ఏపీలో సినిమా టిక్కెట్ రేట్ల అంశం హాట్టాపిక్గా నడుస్తోంది. ఇప్పటికే దర్శకుడు రామ్గోపాల్ వర్మ ఏపీ ప్రభుత్వంపై ట్వీట్ల వర్షం కురిపిస్తున్నాడు. తాజాగా జనసేన పార్టీ సమావేశంలోనూ ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ సినిమా టిక్కెట్ల విషయాన్నే ప్రస్తావించారు. ఏపీలో సినిమా టిక్కెట్ల అంశం తప్ప సీఎం జగన్కు ఇంకేం తెలియదా అంటూ ప్రశ్నించారు. జగన్కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే సిమెంట్ రేట్లు, ఇసుక రేట్లను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. Read Also: రూపాయి…
ఏపీలో రైతులను వైసీపీ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూర్ సభ్యులు కళావెంకటరావు అన్నారు. సోమవారం ఆయన శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ.. ఉత్తరాంధ్రలో రైతులు 80 శాతం వరి పంట పై ఆధారపడ్డవారున్నారన్నారు. ఈరోజు రైతులు లబోదిబోమంటున్నాని ఆయన అన్నారు. పండగ చేసుకునే పరిస్దితి లేదని, ఎప్పుడైనా రైతుకళ్ళల్లో కన్నీరు వస్తుంటుంది, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రైతుల కళ్ళలో రక్తం వస్తుందని ఆయన విమర్శించారు. ఐదేళ్ల క్రిందట వరి పంట…
టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ హత్యకు రెక్కీ జరిగిందన్న వ్యవహారంపై తాము విచారణ చేపట్టామని విజయవాడ సీపీ క్రాంతి రాణా వెల్లడించారు. అయితే రాధా హత్యకు రెక్కీ జరిగినట్లు తమకు ఆధారాలేమీ దొరకలేదని సీపీ స్పష్టం చేశారు. రాధాకు గన్మెన్లను కేటాయించామని.. అయితే ఆయన తిరస్కరించారన్నారు. పోలీసులపై టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శలు చేయడం సరికాదని క్రాంతి రాణా మండిపడ్డారు. Read Also: తత్కాల్ రూపంలో రైల్వేకు భారీ ఆదాయం రాధాపై రెక్కీకి సంబంధించి తాము రెండు…
వైసీపీ ప్రభుత్వంపై మరోసారి ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు విమర్శలు గుప్పించారు. తాజా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో దుర్మార్గమైన పాలన సాగుతోందని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా కేంద్ర నిధులిస్తుంటే జగన్ తన సొంత పథకాల పేరుతో ప్రచారం చేసుకుంటున్నారని అన్నారు. రాష్ట్రాన్ని ఆదాయ వనరుగా చేసుకొని జగన్ దోచుకుంటున్నారన్నారు. సినిమా టికెట్ల విషయంలో ప్రభుత్వ జోక్యం తగదని ఆయన హితవు పలికారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు చేరవేసేందుకు బీజేపీ తరుఫున మండల…
తిరుపతిలోని రోబో డైనర్ హోటల్ నూతనంగా తయారు చేసిన మొబైల్ యాప్ను ఎంపీ మిథున్ రెడ్డి లాంఛ్ చేశారు. ఈ సందర్భంగా ఎన్టీవీతో ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడుతూ.. పార్టీని కాపాడుకునేందుకే చంద్రబాబు నాయుడు తరచుగా ముందస్తు ఎన్నికల గురించి మాట్లాడుతుంటారని ఆయన అన్నారు. వైసీపీ ప్రభుత్వానికి ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన లేదని, ఐదేళ్ల పూర్తి కాలం అధికారంలో ఉంటామని ఆయన స్పష్టం చేశారు. ప్రేక్షకులకు, థియేటర్ల యాజమాన్యానికి ఇద్దరికీ నష్టం కలగకూడదని అన్నది ప్రభుత్వ…
