సైబర్ నేరగాళ్లకు కొంత మంది కంత్రీగాళ్లు.. మ్యూల్ ఖాతాలు సమకూర్చుతున్నారు. వాటి ద్వారా సైబర్ క్రిమినల్స్.. తాము నేరాల్లో సంపాదించిన డబ్బును మళ్లించి.. చివరికి తమ ఖాతాలకు బదిలీ చేసుకుంటున్నారు. ఫలితంగా సైబర్ నేరం జరిగినా.. అసలైన నేరస్తులను పట్టుకునేందుకు పోలీసులకు సమయం పడుతోంది. ఈ క్రమంలో పోలీసులు ఆపరేషన్ క్రాక్ డౌన్ పేరుతో సెర్చింగ్ స్టార్ట్ చేశారు. ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లాలో రూ. 31 కోట్ల లావాదేవీలు జరిగిన మ్యూల్ ఖాతాలను గుర్తించారు. ఈ…
నాగర్ కర్నూల్ జిల్లాలోని తిమ్మజిపేట ఎస్సై హరిప్రసాద్ రెడ్డి రూ. 25 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ (ACB) అధికారులకు రెడ్ హ్యాండెడ్గా చిక్కారు. ఇసుక అక్రమ రవాణా కేసులో సీజ్ చేసిన ట్రాక్టర్ , జేసీబీని వదిలిపెట్టడానికి ఆయన ఈ మొత్తాన్ని డిమాండ్ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు, ఎస్సై డబ్బులు తీసుకుంటుండగా అదుపులోకి తీసుకున్నారు. TVS Apache RTR 160 4V: యువకుల ఫేవరెట్ బైక్..…
కరీంనగర్ జిల్లాలో సంచలనం సృష్టించిన ‘ఆపరేషన్ క్రాక్డౌన్ 1.0’ ద్వారా భారీ ఆర్థిక కుంభకోణాన్ని పోలీసులు ఛేదించారు. జిల్లాలోని కిసాన్నగర్ ఆర్బీఎల్ (RBL) బ్యాంక్ బ్రాంచ్ కేంద్రంగా జరిగిన ఈ భారీ స్కామ్లో సుమారు రూ.137 కోట్ల అక్రమ లావాదేవీలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. చైనాకు చెందిన కొందరు వ్యక్తులతో చేతులు కలిపి స్థానిక యువత ఈ మోసాలకు పాల్పడటం గమనార్హం. కుంభకోణం ఎలా జరిగింది..? ఈ ముఠా ప్రధానంగా ‘మ్యూల్ ఖాతాల’ (Mule Accounts) నెట్వర్క్ను…
మెదక్ జిల్లాలోని హవేలి ఘన్ పూర్ లో దారుణం చోటు చేసుకుంది. మద్యసేవించేందుకు డబ్బులు లేకపోవడంతో కన్నబిడ్డను అమ్మేసింది కసాయి తల్లి. వివరాల్లోకి వెళితే.. లింగసానిపల్లి తండాకు చెందిన మంజుల అనే మహిళకు గత నెల 10వ తేదీన మగ బిడ్డ పుట్టాడు. మంజుల గత కొన్నాళ్లుగా మహిపాల్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. వీరిద్దరికీ మద్యం అలవాటు ఉంది. మద్యానికి డబ్బులు లేకపోవడంతో, ప్రియుడు మహిపాల్తో కలిసి తన పసిబిడ్డను కామారెడ్డికి చెందిన ఒక దంపతులకు…
CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు అభివృద్ధి లక్ష్యాలను చేరుకోవడంలో పోలీస్ శాఖ పోషించాల్సిన పాత్రపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. పోలీస్ అధికారుల రీట్రీట్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, సమాజం ఎదుర్కొంటున్న ఆధునిక సవాళ్లను పోలీస్ వ్యవస్థ సమర్థవంతంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. ఏదైనా సమస్యను లోతుగా అధ్యయనం చేసి, అందులోని సాంకేతిక అంశాలను అర్థం చేసుకున్నప్పుడే పరిష్కారం లభిస్తుందని, అలా అవగాహన పెంచుకున్నప్పుడే 50 శాతం సమస్య పరిష్కారం…
