AAP: ఆప్కు బిగ్ షాక్.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్..
- ఢిల్లీ జల్ బోర్డు STP టెండర్ స్కామ్లో సత్యేంద్ర జైన్ అరెస్ట్.
- మాజీ DJB CEO ఉదిత్ ప్రకాష్ రాయ్ సహా మొత్తం ఆరుగురిని అరెస్ట్ చేసిన ఏసీబీ.
- ఒక ప్రైవేట్ కంపెనీకి లబ్ధి చేకూరేలా టెండర్ నిబంధనలు మార్చారని ఆరోపణలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AAP: ఢిల్లీ జల్ బోర్డ్ మురుగునీటి శుద్ధి కర్మాగారం (STP) టెండర్ కుంభకోణంలో ఢిల్లీ ప్రభుత్వ అవినీతి నిరోధక శాఖ (ACB) ఆప్ నేత, మాజీ జలవనరులు మంత్రి సత్యేంద్ర జైన్ను అరెస్ట్ చేసింది. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కు ఎదురుదెబ్బ తగిలింది. జైన్తో పాటు సీనియర్ ఐఏఎస్ అధికారి ఉదిత్ ప్రకాష్ రాయ్తో సహా మొత్తం ఆరుగురు నిందితులను ఏసీబీ అరెస్టు చేసింది. అరెస్టైన వారిలో ఉదిత్ ప్రకాష్ రాయ్ (ఢిల్లీ జల్ బోర్డ్ మాజీ సీఈఓ), అంకిత్ శ్రీవాస్తవ (డీజేబీ మాజీ కాంట్రాక్టు కన్సల్టెంట్), నాగేంద్ర యాదవ్ (ఏఎన్ ఎంటర్ప్రైజెస్ యజమాని), రాజా కుమార్ కుర్రా (యూరోటెక్ ఎన్విరాన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ యజమాని), పంకజ్ వర్మ (శ్రీజన్హర్ యజమాని) ఉన్నారు.
మురుగునీటి శుద్ధి ప్లాంట్ల ఆధునీకరణ, సామర్థ్య విస్తరణ కోసం జారీ చేసిన టెండర్లలో స్కామ్ జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. యూరో టెక్ ఎన్విరాన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి నేరుగా ప్రయోజనం చేకూర్చేందుకు టెండర్లో సాంకేతిక నిబంధనలు మార్చారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రతిపాదిత పైలట్ అధ్యయనాన్ని నిర్వహించకుండానే ఇతర కంపెనీల నుంచి పోటీని తొలగిస్తూ కొన్ని నిబంధనల్ని మార్చినట్లు తేలింది. దీంతో ప్రభుత్వ ఖజానాకు ఆర్థికనష్టం వాటిల్లినట్లు ఏసీసీ ఆరోపిస్తోంది.
Also Read
- Sonia Gandhi: ‘బిలాంగింగ్’ పేరుతో సోనియాగాంధీ ఆత్మకథ.. రాజీవ్గాంధీతో ప్రేమ ముచ్చట్లు
- Sheikh Hasina: షేక్ హసీనా అప్పగింతపై కేంద్రం కీలక ప్రకటన
- Congress: ‘RSS, జైష్, తాలిబన్ మధ్య తేడా లేదు’.. కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ తీవ్ర వ్యాఖ్యలు
- Jharkhand: ‘భార్యతో చెప్పా.. కావాలంటే విడాకులు తీసుకో’.. జార్ఖండ్లో సెలెక్టెడ్ అభ్యర్థి ఆక్రందన
దర్యాప్తులో ఏసీబీకి పలు ఎక్ట్రానిక్ ఆధారాలు లభించినట్లు తెలిసింది. ప్రైవేట్ వ్యక్తులు, మధ్యవర్తులు, ప్రభుత్వ అధికారుల మధ్య జరిగిన ఈమెయిల్స్, మెసేజ్లు పరిశీలించగా, టెండర్ పత్రాలు, సవరణ పత్రాలు ముందుగానే ఒకరితో ఒకరు పంచుకున్నట్లు గుర్తించినట్లు పేర్కొంది. ఆ తర్వాత మార్పులును ప్రభుత్వం టెండర్ పత్రాల్లో చేర్చినట్లు ఏసీబీ ఆరోపించింది. దీంతో అధికారుల, సంబంధిత కంపెనీ మధ్య కమ్ముక్కు జరిగిందనే అనుమానాలకు ఆధారాలు లభించినట్టు ఏసీబీ పేర్కొంది. అప్పటి DJB CEO ఉదిత్ ప్రకాష్ రాయ్కు సంబంధించిన వ్యక్తులు, ఆయన బంధువుల బ్యాంకు ఖాతాలకు ఏఎన్ ఎంటర్ప్రైజెస్ ద్వారా సుమారు రూ.1.52 కోట్లు బదిలీ అయ్యాయి. ఈ డబ్బును యూరోటెక్కు అనుబంధంగా ఉన్న సంస్థల ద్వారా మళ్లించి, ఆ తర్వాత ఆస్తుల కొనుగోలుకు ఉపయోగించారు. ఈ లంచం సొమ్ము లావాదేవీల మూలాలపై దర్యాప్తు జరుగుతోందని ఏసీబీ తెలిపింది.
తాజావార్తలు
-
AAP: ఆప్కు బిగ్ షాక్.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్..
-
Colgate: కొల్గేట్ ప్రియులకు షాక్.. టూత్పేస్ట్ ధరలు పెరగనున్నాయా?
-
VMC Contractors Strike: వీఎంసీ కాంట్రాక్టర్లతో మంత్రి నారాయణ చర్చలు సఫలం.. సమ్మె విరమణ
-
Sonia Gandhi: ‘బిలాంగింగ్’ పేరుతో సోనియాగాంధీ ఆత్మకథ.. రాజీవ్గాంధీతో ప్రేమ ముచ్చట్లు
-
Hockey World Cup 2026: మహిళల హాకీ ప్రపంచకప్లో భారత్ జోరు.. దక్షిణాఫ్రికాపై 6-1 ఘన విజయం
ట్రెండింగ్
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!
-
Harry Brook-IPL: ఐపీఎల్ అంటేనే భయమేసింది.. డిప్రెషన్లోకి వెళ్లా.. ఇంగ్లండ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!