జోగి రమేష్ వార్నింగ్.. నోరు అదుపులో పెట్టుకోకపోతే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మరోసారి టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు, టీడీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్.. నిన్న చంద్రబాబు నివాసం దగ్గర హల్చల్ చేసి అరెస్ట్ అయిన ఆయన.. ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. సభ్య సమాజం తలదించుకునేలా అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలు ఉన్నాయన్నారు.. సీఎం వైఎస్ జగన్ను, మంత్రులను అసభ్యంగా తిట్టడం వెనుక చంద్రబాబు స్క్రిప్ట్ ఉందని ఆరోపించిన ఆయన.. చంద్రబాబు ఇంటికి నిరసన తెలపటానికి వెళ్తే నాపై దాడి చేశారని మండిపడ్డారు.. కాల్ మనీ సెక్స్ రాకెట్ చేసిన వాళ్లు, గూండాలు, రౌడీలతో చంద్రబాబు దాడి చేయించారని ఆరోపించిన జోగి రమేష్.. ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూల్చటానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని సంచలన కామెంట్లు చేశారు.. అయ్యన్నపాత్రుడి ని సస్పెండ్ చేస్తారో లేక మెచ్చి జాతీయ అధ్యక్షుడిని చేస్తారా? మీ ఇష్టం కానీ.. ప్రభుత్వంపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు.. ఇది ఆరంభం మాత్రమే.. నోరు అదుపులో పెట్టుకోకపోతే చూస్తూ ఊరుకోం అని హెచ్చరించారు.. ఇక, మేం కూడా నిన్నటి ఘటనను గవర్నర్ దృష్టికి తీసుకెళ్తాం అన్నారు వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్.
Also Read
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..