Gold and Silver Prices: ఇరాన్-ఇజ్రాయెల్ పోరుతో కొండెక్కుతున్న బంగారం, వెండి ధరలు!
Gold and Silver Prices: మధ్యప్రాచ్యంలో ముదిరిన ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావాన్ని చూపుతోంది. ప్రస్తుతం ఈ రెండు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం, వెండి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. భారత ఎంసీఎక్స్ (MCX) మార్కెట్లో బంగారం ధరలు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. యుద్ధం తీవ్రతరం కావడంతో పెట్టుబడిదారులు స్టాక్ మార్కెట్ నుంచి తమ డబ్బును బయటికి తీసుకొని, బంగారంలో పెట్టుబడి పెడుతున్నారు. అనిశ్చిత సమయాల్లో బంగారం ఎప్పుడూ ‘సేఫ్ హెవెన్’గా పరిగణించబడుతుందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇరాన్-ఇజ్రాయెల్ పోరుతో బంగారం, వెండి ధరలు ఎలా మారబోతున్నాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: Pakistan vs Sri Lanka: శ్రీలంక చేతిలో పాక్ జుట్టు.. ఈ తప్పు చేస్తే ఇంటికే!
Also Read
- Stock Market: కోలుకున్న మార్కెట్.. భారీ లాభాల్లో సూచీలు
- House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
- Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
- Senior Citizen FD: సీనియర్ సిటిజన్లకు FDలో అత్యధిక రాబడి.. ఏ బ్యాంకులు ఉత్తమం? పూర్తి వివరాలు
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ప్రస్తుతం రూ.1,61,720 వద్ద ఉంది. ఈ ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే, త్వరలోనే తులాం బంగారం ధర రూ.2 లక్షల మార్కును చేరుకోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇదే సమయంలో బంగారంతో పాటు వెండి కూడా రికార్డు స్థాయికి చేరుకుంటోంది. పారిశ్రామిక డిమాండ్, సరఫరా గొలుసులో అంతరాయాల కారణంగా వెండి ధరలు గణనీయంగా పెరిగాయని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2,85,000 వద్ద ట్రేడవుతోంది. కేవలం శుక్రవారం రోజే కిలో వెండిపై రూ.16,000 వరకు పెరగడం మార్కెట్ విశ్లేషకులను విస్మయానికి గురిచేస్తోంది.
సామాన్యుడిపై భారం..
ఈ ధరల పెరుగుదల కేవలం పెట్టుబడిదారులకే కాదు, సామాన్య ప్రజలకు కూడా కష్టాలను తెచ్చిపెడుతోందని నిపుణులు చెబుతున్నారు. పెళ్లిళ్ల సమయంలో ఆభరణాలు కొనడం సామాన్యుల బడ్జెట్ను తలకిందులు చేస్తోందని చెబుతున్నారు. యుద్ధం కారణంగా ముడి చమురు ధరలు పెరిగే అవకాశం ఉండటంతో, నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగి ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం మార్కెట్ చాలా అస్థిరంగా ఉంది, కాబట్టి నిపుణులు పెట్టుబడిదారులకు పలు సూచనలు చేస్తున్నారు. భారీ మొత్తంలో ఒకేసారి పెట్టుబడి పెట్టకుండా, ధరలు కొంచెం తగ్గినప్పుడు చిన్నచిన్న మొత్తాల్లో బంగారాన్ని కొనడం ఉత్తమం అని చెబుతున్నారు. యుద్ధ పరిస్థితిపై స్పష్టత వచ్చే వరకు మార్కెట్ ఒడిదుడుకులకు లోనవుతుందని, కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలని అన్నారు.
READ ALSO: Trump Bans Anthropic: AI ప్రపంచంలో సంచలనం సృష్టించిన ట్రంప్ .. అమెరికాలో ‘ఆంత్రోపిక్’ క్లోజ్!
తాజావార్తలు
-
Hero Dupes: డబ్బు పెట్టే వాడికి లేని నొప్పి మనకెందుకు? .. జేడీ కీలక వ్యాఖ్యలు
-
Jyoti Poorvaj : అందాలతో మంట రాజేస్తున్న జ్యోతి పూర్వాజ్
-
Kidney Stones Rising in Summer: వేసవిలో కిడ్నీల్లో పెరిగిపోతున్న రాళ్లు.. ఇలా చెక్ పెట్టండి..!
-
Ajit Doval: యూఏఈలో అజిత్ దోవల్ పర్యటన.. దౌత్య సంబంధాలపై చర్చ
-
Maro Charitra: ఆ ఒక సినిమా వల్ల.. 20 జంటలు ఆత్మహత్య?
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!