Stock Market Crash: మార్కెట్లో మంటలు.. లక్షల కోట్లు ఆవిరి! సెన్సెక్స్ పతనానికి అసలు కారణం ఇవే!
- ఒక్కరోజే 1,353 పాయింట్లు పతనమైన సెన్సెక్స్..
- 422.05 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
- రక్తసిక్తమైన దలాల్ స్ట్రీట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Stock Market Crash: సోమవారం భారత స్టాక్ మార్కెట్లు భారీ పతనాన్ని మూటగట్టుకున్నాయి. వారారంభంలోనే దలాల్ స్ట్రీట్ రక్తసిక్తమైంది. రోజంతా తీవ్ర ఒడిదొడుకుల మధ్య సాగిన ట్రేడింగ్, చివర్లో స్వల్పంగా కోలుకున్నప్పటికీ, ఇన్వెస్టర్లకు మాత్రం భారీ నష్టాలనే మిగిల్చింది. ఒకానొక దశలో 2,400 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్, మార్కెట్ ముగిసే సమయానికి 1,352.74 పాయింట్లు నష్టపోయి 77,566.16 వద్ద స్థిరపడింది. అటు నిఫ్టీ కూడా 422.05 పాయింట్లు కోల్పోయి 24,028.05 వద్ద ముగిసింది. ఎస్బిఐ, అదానీ పోర్ట్స్, ఇండిగో వంటి అగ్రశ్రేణి కంపెనీల షేర్లు ఈ అమ్మకాల ఒత్తిడిలో భారీగా దెబ్బతిన్నాయి.
READ ALSO: Chhattisgarh Drug Bust: సినిమా ఫక్కీలో నల్లమందు సాగు.. పొలానికి సెక్యూరిటీగా బౌన్సర్లు!
Also Read
- Double-Stack Container Train: భారతీయ రైల్వే చరిత్రలో కీలక మైలురాయి.. తొలిసారి డబుల్ స్టాక్ లాంగ్-హాల్ కంటైనర్ రైలు
- EPFO EEC 2026: ఉద్యోగులకు EPFO గుడ్న్యూస్.. అక్టోబర్ 31 వరకు ఛాన్స్.. మిస్ కావద్దు.!
- Food Inflation 2026: వంటగది బడ్జెట్కు బిగ్ షాక్.. వంట నూనె, పప్పులు, ఉల్లి, చక్కెర.. ధరలు పెరగడానికి అసలు కారణాలివే!
- Cheque Book New Rules 2026: చెక్బుక్ కొత్త రూల్స్.. మీ చెక్పై ఈ సెక్యూరిటీ కోడ్ ఉందా? చెక్ చేసుకోండి!
మార్కెట్ పతనానికి 5 ప్రధాన కారణాలు ఇవే..
1. యుద్ధ భయాలు – చమురు సెగ:
అమెరికా-ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య యుద్ధం ముదరడం మార్కెట్ను కోలుకోలేని దెబ్బ తీసింది. బ్రెంట్ క్రూడ్ ధర ఏకంగా బ్యారెల్కు $115కి చేరడం ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేసింది. హార్ముజ్ జలసంధి మూసివేత, ఖతార్, ఇరాక్ వంటి దేశాల ఉత్పత్తి కోతలు చమురు సంక్షోభాన్ని మరింత తీవ్రం చేశాయి.
2. భారత్ దిగుమతులపై ఆందోళన:
భారతదేశం తన చమురు అవసరాల కోసం 85% దిగుమతులపైనే ఆధారపడుతుంది. చమురు ధరలు పెరిగితే దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి, తద్వారా ద్రవ్యోల్బణం (ధరల పెరుగుదల) పెరిగే ప్రమాదం ఉంది. ఈ ఆర్థిక భయాలు మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీశాయి.
3. రూపాయి విలువ రికార్డు పతనం:
ప్రపంచ ఉద్రిక్తతల ప్రభావం రూపాయిపై తీవ్రంగా పడింది. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ 46 పైసలు క్షీణించి 92.28కి పడిపోయింది. కరెన్సీ విలువ పడిపోవడం దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రతికూల సంకేతం కావడంతో ఇన్వెస్టర్లు వెనకడుగు వేశారు.
4. విదేశీ పెట్టుబడిదారుల (FII) అమ్మకాల జోరు:
విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారత మార్కెట్ నుంచి తమ నిధులను వేగంగా ఉపసంహరించుకుంటున్నారు. గత శుక్రవారం ఒక్కరోజే వీరు రూ.6,030 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. డాలర్ బలపడటం, రూపాయి బలహీనపడటంతో ఈ అమ్మకాల పరంపర కొనసాగుతోంది.
5. గ్లోబల్ మార్కెట్ల ప్రభావం:
భారత మార్కెట్ల పతనానికి అంతర్జాతీయ మార్కెట్ల పతనం తోడైంది. జపాన్ నిక్కీ (7%), దక్షిణ కొరియా కోస్పీ (7%), తైవాన్ (6%), హాంకాంగ్ హాంగ్ సెంగ్ (2%) సూచీలు భారీగా నష్టపోయాయి. గత శుక్రవారం అమెరికా మార్కెట్లు కూడా నష్టాల్లో ముగియడం మన మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపిందని విశ్లేషకులు చెబుతున్నారు.
READ ALSO: Karuppu: స్టార్ హీరోపై కేసు వేయనున్న డైరెక్టర్? కోలీవుడ్లో కలకలం రేపుతున్న ‘కరుప్పు’ వివాదం!
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!