పవార్ విపక్షపార్టీల సమావేశానికి తెలుగు రాష్ట్రాల నుంచి ఆ పార్టీలు హాజరుకావడంలేదా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఎన్సీపీ నేత శరద్పవార్ ఆద్వర్యంలో దేశంలోని వివిధ పార్టీల నేతలతో సమావేశం కాబోతున్నారు. మూడో ఫ్రంట్ ఏర్పాటు చేసేందుకు ఈ పార్టీలతో సమావేశం కాబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. మొత్తం 15 పార్టీలు ఈ సమావేశానికి హాజరుకాబోతున్నాయి. అయితే, తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రధానమైన మూడు పార్టీలైన టీడీపి, వైఎస్ఆర్సీపీ, టీఆర్ఎస్ పార్టీలు హాజరుకావడం లేదని సమాచారం. మోడినీ, బీజేపీని ప్రధానంగా ఎదుర్కొనడానికి బలమైన ఫ్రంట్ అవసరం కావడంతో విపక్షాలు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాయి. దేశంలో కాంగ్రెస్ పార్టీ బలహానపడింది. అదే సమయంలో బీజేపీ బలంగా పుంజుకుంది. దాదాపుగా చాలా రాష్ట్రాల్లో సొంతంగా, కొన్ని పార్టీలతో కలిసి బీజేపీ అధికారంలో ఉన్నది.
Read: ఓటీటీ చర్చల్లో నితిన్ ‘మాస్ట్రో’!
Also Read
- Salman Khan: అస్సాం వరద బాధితులకు అండగా సల్మాన్ ఖాన్.. 500 కొత్త ఇళ్ల నిర్మాణానికి సహాయం
- Gujarat Well Mystery: వింత ఘటన.. బావిలో నీరు అలల్లా కదలికలు, రంగంలోకి అధికారులు (వీడియో)
- Cyber Crime: నకిలీ పాప్-అప్ టోల్ఫ్రీ నంబర్లతో బురిడీ.. అంతర్జాతీయ సైబర్ మోసాల ముఠా గుట్టురట్టు..
- PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
ఏలాగైనా రాబోయో రోజుల్లో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పాగా వేయాలని బీజేపీ ప్లాన్ చేస్తున్నది. దేశంలో ప్రస్తుతం నెలకొన్నపరిస్థుల దృష్ట్యా బీజేపీకి కొంత ఎదురుగాలి వీస్తున్నా, మోడి చరిష్మా తగ్గలేదన్నది వాస్తవం. వచ్చే ఎన్నికల నాటికి తిరిగి బీజేపీ పుంజుకొని మరోసారి కేంద్రంలో అధికారంలోకి వస్తే, ఆ తరువాత రోజుల్లో మిగతా పార్టీల మనుగడ కష్టం అవుతుంది. 2024 లో బీజేపీని ఎదుర్కొనడం కోసం విపక్షాలు ఇప్పటి నుంచే కార్యాచరణను మొదలుపెట్టాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ విపక్ష పార్టీల మధ్య మధ్యవర్తిత్వం నిర్వహిస్తున్నారు. మరి ఈ వ్యూహం ఫలిస్తుందా? థర్డ్ ఫ్రంట్ను ఏర్పాటు చేయాలని గతంలో టీఆర్ఎస్ నేత కేసీఆర్ ప్రయత్నించి విఫలం అయ్యారు. దాదాపుగా 16 ఏళ్ల తరువాత థర్డ్ ఫ్రంట్ విషయం మరోమారు తెరమీదకు వచ్చింది. ఈ చర్చలు ఎంత వరకు సఫలం అవుతాయో చూడాలి.
తాజావార్తలు
-
Ajinkya Rahane: “ధోనీ, కోహ్లీ కానే కాదు.. టీమిండియా ఆల్టైమ్ గ్రేట్ అతడే”.. రహానే ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Salman Khan: అస్సాం వరద బాధితులకు అండగా సల్మాన్ ఖాన్.. 500 కొత్త ఇళ్ల నిర్మాణానికి సహాయం
-
Deepika Padukone: ‘రాకా’.. హీరోయిన్ దీపికా పదుకొనే పనైపోయినట్టే, ఇక అవుట్!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
Sridhar Babu: త్వరలోనే డిజిటల్ అసెంబ్లీ, డిజిటల్ కౌన్సిల్.. మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన
ట్రెండింగ్
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్లో లాంచ్..!
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!