీసుల వ్యవహారం.. ఉద్యోగానికి సెలవు పెట్టి గంజాయి స్మగ్లింగ్
TS Vs AP: నేరాలను అరికట్టాల్సిన పోలీసులే అడ్డదారులు తొక్కి నేరస్తులుగా మారారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఉద్యోగానికి సెలవుపై వెళ్లి గంజాయి స్మగ్లింగ్కు యత్నించిన ఉదంతం తెలంగాణలో వెలుగు చూసింది. ఇద్దరు ఏపీ పోలీసులు గంజాయి ప్యాకెట్లతో హైదరాబాద్ పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మొత్తానికి పోలీస్ డిపార్ట్మెంట్నే ఉలిక్కిపడేలా ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
Read also: Kishan Reddy: గ్రూప్-1 నోటిఫికేషన్ ఎప్పుడు?.. ప్రభుత్వానికి కిషన్ రెడ్డి ప్రశ్న?
Also Read
- TIMS Sanathnagar: సనత్నగర్ వాసులకు శుభవార్త.. శుక్రవారం నుంచి టిమ్స్లో వైద్య సేవలు ప్రారంభం..!
- Telangana Fuel Supply : తెలంగాణలో ఇంధన సంక్షోభానికి సర్కార్ చెక్
- Bhatti Vikramarka : ప్రజలకు ఇబ్బంది కలగకుండా విద్యుత్ సరఫరా చేయడమే ప్రభుత్వ లక్ష్యం
- Tragedy : పాఠశాల ముందు మృత్యువు..! ఐదేళ్ల చిన్నారి ప్రాణం తీసిన నిర్లక్ష్యం
హెడ్ కానిస్టేబుల్ సాగర్ పట్నాయక్ (35), కానిస్టేబుల్ శ్రీనివాస్ (32) పశ్చిమగోదావరి జిల్లా కాకినాడ మూడో బెటాలియన్లో పనిచేస్తున్నారు. నెలనెలా వచ్చే జీతంతో జీవితం హాయిగా సాగిపోతున్నా వారికి సంతృప్తి ఇచ్చేలా కనిపించడం లేదు. గంజాయి స్మగ్లింగ్ ద్వారా లక్షలకు లక్షలు ఆర్జించాలని ఆశచూపి ఈ ఇద్దరు పోలీసు స్మగ్లర్లుగా మారారు. అనారోగ్య కారణాలతో పోలీసు ఉద్యోగానికి సెలవు తీసుకున్న సాగర్, శ్రీనివాస్ నర్సీపట్నంలో గంజాయి సేకరించారు. ఈ ఇద్దరు కలిసి కారులో గంజాయిని హైదరాబాద్కు తరలించారు. అయితే ఈ గంజాయి స్మగ్లింగ్పై పక్కా సమాచారం అందుకున్న బాలానగర్ ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. అర్ధరాత్రి వారిద్దరూ బాచుపల్లికి చేరుకోగానే వారిపై దాడి చేసి అనుమానంతో AP 39 QH 1763 MARUTHI ECO వాహనాన్ని పట్టుకుని పరిశీలించగా 22 కేజీల గంజాయి, 11 ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.
గంజాయి ప్యాకెట్లతో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన సాగర్, శ్రీనివన్లను ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకుని బాచుపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. వాహనంలో ఉన్న వ్యక్తులను విచారించగా కాకినాడ లోని 3rd బెటాలియన్ APSP చెందిన ఒక హెడ్ కానిస్టేబుల్, మరో కానిస్టేబుల్ అని తెలిసింది. విచారణలో వారు చెప్పిన వివరాలు విని పోలీసులు ఆశ్చర్యపోయారు. వారిద్దరూ ఏపీ పోలీసులని ఆరోగ్యం బాగాలేదని చెప్పి గంజాయి స్మగ్లింగ్కు ప్రయత్నించినట్లు విచారణలో తేలింది. వీరి నుంచి స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ.8 లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. బాచుపల్లీ పోలీస్ స్టేషన్ లో విచారణ జరుగుతుంది.
Mason Jobs: డిమాండ్ అలా ఉంది మరి..! తాపీ మేస్త్రీయా మజాకా..! నెలజీతం రూ.4.47 లక్షలు
తాజావార్తలు
-
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
-
OnePlus Realme Merger: విలీనం కానున్న వన్ప్లస్, రియల్మీ..!?
-
Muttiah Muralitharan: “ఐపీఎల్ అంటేనే వ్యాపారం.. క్రికెట్ ఎక్కడుంది?”.. SRH కోచ్ షాకింగ్ కామెంట్స్!
-
Silver Price: సిల్వర్ మార్కెట్ హీట్.. వెండి ధరల్లో అనూహ్య మార్పులు..
-
West Bengal: బెంగాల్లో తృణమూల్ హైడ్రామా.. స్ట్రాంగ్ రూం ముందు ఆందోళన..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!