పవార్ విపక్షపార్టీల సమావేశానికి తెలుగు రాష్ట్రాల నుంచి ఆ పార్టీలు హాజరుకావడంలేదా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఎన్సీపీ నేత శరద్పవార్ ఆద్వర్యంలో దేశంలోని వివిధ పార్టీల నేతలతో సమావేశం కాబోతున్నారు. మూడో ఫ్రంట్ ఏర్పాటు చేసేందుకు ఈ పార్టీలతో సమావేశం కాబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. మొత్తం 15 పార్టీలు ఈ సమావేశానికి హాజరుకాబోతున్నాయి. అయితే, తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రధానమైన మూడు పార్టీలైన టీడీపి, వైఎస్ఆర్సీపీ, టీఆర్ఎస్ పార్టీలు హాజరుకావడం లేదని సమాచారం. మోడినీ, బీజేపీని ప్రధానంగా ఎదుర్కొనడానికి బలమైన ఫ్రంట్ అవసరం కావడంతో విపక్షాలు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాయి. దేశంలో కాంగ్రెస్ పార్టీ బలహానపడింది. అదే సమయంలో బీజేపీ బలంగా పుంజుకుంది. దాదాపుగా చాలా రాష్ట్రాల్లో సొంతంగా, కొన్ని పార్టీలతో కలిసి బీజేపీ అధికారంలో ఉన్నది.
Read: ఓటీటీ చర్చల్లో నితిన్ ‘మాస్ట్రో’!
Also Read
- DK.Shivakumar: డీకే.శివకుమార్ కేబినెట్పై విమర్శలు.. మహిళలకు చోటు లేకపోవడంపై నిలదీత
- INDIA alliance: ఇండియా కూటమికి డీఎంకే షాక్.. జూన్ 8 సమావేశం బాయ్కాట్..
- Sonam Raghuvanshi: హనీమూన్ మర్డర్ కేసులో సోనమ్ బెయిల్ పిటిషన్ రద్దుపై కీలక పరిణామం.. సర్వత్రా ఉత్కంఠ
- Kerala: వ్యాయామానికి మతం రంగు.. కేరళలో వివాదంగా ‘‘ఇస్లామిక్-ఫ్రెండ్లీ జిమ్’’..
ఏలాగైనా రాబోయో రోజుల్లో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పాగా వేయాలని బీజేపీ ప్లాన్ చేస్తున్నది. దేశంలో ప్రస్తుతం నెలకొన్నపరిస్థుల దృష్ట్యా బీజేపీకి కొంత ఎదురుగాలి వీస్తున్నా, మోడి చరిష్మా తగ్గలేదన్నది వాస్తవం. వచ్చే ఎన్నికల నాటికి తిరిగి బీజేపీ పుంజుకొని మరోసారి కేంద్రంలో అధికారంలోకి వస్తే, ఆ తరువాత రోజుల్లో మిగతా పార్టీల మనుగడ కష్టం అవుతుంది. 2024 లో బీజేపీని ఎదుర్కొనడం కోసం విపక్షాలు ఇప్పటి నుంచే కార్యాచరణను మొదలుపెట్టాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ విపక్ష పార్టీల మధ్య మధ్యవర్తిత్వం నిర్వహిస్తున్నారు. మరి ఈ వ్యూహం ఫలిస్తుందా? థర్డ్ ఫ్రంట్ను ఏర్పాటు చేయాలని గతంలో టీఆర్ఎస్ నేత కేసీఆర్ ప్రయత్నించి విఫలం అయ్యారు. దాదాపుగా 16 ఏళ్ల తరువాత థర్డ్ ఫ్రంట్ విషయం మరోమారు తెరమీదకు వచ్చింది. ఈ చర్చలు ఎంత వరకు సఫలం అవుతాయో చూడాలి.
తాజావార్తలు
-
Test Match: ఆఫ్ఘనిస్తాన్తో టెస్ట్ మ్యాచ్.. సిరాజ్ ఫిట్నెస్పై కోచ్ కీలక వ్యాఖ్యలు
-
Ameerpet Fire Accident : మెట్రో పిల్లర్కు క్రాక్.. క్లారిటీ ఇచ్చిన మెట్రో అధికారులు
-
World Cup: కేవలం 30 సెకన్ల మీటింగ్.. వరల్డ్ కప్ కొట్టిన భారత్.. సంచలన రహస్యం చెప్పిన కెప్టెన్..
-
High Protein Roti Recipe: గోధుమ పిండిలో ఈ 3 పదార్థాలు కలపండి.. హై ప్రోటీన్ రోటీ రెడీ..
-
Forbes Billionaires List: 4 గదుల ఫ్లాట్ నుంచి 92.8 బిలియన్ డాలర్ల సామ్రాజ్యం వరకు..! అంబానీని దాటేసిన టిక్టాక్ సృష్టికర్త..
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!