వారిద్దరూ అధికారపార్టీ ప్రజాప్రతినిధులే. ఒకే ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం ఉంది. ఒకరినొకరు ఎదురుపడటానికి కూడా ఇష్టపడరని టాక్. ఇప్పుడు ఆ వార్.. పార్టీలోనూ చిచ్చు పెడుతోందట. విభేదాలు రోడ్డెక్కి రచ్చ రచ్చ..!ఈయన కాసు మహేష్రెడ్డి. వైసీపీ ఎమ్మెల్యే. ఇంకో నేత జంగా కృష్ణమూర్తి. వైపీపీ ఎమ్మెల్సీ. ఇద్దరిదీ గుంటూరు జిల్లా గురజాల. పల్నాడు ప్రాంతానికి చెందిన ఈ ఇద్దరు నాయకులు అధికారపార్టీలోనే ఉన్నా.. ఒకరినొకరు వైరిపక్షాలుగా చూసుకుంటారు. ఇద్దరి మధ్య…
సొంత పార్టీలోని కోవర్టులకు నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా షాకిచ్చారు. శుక్రవారం మధ్యాహ్నం చిత్తూరు జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ను నగరి ఎమ్మెల్యే రోజా కలిశారు. ఈ మేరకు వైసీపీలో కోవర్టులపై చర్యలు తీసుకోవాలని ఎస్పీకి ఫిర్యాదు చేశారు. వైసీపీలో ఉంటూ టీడీపీతో అంటకాగే వారిని ఉపేక్షించే పరిస్థితి లేదని వైసీపీ ఎమ్మెల్యే రోజా స్పష్టం చేశారు. రాష్ట్ర డీజీపీ ఫోటోలతోనూ కోవర్టులు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫొటోలను ఫ్లెక్సీల్లో…
విశాఖ జిల్లా వైసీపీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావుకు సొంత పార్టీ కార్యకర్తల నుంచే అసమ్మతి సెగ ఎదురైంది. పాయకరావుపేట మండలం రాజవరం గ్రామంలో మంచినీటి పైపులైన్ ప్రారంభించడానికి వెళ్లిన ఎమ్మెల్యే గొల్ల బాబూరావును వైసీపీ కార్యకర్తలు అడ్డుకుని గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. జగన్ ముద్దు- ఎమ్మెల్యే వద్దు అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. అనంతరం ఎమ్మెల్యే కారుకు అడ్డంగా రోడ్డుపై బైఠాయించారు. దీంతో ఎమ్మెల్యే మద్దతుదారులు, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. Read…
ఆంధ్రప్రదేశ్లో రవాణా శాఖ సర్వర్ మొరాయించింది.. వచ్చే ఏడాది నుంచి రిజిస్ట్రేషన్ చార్జీలు పెరగనున్న నేపథ్యంలో.. ఒక్కసారిగా వాహనాల రిజిస్ట్రేషన్లు పెరిగిపోయాయి.. దీంతో రవాణాశాఖ వెబ్సైట్లో సాంకేతిక సమస్యలు వచ్చాయి.. ఇవాళ రాత్రికి వెబ్ సైట్లో వచ్చిన సాంకేతిక సమస్యను పరిష్కరిస్తామని.. రేపు ఉదయం నుంచి వాహనాల రిజిస్ట్రేషన్లను యథాతథంగా అనుమతిస్తామని అధికారులు చెబుతున్నారు.. ఇక, ఈ వ్యవహారంపై స్పందించిన మంత్రి పేర్ని నాని.. ఏపీ రవాణా శాఖ సర్వర్ లో సాంకేతిక సమస్య తలెత్తింది.. T/R…
ఏపీ బీజేపీ కార్యాలయంలో బీజేపీ శ్రేనులు ప్రజాగ్రహ సభ సక్సెస్ సంబరాలు జరుపుకుంటున్నారు. ఒకరికొకరు మిఠాయిలు పంచుకున్న పంచుకుంటూ సంబరాల్లో మునిగిపోయారు. ఈ సంబరాల్లో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, ఇతర నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు మాట్లాడుతూ వైసీపీ, టీడీపీ, సీపీఐ పార్టీల మీద నిప్పులు చెరిగారు. రాబోయే రోజుల్లో పార్టీ దూకుడు పెంచుతుందని, ఏపీలో శూన్యత ఉందని ఆయన అన్నారు. ఏపీలో బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎదుగుతోందని,…