Stock Market Crash: మార్కెట్లో మంటలు.. లక్షల కోట్లు ఆవిరి! సెన్సెక్స్ పతనానికి అసలు కారణం ఇవే!
- ఒక్కరోజే 1,353 పాయింట్లు పతనమైన సెన్సెక్స్..
- 422.05 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
- రక్తసిక్తమైన దలాల్ స్ట్రీట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Stock Market Crash: సోమవారం భారత స్టాక్ మార్కెట్లు భారీ పతనాన్ని మూటగట్టుకున్నాయి. వారారంభంలోనే దలాల్ స్ట్రీట్ రక్తసిక్తమైంది. రోజంతా తీవ్ర ఒడిదొడుకుల మధ్య సాగిన ట్రేడింగ్, చివర్లో స్వల్పంగా కోలుకున్నప్పటికీ, ఇన్వెస్టర్లకు మాత్రం భారీ నష్టాలనే మిగిల్చింది. ఒకానొక దశలో 2,400 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్, మార్కెట్ ముగిసే సమయానికి 1,352.74 పాయింట్లు నష్టపోయి 77,566.16 వద్ద స్థిరపడింది. అటు నిఫ్టీ కూడా 422.05 పాయింట్లు కోల్పోయి 24,028.05 వద్ద ముగిసింది. ఎస్బిఐ, అదానీ పోర్ట్స్, ఇండిగో వంటి అగ్రశ్రేణి కంపెనీల షేర్లు ఈ అమ్మకాల ఒత్తిడిలో భారీగా దెబ్బతిన్నాయి.
READ ALSO: Chhattisgarh Drug Bust: సినిమా ఫక్కీలో నల్లమందు సాగు.. పొలానికి సెక్యూరిటీగా బౌన్సర్లు!
Also Read
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
- MS Dhoni: ఇన్వెస్టర్లకు అదిరే న్యూస్.. ధోని మద్దతిస్తున్న కంపెనీ ఐపీఓకు రెడీ.. రూ.1500 కోట్లే లక్ష్యంగా..
- Forbes Billionaires List: 4 గదుల ఫ్లాట్ నుంచి 92.8 బిలియన్ డాలర్ల సామ్రాజ్యం వరకు..! అంబానీని దాటేసిన టిక్టాక్ సృష్టికర్త..
- E85 Fuel: E85 ఇంధనంపై కేంద్రం కీలక ప్రకటన.. భారీగా తగ్గనున్న పెట్రో ధరలు..!?
మార్కెట్ పతనానికి 5 ప్రధాన కారణాలు ఇవే..
1. యుద్ధ భయాలు – చమురు సెగ:
అమెరికా-ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య యుద్ధం ముదరడం మార్కెట్ను కోలుకోలేని దెబ్బ తీసింది. బ్రెంట్ క్రూడ్ ధర ఏకంగా బ్యారెల్కు $115కి చేరడం ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేసింది. హార్ముజ్ జలసంధి మూసివేత, ఖతార్, ఇరాక్ వంటి దేశాల ఉత్పత్తి కోతలు చమురు సంక్షోభాన్ని మరింత తీవ్రం చేశాయి.
2. భారత్ దిగుమతులపై ఆందోళన:
భారతదేశం తన చమురు అవసరాల కోసం 85% దిగుమతులపైనే ఆధారపడుతుంది. చమురు ధరలు పెరిగితే దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి, తద్వారా ద్రవ్యోల్బణం (ధరల పెరుగుదల) పెరిగే ప్రమాదం ఉంది. ఈ ఆర్థిక భయాలు మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీశాయి.
3. రూపాయి విలువ రికార్డు పతనం:
ప్రపంచ ఉద్రిక్తతల ప్రభావం రూపాయిపై తీవ్రంగా పడింది. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ 46 పైసలు క్షీణించి 92.28కి పడిపోయింది. కరెన్సీ విలువ పడిపోవడం దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రతికూల సంకేతం కావడంతో ఇన్వెస్టర్లు వెనకడుగు వేశారు.
4. విదేశీ పెట్టుబడిదారుల (FII) అమ్మకాల జోరు:
విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారత మార్కెట్ నుంచి తమ నిధులను వేగంగా ఉపసంహరించుకుంటున్నారు. గత శుక్రవారం ఒక్కరోజే వీరు రూ.6,030 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. డాలర్ బలపడటం, రూపాయి బలహీనపడటంతో ఈ అమ్మకాల పరంపర కొనసాగుతోంది.
5. గ్లోబల్ మార్కెట్ల ప్రభావం:
భారత మార్కెట్ల పతనానికి అంతర్జాతీయ మార్కెట్ల పతనం తోడైంది. జపాన్ నిక్కీ (7%), దక్షిణ కొరియా కోస్పీ (7%), తైవాన్ (6%), హాంకాంగ్ హాంగ్ సెంగ్ (2%) సూచీలు భారీగా నష్టపోయాయి. గత శుక్రవారం అమెరికా మార్కెట్లు కూడా నష్టాల్లో ముగియడం మన మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపిందని విశ్లేషకులు చెబుతున్నారు.
READ ALSO: Karuppu: స్టార్ హీరోపై కేసు వేయనున్న డైరెక్టర్? కోలీవుడ్లో కలకలం రేపుతున్న ‘కరుప్పు’ వివాదం!
తాజావార్తలు
-
Infinix Smart 20: ఇన్ఫినిక్స్ స్మార్ట్ 20 రిలీజ్ డేట్ ఫిక్స్.. 5,200mAh బ్యాటరీ, ధర రూ. 10,000 లోపే..!
-
Friday Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని శుభవార్తలే, పండగే ఇవాళ!
-
Eng vs NZ: లార్డ్స్ టెస్టులో బౌలర్ల హవా.. తొలి రోజే 16 వికెట్లు డౌన్.. అసలేమవుతోంది.?
-
Vladimir Putin: “మోడీపై ఒత్తిడి తేవడం ఎవరి తరం కాదు”.. భారత్కు రష్యా అధ్యక్షుడు పుతిన్ గట్టి మద్దతు
-
Suryakumar Yadav: ఏడాదిలోనే హీరో నుంచి జీరోగా? సూర్యకుమార్ హిస్టరీలో బిగ్ ఫెయిల్యూర్స్ ఇవే..
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!