Maoist leaders surrender: మావోయిస్టులకు పెద్ద దెబ్బ తగిలింది. దశాబ్దాలుగా అజ్ఞాతంలో ఉండి పార్టీ కార్యకలాపాలను నడిపించిన నలుగురు అత్యంత సీనియర్ నాయకులు పోలీసుల ముందు లొంగిపోయారు. తెలంగాణ రాష్ట్ర డీజీపీ సమక్షంలో ఈ లొంగుబాటు కార్యక్రమం జరిగింది. పొలిట్ బ్యూరో సభ్యుడు (PBM) తిప్పిరి తిరుపతి అలియాస్ దేవుజి అలియాస్ కుమ్మ దాదా, సెంట్రల్ కమిటీ సభ్యుడు (CCM) మల్లారాజి రెడ్డి అలియాస్ రంగారం, తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్…
HYD PUJARIKI JAIL: చేసేది గుళ్లో పౌరోహిత్యం.. కానీ ఆ పూజారి కాస్తా.. బంగారం కోసం వైల్డ్ క్రిమినల్గా మారాడు. ఒంటరిగా గుడికి వచ్చిన వృద్ధ మహిళను టార్గెట్ చేసుకున్నాడు. అత్యంత దారుణంగా ఆమెను గుళ్లోనే హతమార్చాడు. ఆమె ఒంటిపై ఉన్న నగలు దోచుకున్నాడు. సీన్ కట్ చేస్తే పోలీసులకు చిక్కాడు. కోర్టులో హజరుపరచడంతో అతనికి న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.2022లో మేడ్చల్ జిల్లా మల్కాజిగిరిలో జరిగిన మహిళ హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు…
HYD DRUGS ARREST: స్మగ్లర్లు తెలివిమీరిపోతున్నారు. పుష్ప రేంజ్లో డ్రగ్స్ అక్రమ రవాణాకు ప్లాన్ చేస్తున్నారు. పోలీసుల కళ్లుగప్పి అక్రమ దందాను కొనసాగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అలాంటి ముఠాలపై గట్టి నిఘా పెట్టిన పోలీసులు.. ఒక రోజు కాకపోయినా మరో రోజైనా పట్టుకుంటున్నారు. తాజాగా కొత్త తరహాలో డ్రగ్స్ దందా చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు.
రాజధాని నగరంలో పోకిరీల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. సైరన్లు వేసుకుంటూ రోడ్లపై హంగామా సృష్టించడమే కాకుండా, ప్రశ్నించిన వారిని ప్రాణాలతోనే ఈడ్చుకెళ్లే స్థాయికి వీరి ఉన్మాదం చేరింది. కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో తాజాగా చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఒక సామాన్య ప్రైవేట్ ఉద్యోగిని బొలెరో కారుతో ఢీకొట్టి, కిలోమీటరు దూరం ఈడ్చుకెళ్లి, అతని ప్రాణాలను గాలిలో కలిపే ప్రయత్నం చేశారు కొందరు యువకులు. బాధిత కుటుంబ సభ్యులు , స్థానికులు…
S*x Racket Busted in Hyderabad: హైదరాబాద్లోని కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ (KPHB) పరిధిలో స్పా సెంటర్ల పేరుతో సాగుతున్న అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. కేపీహెచ్బీ 6వ ఫేజ్లోని గాయత్రి రెసిడెన్సీలో ఉన్న ‘ఆసన వెల్నెస్ స్పా’ సెంటర్లో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం జరుగుతుందన్న పక్కా సమాచారంతో పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పోలీసులు మొత్తం 15 మంది యువతులను, 30 మంది పురుషులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ముగ్గురు నిర్వాహకులు…