Jogi Ramesh: తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ ఆవిర్భావం కోసం జన్మించిన టీఆర్ఎస్ పార్టీ తన పేరును మార్చుకుంది. ఇకపై భారత్ రాష్ట్ర సమితిగా రాజకీయాల్లో ముందడుగు వేయనుంది. జాతీయ రాజకీయాల దృష్ట్యా టీఆర్ఎస్ పార్టీ తన పేరును మార్చుకుంది. అయితే బీఆర్ఎస్పై మంత్రి జోగి రమేష్ ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో బీఆర్ఎస్ ప్రభావం ఏమీ ఉండదని ఆయన స్పష్టం చేశారు. దేశంలో చాలా మంది పార్టీలు పెట్టుకుంటూ ఉంటారని.. వాళ్ళు ఆలోచనలను…
Somu Veerraju: విశాఖలోని దసపల్లా భూముల అన్యాక్రంతంపై సీఎం జగన్కు మంగళవారం నాడు బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు లేఖ రాశారు. విశాఖ నగరంలో అన్యాక్రాంతమవుతున్న దసపల్లా భూములను కాపాడి స్వాధీనం చేసుకోవాలని లేఖలో కోరారు. విశాఖపట్నం నగర నడిబొడ్డున ప్రభుత్వ అతిథి గృహాన్ని ఆనుకుని ఉన్న వివాదాస్పద దసపల్లా భూములను కొందరు బిల్డర్లకు అప్పగించటానికి రంగం సిద్ధమైందని.. దీని వెనుక అధికార పార్టీ నాయకులకు, వారి బంధువర్గాలకు ప్రయోజనం చేకూరేలా కోట్లాది రూపాయల కుంభకోణం…
అమరావతి రాజధాని విషయంలో రగడ కొనసాగుతూనే ఉంది.. పాలక, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది.. అయితే, అమరావతి రాజధాని అంశంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు అధర్మంగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ… వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపక్ష నేతగా అమరావతిని రాజధానిగా ఆమోదించిన విషయం వాస్తవమా కాదా..? అని నిలదీసిన ఆయన… ఆనాడే మూడు రాజధానులు కావాలని వైఎస్ జగన్ ఎందుకు చెప్పలేదు..? అని ప్రశ్నించారు… శాసనం, చట్టం, ధర్మాలను విస్మరించి…
రాజధానుల వ్యవహారం ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాకరేపుతూనే ఉంది… అభివృద్ధి వికేంద్రీకరణ తమ ప్రభుత్వం లక్ష్యం.. మూడు రాజధానులు ఏర్పాటు చేసితీరుతామని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతుంటే.. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.. రాజు మారినప్పుడల్లా.. రాజధాని మారుతుందా? అని మండిపడుతున్నాయి.. అయితే, మూడు రాజధానులు అభివృద్ధి చేయాలన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ నిర్ణయానికి ప్రజల మద్దతు ఉందన్నారు డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ.. గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. శాసన…
Dharmana Prasad Rao: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఆంధ్రప్రదేశ్ పరిపాలన వికేంద్రీకరణపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి మంత్రులు ధర్మాన ప్రసాదరావు, చెల్లబోయిన వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్యేలు, మేధావులు, సామాజిక వేత్తలు హాజరయ్యారు. రాజమండ్రి వైసీపీ ఎంపీ మార్గాని భరత్ అధ్యక్షతన ఈ రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతోంది. ఈ సందర్భంగా మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు చేశారు. హైదరాబాద్ లాంటి రాజధాని నుంచి విడిపోయిన మనం దురదృష్టవంతులు అయ్యామని…
విపక్షాలు ఎన్ని పగటి వేషాలు వేసినా.. సీఎం కుర్చీని దక్కించుకోలేరు అంటూ వ్యాఖ్యానించారు కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి… నెల్లూరు జిల్లా కోవూరు మండలం గుమ్మళ్ళ దిబ్బ గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాలను వివరిస్తూ.. విపక్షాల తీరుపై ధ్వజమెత్ఆరు.. విపక్షాలు ఎన్ని పగటి వేషాలు వేసినా.. సీఎం కుర్చి దక్కించుకోలేరని స్పష్టం చేశారు.. చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్లు హైదరాబాదులో ఉంటూ.. విజయవాడకి అల్లుళ్ల లాగా…
తెలంగాణ మంత్రి హరీష్రావు… తాజాగా ఏపీ సర్కార్, అక్కడి టీచర్ల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై హాట్ కామెంట్లు చేశారు.. అయితే, హరీష్రావు కామెంట్లపై కౌంటర్ ఎటాక్కు దిగారు ఏపీ మంత్రి అంబటి రాంబాబు.. తాడేపల్లిలో ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన… రాష్ట్ర ఆదాయాలు తక్కువగా ఉన్నా అద్భుతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని స్పష్టం చేశారు.. మా రాష్ట్రం గురించి మాట్లాడే నైతిక హక్కు, అర్హత హరీష్ రావుకు, కేసీఆర్కు లేదన్న…
అమరావతి రైతుల పాదయాత్రపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబు… ఇది రైతుల పాదయాత్ర కాదు.. ఒళ్లు బలిసినవాళ్లు చేస్తున్న పాదయాత్ర అని చెప్పాను.. ఇదే విషయాన్ని మళ్లీ మళ్లీ చెబుతున్నా… కొవ్వు ఎక్కిన కోటీశ్వరుల పాదయాత్ర అది అంటూ మండిపడ్డారు.. తాడేపల్లిలో ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. కడుపు మండిన వారు పాదయాత్ర చేస్తే చంద్రబాబు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.. చంద్రబాబు మూల్యం చెల్లించకోక తప్పదు.. యాక్షన్ కు రియాక్షన్…