మంత్రి బాలినేనికి సీపీఐ నారాయణ కౌంటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీఎం జగన్తో మెగాస్టార్ చిరంజీవి భేటీ ఏపీలో హాట్ టాపిక్గా మారింది. రాజ్యసభ సీటు కోసమే చిరంజీవి జగన్తో సమావేశమయ్యారంటూ వివిధ కోణాల్లో విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఈ వ్యాఖ్యలను వైసీపీ మంత్రి బాలినేని శ్రీనివాస్రెడ్డి ఖండించారు. మంత్రి బాలినేని వ్యాఖ్యలపై సీపీఐ నేత నారాయణ కౌంటర్ ఇచ్చారు. ఎవరు చెప్పేది నిజం, ఎవరు చెప్పేది అబద్ధం. ప్రజలకు నిజాలు చెప్పండి అని నారాయణ అన్నారు. కనుమ పండుగ రోజు కూడా కఠోర వాస్తవాలు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడిందని, చిరంజీవి గారేమో ప్రభుత్వం తరపు నుండి నన్నొక్కడినే ఆహ్వానించారని, అందుకే తాను వెళ్లి ముఖ్యమంత్రి గారిని కలిసానంటున్నారు.
ప్రభుత్వం తరపున “తాము ఎవ్వర్ని ఆహ్వానించ లేదని,చిరంజీవికి రాజ్యసభ సీటు ఇవ్వాల్సిన అవసరం తమకు లేదని,ప్రతిపక్షాలు అనవసరపు గోల చేస్తున్నాయి’అని అంటున్నారు. చిరంజీవి నిజం చెప్పారా? అబద్ధం చెప్పారా? ప్రభుత్వం చెప్పింది నిజమా?అబద్దమా? ప్రజలకు వాస్తవాలు చెప్పడంటూ నారాయణ డిమాండ్ చేశారు. చిత్ర పరిశ్రమకు సంబంధించిన సమస్యకు సంబంధిత అసోసియేషన్లను తీసుకువచ్చి చర్చించకుండా వ్యక్తిగతంగా ఒకరిని తీసుకువచ్చి మాట్లాడడం చెడు సాంప్రదాయానికి దారితీస్తుందని సలహా ఇచ్చారు.
Also Read
తాజావార్తలు
-
Pat Cummins: బిగ్ షాక్.. వచ్చే ఐపీఎల్ నుంచి ప్యాట్ కమిన్స్ దూరం..? రూ.113 కోట్లతో భారీ డీల్..
-
Amazon Video-MX Player: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఎంఎక్స్ ప్లేయర్ విలీనం.. ఇకపై అంతా ఒకే చోట..
-
Vivo X300 FE: 6,500mAh బ్యాటరీ, జైస్-ట్యూన్డ్ కెమెరాతో.. వివో X300 FE భారత్ లో విడుదల
-
Bus Fitness Certificates: స్కూల్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు.. వందల సంఖ్యలో ఫిట్నెస్ లేని బస్సులు!
-
Tragedy: తీవ్ర విషాదం.. ముగ్గురి ప్రాణాలు తీసిన ఈత సరదా.