Gold and Silver Prices: ఇరాన్-ఇజ్రాయెల్ పోరుతో కొండెక్కుతున్న బంగారం, వెండి ధరలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gold and Silver Prices: మధ్యప్రాచ్యంలో ముదిరిన ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావాన్ని చూపుతోంది. ప్రస్తుతం ఈ రెండు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం, వెండి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. భారత ఎంసీఎక్స్ (MCX) మార్కెట్లో బంగారం ధరలు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. యుద్ధం తీవ్రతరం కావడంతో పెట్టుబడిదారులు స్టాక్ మార్కెట్ నుంచి తమ డబ్బును బయటికి తీసుకొని, బంగారంలో పెట్టుబడి పెడుతున్నారు. అనిశ్చిత సమయాల్లో బంగారం ఎప్పుడూ ‘సేఫ్ హెవెన్’గా పరిగణించబడుతుందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇరాన్-ఇజ్రాయెల్ పోరుతో బంగారం, వెండి ధరలు ఎలా మారబోతున్నాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: Pakistan vs Sri Lanka: శ్రీలంక చేతిలో పాక్ జుట్టు.. ఈ తప్పు చేస్తే ఇంటికే!
Also Read
- Crude Oil Prices Fall: ముడి చమురు ధరలపై గుడ్ న్యూస్.. బ్యారెల్ ధర 70 డాలర్లకు పడిపోవచ్చు..!
- Darecation Explained: డబ్బులిచ్చి మరీ భయాన్ని కొంటున్నారు.. ట్రావెలింగ్లో నయా ట్రెండ్
- Carlsberg IPO: ప్రపంచంలోనే అత్యంత పురాతన బియర్ బ్రాండ్ ఐపీఓ.. వివరాలు ఇవే!
- HDFC Bank MCLR Hike: కస్టమర్లకు షాకిచ్చిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్.. మరింత భారంగా EMIలు
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ప్రస్తుతం రూ.1,61,720 వద్ద ఉంది. ఈ ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే, త్వరలోనే తులాం బంగారం ధర రూ.2 లక్షల మార్కును చేరుకోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇదే సమయంలో బంగారంతో పాటు వెండి కూడా రికార్డు స్థాయికి చేరుకుంటోంది. పారిశ్రామిక డిమాండ్, సరఫరా గొలుసులో అంతరాయాల కారణంగా వెండి ధరలు గణనీయంగా పెరిగాయని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2,85,000 వద్ద ట్రేడవుతోంది. కేవలం శుక్రవారం రోజే కిలో వెండిపై రూ.16,000 వరకు పెరగడం మార్కెట్ విశ్లేషకులను విస్మయానికి గురిచేస్తోంది.
సామాన్యుడిపై భారం..
ఈ ధరల పెరుగుదల కేవలం పెట్టుబడిదారులకే కాదు, సామాన్య ప్రజలకు కూడా కష్టాలను తెచ్చిపెడుతోందని నిపుణులు చెబుతున్నారు. పెళ్లిళ్ల సమయంలో ఆభరణాలు కొనడం సామాన్యుల బడ్జెట్ను తలకిందులు చేస్తోందని చెబుతున్నారు. యుద్ధం కారణంగా ముడి చమురు ధరలు పెరిగే అవకాశం ఉండటంతో, నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగి ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం మార్కెట్ చాలా అస్థిరంగా ఉంది, కాబట్టి నిపుణులు పెట్టుబడిదారులకు పలు సూచనలు చేస్తున్నారు. భారీ మొత్తంలో ఒకేసారి పెట్టుబడి పెట్టకుండా, ధరలు కొంచెం తగ్గినప్పుడు చిన్నచిన్న మొత్తాల్లో బంగారాన్ని కొనడం ఉత్తమం అని చెబుతున్నారు. యుద్ధ పరిస్థితిపై స్పష్టత వచ్చే వరకు మార్కెట్ ఒడిదుడుకులకు లోనవుతుందని, కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలని అన్నారు.
READ ALSO: Trump Bans Anthropic: AI ప్రపంచంలో సంచలనం సృష్టించిన ట్రంప్ .. అమెరికాలో ‘ఆంత్రోపిక్’ క్లోజ్!
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!