పార్టీ గుర్తు మీద జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లోనూ ప్రజలు వైసీపీ ని ఆశీర్వదిస్తున్నారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైసీపీ స్వీప్ చేస్తుంది అని తెలిసే చంద్రబాబు గత ఏడాది కోవిడ్ వంకతో వాయిదా వేయించారని అన్నారు. సంక్షోభ సమయంలోనూ ప్రభుత్వం ప్రజలకు భరోసా ఇచ్చిన తీరు కూడా ఈ ఫలితాలకు ఒక కారణం అని అన్నారు. ఎస్ఈసీ వాలంటీర్ల పై పెట్టిన ఆంక్షలు అసంబద్ధ అని…
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఏం చేసినా సంచలంగా మారుతుంది.. సంచలన వ్యాఖ్యలే కాదు.. కొన్ని సందర్భాల్లో ఆయన చేసిన కార్యక్రమాలు వైరల్గా మారిపోతుంటాయి.. తాజాగా… విశాఖలోని శారదా పీఠంలో ప్రత్యక్షమయ్యారు నారాయణ.. అక్కడ స్వరూపానందేంద్ర స్వామి ఆశీర్వాదం కూడా తీసుకున్నారు.. అదేంటి కరుడుగట్టిన కమ్యూనిస్టు నారాయణ.. శారదాపీఠం వెళ్లడమేంటి..? అక్కడ ఆశీర్వాదం తీసుకోవడం ఏంటి..? అనే అనుమానం వెంటనే కలగొచ్చు.. విషయం ఏంటంటే.. ఏపీలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి.. జీవీఎంసీలో ఆయన సీపీఐ అభ్యర్థి తరపున…
ఏపీ మంత్రి పేర్ని నాని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. దుర్గ గుడి ఉద్యోగుల అవినీతిపై ఏసీబీ దాడులు చేస్తే మంత్రి వెల్లంపల్లిపై ఆరోపణలు చేయడం శోచనీయమన్నారు. అక్రమాలు సహించేదే లేదంటూ ప్రభుత్వమే తనిఖీలు చేయిస్తోందని… దుర్గగుడి ఉద్యోగులపై ఏసీబీ సోదాల విషయంలో రాజకీయ ఆరోపణలు చేయడం దారుణమని మండిపడ్డారు. దుర్గ గుడి ఈవో తప్పు చేశారని.. లెక్క తేలితే బొక్కలు పగులుతాయని హెచ్చరించారు. అవినీతిని ఊపేక్షించే విషయంలో ఈవో లేదు.. డీవో లేదు.. అందరి మీద…