కోడిపందాలు జూదం కాదు.. సంస్కృతిలో భాగమని వైసీపీ మంత్రి రంగనాథరాజు అన్నారు. ఆదివారం ఆయన ఏపీ ప్రజలందరికీ కనుమ పండుగ శుభకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సంస్కృతి, చట్టాలను రెండింటిని గౌరవించాలని, కోడి పందాలు సంప్రదాయంగా చట్టబద్ధంగా జరుగుతున్నాయన్నారు. ప్రభుత్వం పేదలకు ఇళ్లు, ఇళ్లస్థలాలు కేటాయిస్తోందిని, ఇళ్ల నిర్మాణానికి రూ.32 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
ఓటీఎస్ ద్వారా యాజమాన్య హక్కులు అందిస్తున్నామని ఆయన తెలిపారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా గృహయజ్ఞం ఆగదని ఆయన స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని జీర్ణించుకోలేక టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారన్నారు. ఏపీకి చంద్రబాబు చేసిందేమీ లేదని ఆయన అన్నారు. ఏపీ ప్రజలు జగన్ సర్కార్ పథకాలతో సంతోషంగా ఉన్నారని, వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు నీరాజనం పడుతున్నారన్నారు.