బడ్జెట్ సమావేశాలకు సిద్ధం అవుతోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఈనెల 20వ తేదీన ఒకేరోజు సభ నిర్వహించనున్నారు. అయితే, ఒకేరోజు సమావేశాలు నిర్వహించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది తెలుగుదేశం పార్టీ.. ఈ సమావేశాలను బహిష్కరించాలని నిర్ణయానికి వచ్చారు.. ఒక్కరోజు అసెంబ్లీ సమావేశాలపై పార్టీ నేతల అభిప్రాయాలను సేకరించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. అయితే, మెజార్టీ నేతలు సమావేశాలను బహిష్కరించడమే మంచిదని పార్టీ చీఫ్కు తెలియజేశారు.. కోవిడ్తో సహా అనేక సమస్యలతో రాష్ట్ర ప్రజలు సతమతమవుతున్నారని.. కేసులు, ఇతర…
ఆంధ్ర రాష్ట్రంలో వింత ప్రభుత్వం… వింతైన ముఖ్యమంత్రి వున్నారు అంటూ ఎద్దేవా చేశారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణు కుమార్ రాజు… న్యాయ వ్యవస్థను, న్యాయమూర్తులను కించపరిచేలా అధికార వైసీపీ సోషల్ మీడియా ప్రచారం చేసినప్పుడు అది వ్యవస్థను అస్థిరపరచడం కాదా…!? అంటూ ఫైర్ అయిన ఆయన.. చంద్రబాబును కాల్చాలని నంద్యాల బహిరంగ సభలో జనాన్ని రెచ్చగొట్టిన జగన్ పై కేసులు ఎందుకు నమోదు చేయలేదు… అప్పుడు సీఐడీ ఏం చేస్తోంది..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు……
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు వ్యవహారం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారిపోయింది… రెబల్ ఎంపీపై మండిపడుతోన్న వైసీపీ నేతలు.. ఆయన అరెస్ట్ను సమర్థిస్తూ వస్తున్నారు.. ఇక, ఈ వ్యవహారంపై మీడియాతో మాట్లాడిన ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్… ఎంపీ రఘురామకృష్ణంరాజు గెలిచిన పార్టీని, సీఎంని విమర్శించడం దుర్మార్గం అని ఆగ్రహం వ్యక్తం చేశారు.. రఘురామకృష్ఱంరాజు విలువలు లేని రాజకీయం చేశాడంటూ ఫైర్ అయిన ఆయన.. సంవత్సరం నుండి రాష్ట్రంతో సంబంధాలు…
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది… నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజుకు బెయిలు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. కులాల మధ్య చిచ్చుపెట్టే విధంగా వ్యాఖ్యలు చేశారని, ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ శుక్రవారం హైదరాబాద్ లో ఏపీ సీఐడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే కాగా… బెయిల్ కోసం రఘురామకృష్ణం రాజు పెట్టుకున్న హౌస్ మోషన్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. అయితే, ఆయన బెయిల్ పిటిషన్ను హైకోర్టు డిస్మిస్ చేయడంతో ఆయనకు…
కర్నూలు జిల్లాలో రాజకీయం వేడెక్కింది. ఒకవైపు కరోనా కేసులు పెరుగుతుంటే మరోవైపు నేతలు ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లలో కంప్లైన్ట్ చేసుకుంటున్నారు. కరోనా మహమ్మారి మ్యుటెంట్ ఎన్ 440 కె వేరియంట్ కర్నూలు జిల్లాలో ఉందని ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారని చెప్పి వైసీపీ నేతలు కర్నూలు జిల్లాలోని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. దీంతో ఆయనపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కాగా, ఇప్పుడు టీడీపీ నేతలు వైసీపీ నేతలపై కంప్లైంట్…
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ ఇంటర్ పరీక్షల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇంటర్ పరీక్షలను వాయిదా వేస్తూ ఇటీవలే నిర్ణయం తీసుకున్నారు. పరిస్థితులను బట్టి తరువాత పరీక్షలపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇక ఇదిలా ఉంటె, ఏపీ సీఎం జగన్ కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు. మే లో జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేయాలని కోరారు. ఏపీలో కరోనా పరీక్షలు లక్ష…
కేంద్ర ప్రభుత్వం మొత్తం వ్యాక్సిన్ ఇస్తే కేవలం 10 రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా వ్యాక్సినేషన్ పూర్తి చేసే సామర్థ్యం మన యంత్రాంగానికి ఉందన్నారు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రపంచమే కరోనా పై యుద్ధం చేస్తోంది.. ఇంత భయంకర పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు కొందరు విమర్శలు చేయటం దుర్మార్గం అంటూ మండిపడ్డారు.. రికవరీలో జాతీయ సగటు 88.5 శాతంగా ఉంటే రాష్ట్రంలో 93.50 శాతం ఉందని.. విమర్శించే వాళ్లు దీనిని ఎందుకు చెప్పడం…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ప్రశంసలు కురిపించారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి.. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా నకిరేకల్ మున్సిపాల్టీలో ప్రచారం నిర్వహించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి అంటే వైఎస్ జగనే అన్నారు.. ఆంధ్రప్రదేశ్లో వెయ్యి రూపాయలు దాటిన వైద్యం అంతా ఆరోగ్య శ్రీలోనే అన్న ఆయన.. కరోనా ట్రీట్ మెంట్ కూడా ఆరోగ్యశ్రీలో చేర్చారంటూ ప్రశంసించారు.. అయితే, కరోనా వైరస్ బారినపడి ప్రజలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో…
ఏపీలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది.. తాజాగా, సీఎం వైఎస్ జగన్కు కొత్త పేరు పెట్టారు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. తూర్పుగోదావరి జిల్లాలో మీడియాతో మాట్లాడిన ఆయన.. జగన్ రెడ్డి పేరు ఇక నుంచి జాంబీ రెడ్డి అంటూ వ్యాఖ్యానించారు.. సీఎం కుర్చీలో ఉన్నవారికి సంక్షేమం, అభివృద్ధి చేస్తే ఆనందం వస్తుంది.. కానీ, జాంబీ రెడ్డి.. టిడిపి నేతలు, కార్యకర్తల అరెస్టులతో ఆనందిస్తున్నారని మండిపడ్డారు..…
ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూస్తే.. దేశంలోని ప్రజలంతా జగన్ ప్రధాని కావాలని కోరుకుంటారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి.. పెనమలూరు నియోజకవర్గం పోరంకిలో వాలంటీర్లకు సత్కార కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా.. సీఎం వైఎస్ జగన్ సమక్షంలోనే ఈ వ్యాఖ్యలు చేవారు.. వైఎస్ జగన్ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు చూసి దేశంలోని పేదలందరూ జగన్ ప్రధాని కావాలని కోరుకుంటారని పార్థసారథి వ్యాఖ్యానించగా… అక్కడున్న వాలంటీర్లు, అభిమానులు కేకలు…