TS Vs AP: తెలంగాణలో ఏపీ పోలీసుల వ్యవహారం.. ఉద్యోగానికి సెలవు పెట్టి గంజాయి స్మగ్లింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TS Vs AP: నేరాలను అరికట్టాల్సిన పోలీసులే అడ్డదారులు తొక్కి నేరస్తులుగా మారారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఉద్యోగానికి సెలవుపై వెళ్లి గంజాయి స్మగ్లింగ్కు యత్నించిన ఉదంతం తెలంగాణలో వెలుగు చూసింది. ఇద్దరు ఏపీ పోలీసులు గంజాయి ప్యాకెట్లతో హైదరాబాద్ పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మొత్తానికి పోలీస్ డిపార్ట్మెంట్నే ఉలిక్కిపడేలా ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
Read also: Kishan Reddy: గ్రూప్-1 నోటిఫికేషన్ ఎప్పుడు?.. ప్రభుత్వానికి కిషన్ రెడ్డి ప్రశ్న?
Also Read
- Work From Bike: వర్క్ ఫ్రం హోం పోయింది.. వర్క్ ఫ్రం బైక్ వచ్చేసింది.. వీడియో వైరల్..
- Hyderabd Weather Update : హైదరాబాద్లో కారుమబ్బులతో కమ్మేసిన ఆకాశం.. ఎల్లో అలెర్ట్.!
- Bhatti Vikramarka : ఆలయాల అభివృద్ధికి రూ. 2,216 కోట్లు.. భట్టి కీలక ప్రకటన
- Hyderabad: వనస్థలిపురంలో అక్రమ 'లింగ నిర్ధారణ' రాకెట్ భగ్నం.!
హెడ్ కానిస్టేబుల్ సాగర్ పట్నాయక్ (35), కానిస్టేబుల్ శ్రీనివాస్ (32) పశ్చిమగోదావరి జిల్లా కాకినాడ మూడో బెటాలియన్లో పనిచేస్తున్నారు. నెలనెలా వచ్చే జీతంతో జీవితం హాయిగా సాగిపోతున్నా వారికి సంతృప్తి ఇచ్చేలా కనిపించడం లేదు. గంజాయి స్మగ్లింగ్ ద్వారా లక్షలకు లక్షలు ఆర్జించాలని ఆశచూపి ఈ ఇద్దరు పోలీసు స్మగ్లర్లుగా మారారు. అనారోగ్య కారణాలతో పోలీసు ఉద్యోగానికి సెలవు తీసుకున్న సాగర్, శ్రీనివాస్ నర్సీపట్నంలో గంజాయి సేకరించారు. ఈ ఇద్దరు కలిసి కారులో గంజాయిని హైదరాబాద్కు తరలించారు. అయితే ఈ గంజాయి స్మగ్లింగ్పై పక్కా సమాచారం అందుకున్న బాలానగర్ ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. అర్ధరాత్రి వారిద్దరూ బాచుపల్లికి చేరుకోగానే వారిపై దాడి చేసి అనుమానంతో AP 39 QH 1763 MARUTHI ECO వాహనాన్ని పట్టుకుని పరిశీలించగా 22 కేజీల గంజాయి, 11 ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.
గంజాయి ప్యాకెట్లతో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన సాగర్, శ్రీనివన్లను ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకుని బాచుపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. వాహనంలో ఉన్న వ్యక్తులను విచారించగా కాకినాడ లోని 3rd బెటాలియన్ APSP చెందిన ఒక హెడ్ కానిస్టేబుల్, మరో కానిస్టేబుల్ అని తెలిసింది. విచారణలో వారు చెప్పిన వివరాలు విని పోలీసులు ఆశ్చర్యపోయారు. వారిద్దరూ ఏపీ పోలీసులని ఆరోగ్యం బాగాలేదని చెప్పి గంజాయి స్మగ్లింగ్కు ప్రయత్నించినట్లు విచారణలో తేలింది. వీరి నుంచి స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ.8 లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. బాచుపల్లీ పోలీస్ స్టేషన్ లో విచారణ జరుగుతుంది.
Mason Jobs: డిమాండ్ అలా ఉంది మరి..! తాపీ మేస్త్రీయా మజాకా..! నెలజీతం రూ.4.47 లక్షలు
తాజావార్తలు
-
Ragi Halwa: ముప్పై దాటిన మహిళల హెల్త్ కోసం బెస్ట్ స్వీట్.. రాగి పిండితో నోరూరించే హెల్దీ హల్వా!
-
IND vs AFG: ధర్మశాలలో గుర్బాజ్ సెంచరీతో విశ్వరూపం.. ఒకే ఇన్నింగ్స్తో భారత్పై బద్దలైన రికార్డులు…
-
Jaishankar-Rubio: హార్ముజ్లో అమెరికా ఆదేశాలు పాటించాల్సిందే.. జైశంకర్కు రూబియో సూచన
-
Maharashtra Politics: మహారాష్ట్రలో ‘ఆపరేషన్ టైగర్’ కలకలం.. షిండే గూటికి ఉద్ధవ్ ఎంపీలు జంప్! మాతోశ్రీలో అర్జెంట్ మీటింగ్..
-
Trump: రేపు ట్రంప్ 80వ బర్త్డే.. వైట్హౌస్లో ప్రత్యేక ఏర్పాట్లు
ట్రెండింగ్
-
Garlic for High Cholesterol: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల బ్లాక్స్ తగ్గుతాయా..?
-
Home Remedies : ఇంట్లో చీమల బెడదా.? 2 పదార్థాలతో శాశ్వత పరిష్కారం.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు బెడదా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Nilufer: టర్కీ యువరాణి నుంచి హైదరాబాద్ ప్రజల ఆరాధ్యురాలిగా.. ‘నీలోఫర్’ అసాధారణ ప్రయాణం.!
-
Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!