Maoist leaders surrender: మావోయిస్టులకు పెద్ద దెబ్బ తగిలింది. దశాబ్దాలుగా అజ్ఞాతంలో ఉండి పార్టీ కార్యకలాపాలను నడిపించిన నలుగురు అత్యంత సీనియర్ నాయకులు పోలీసుల ముందు లొంగిపోయారు. తెలంగాణ రాష్ట్ర డీజీపీ సమక్షంలో ఈ లొంగుబాటు కార్యక్రమం జరిగింది. పొలిట్ బ్యూరో సభ్యుడు (PBM) తిప్పిరి తిరుపతి అలియాస్ దేవుజి అలియాస్ కుమ్మ దాదా, సెంట్రల్ కమిటీ సభ్యుడు (CCM) మల్లారాజి రెడ్డి అలియాస్ రంగారం, తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్…
HYD PUJARIKI JAIL: చేసేది గుళ్లో పౌరోహిత్యం.. కానీ ఆ పూజారి కాస్తా.. బంగారం కోసం వైల్డ్ క్రిమినల్గా మారాడు. ఒంటరిగా గుడికి వచ్చిన వృద్ధ మహిళను టార్గెట్ చేసుకున్నాడు. అత్యంత దారుణంగా ఆమెను గుళ్లోనే హతమార్చాడు. ఆమె ఒంటిపై ఉన్న నగలు దోచుకున్నాడు. సీన్ కట్ చేస్తే పోలీసులకు చిక్కాడు. కోర్టులో హజరుపరచడంతో అతనికి న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.2022లో మేడ్చల్ జిల్లా మల్కాజిగిరిలో జరిగిన మహిళ హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు…
HYD DRUGS ARREST: స్మగ్లర్లు తెలివిమీరిపోతున్నారు. పుష్ప రేంజ్లో డ్రగ్స్ అక్రమ రవాణాకు ప్లాన్ చేస్తున్నారు. పోలీసుల కళ్లుగప్పి అక్రమ దందాను కొనసాగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అలాంటి ముఠాలపై గట్టి నిఘా పెట్టిన పోలీసులు.. ఒక రోజు కాకపోయినా మరో రోజైనా పట్టుకుంటున్నారు. తాజాగా కొత్త తరహాలో డ్రగ్స్ దందా చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు.
రాజధాని నగరంలో పోకిరీల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. సైరన్లు వేసుకుంటూ రోడ్లపై హంగామా సృష్టించడమే కాకుండా, ప్రశ్నించిన వారిని ప్రాణాలతోనే ఈడ్చుకెళ్లే స్థాయికి వీరి ఉన్మాదం చేరింది. కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో తాజాగా చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఒక సామాన్య ప్రైవేట్ ఉద్యోగిని బొలెరో కారుతో ఢీకొట్టి, కిలోమీటరు దూరం ఈడ్చుకెళ్లి, అతని ప్రాణాలను గాలిలో కలిపే ప్రయత్నం చేశారు కొందరు యువకులు. బాధిత కుటుంబ సభ్యులు , స్థానికులు…
S*x Racket Busted in Hyderabad: హైదరాబాద్లోని కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ (KPHB) పరిధిలో స్పా సెంటర్ల పేరుతో సాగుతున్న అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. కేపీహెచ్బీ 6వ ఫేజ్లోని గాయత్రి రెసిడెన్సీలో ఉన్న ‘ఆసన వెల్నెస్ స్పా’ సెంటర్లో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం జరుగుతుందన్న పక్కా సమాచారంతో పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పోలీసులు మొత్తం 15 మంది యువతులను, 30 మంది పురుషులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ముగ్గురు నిర్వాహకులు…
విధి నిర్వహణలో గంజాయి మాఫియా పాలిట సింహస్వప్నంగా మారి, వీరమరణం పొందిన ఎక్సైజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్య (26) సాహసం యావత్ రాష్ట్రాన్ని కన్నీరు పెట్టించింది. ప్రాణాలకు తెగించి గంజాయి ముఠాను అడ్డుకున్న ఆమె మృతి పట్ల ప్రభుత్వం భారీ పరిహారాన్ని ప్రకటించింది. విధి నిర్వహణలో చేరిన ఏడాది కాలంలోనే ఆమె చూపిన తెగువ, గంజాయి ముఠాను పట్టుకోవడంలో ఆమె కనబరిచిన పట్టుదల పోలీసు శాఖలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. సామాన్య కానిస్టేబుల్ స్థాయి నుంచి అసామాన్య పోరాటాన్ని…
హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న కోఠి బ్యాంక్ స్ట్రీట్లో శుక్రవారం ఉదయం జరిగిన తుపాకీ కాల్పులు, భారీ దోపిడీ ఉదంతం నగరాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ఏటీఎం సెంటర్లో నగదు డిపాజిట్ చేస్తున్న వ్యాపారిపై కాల్పులు జరిపి ₹6 లక్షలు దోచుకెళ్లిన ఈ కేసును పోలీసులు అత్యంత సవాలుగా తీసుకున్నారు. ప్రస్తుతం ఈ దర్యాప్తులో పోలీసులకు కీలకమైన ఆధారాలు లభించాయి. నిందితులిద్దరూ నేరం చేసిన వెంటనే అత్యంత వ్యూహాత్మకంగా నగరం విడిచి పరారైనట్లు పోలీసులు గుర్తించారు. కేరళ రాష్ట్రం…
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. మొత్తం 116 మున్సిపాలిటీలు , 7 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 52,43,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఎన్నికల ప్రధాన ఘట్టాలు కింది విధంగా ఉన్నాయి.. Online Dating App Scam: దూల తీర్చేసిన డేటింగ్ యాప్.. గంట ముచ్చటకి నెల జీతం హాంఫట్! ఎన్నికల కీలక షెడ్యూల్…
హైదరాబాద్ కూకట్పల్లిలో నిషేధిత చైనా మాంజా ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. సంగారెడ్డి జిల్లా కాజీపల్లికి చెందిన తండ్రి తన ఇద్దరు కుమార్తెలతో కలిసి బైక్పై కూకట్పల్లికి వస్తుండగా, వివేకానందనగర్ జాతీయ రహదారి వద్ద గాలిపటం దారం (చైనా మాంజా) ఐదేళ్ల చిన్నారి నిష్విక ఆదిత్య మెడకు బలంగా చుట్టుకుంది. ఒక్కసారిగా చిన్నారి కేకలు వేయడంతో తండ్రి బైక్ ఆపి చూసేసరికి, మాంజా కోసుకుపోవడంతో మెడ భాగం నుంచి తీవ్ర రక్తస్రావం జరిగింది. Chiranjeevi : పద్మశ్రీ…
ప్రజా రక్షణ , సేవే లక్ష్యంగా తెలంగాణ పోలీస్ శాఖ, సామాన్యులకు భరోసా కల్పించేందుకు మరో కీలక అడుగు వేసింది. సాధారణంగా ఏదైనా ఆపద కలిగినా లేదా నేరం జరిగినా బాధితులు పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. అయితే, వివిధ కారణాల వల్ల పోలీస్ స్టేషన్కు రాలేని వారి కోసం, పోలీసులు నేరుగా బాధితుల ఇంటికే వెళ్లి ఫిర్యాదులు స్వీకరించే వినూత్న వెసులుబాటును కల్పించనున్నారు. నేరాలకు గురైన వారు భయాందోళనలో ఉన్నప్పుడు లేదా వృద్ధాప్యం,…