Adimulapu Suresh: ఏపీ వ్యాప్తంగా వికేంద్రీకరణ ఉద్యమం ఉధృతం చేస్తాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Adimulapu Suresh: రాజధాని వికేంద్రీకరణపై మంత్రి ఆదిమూలపు సురేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని కోసం అంటూ పాదయాత్ర చేస్తున్న వాళ్లు రైతుల్లా కనిపించటం లేదని ఆరోపించారు. ఓ అజెండా ప్రకారం చంద్రబాబు చెప్పినట్లుగా వారు చేస్తున్నారన్నారు. టీడీపీ నేతలు ఓ దురుద్దేశంతో చేయిస్తున్న పాదయాత్రలా కనిపిస్తోందని.. కొంతమంది పెట్టుబడిదారులు వెనుక ఉండి నడిపిస్తున్నారని విమర్శలు చేశారు. వికేంద్రీకరణ అనేది ప్రజల ఆకాంక్ష అని.. రాష్ట్ర వ్యాప్తంగా వికేంద్రీకరణ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ వ్యాఖ్యానించారు. వికేంద్రీకరణ సీరియస్నెస్ చెప్పడానికే ఓ ఎమ్మెల్యే రాజీనామా చేసి ఉండవచ్చన్నారు. వికేంద్రీకరణపై ప్రభుత్వం దేనికైనా సిద్ధంగా ఉందన్నారు.
Read Also: Karanam Dharmasri: నా రాజీనామా ఆమోదం పొందితే.. టీచర్ పోస్టులో చేరిపోతా
Also Read
- Sai Krishna Death Case: సాయికృష్ణ డెత్ కేసులో కీలక మలుపు.. లొంగిపోయిన హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నాని.!
- CM Chandrababu: పెట్టుబడుల కంటే ఆలోచనలే ముఖ్యం.. సీఐఐ సమ్మిట్పై సీఎం కీలక వ్యాఖ్యలు.!
- CM Chandrababu: రాజధాని నిర్మాణాల ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానిస్తం.!
- Nagababu: జనసేన పార్టీ ఆ పార్లమెంట్ పరిధిలో అన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది.. ఎమ్మెల్సీ నాగబాబు కీలక వ్యాఖ్యలు.!
ఓ ప్రాంతానికి సంబంధించిన సెంటిమెంట్ కోసం పెట్టిన పార్టీ టీఆర్ఎస్ అని.. ఇప్పుడు వాళ్లు దేశం మొత్తం పోటీ చేస్తామంటే వారిష్టం అని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. రాజధాని విషయంలో టీడీపీ నేతలు రైతులను రెచ్చగొట్టి నానా యాగీ చేస్తున్నారని మండిపడ్డారు. రాజధాని రైతులకు గత ప్రభుత్వం కన్నా తాము ఎక్కువ కౌలు ఇస్తున్నామన్నారు. తమ ప్రభుత్వం చేసిన తప్పేంటో రైతులు చెప్పాలన్నారు. గత ప్రభుత్వం అడ్డగోలుగా చేసిన ల్యాండ్ పూలింగ్ వల్లే ఇబ్బందులు వచ్చాయన్నారు. అమరావతిని కూడా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశామని.. సీఎం జగన్ తీసుకువచ్చిన వికేంద్రీకరణ పరిపాలనను రాష్ట్ర ప్రజలు ఆమోదించారన్నారు. ఏపీలో మౌళిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నామని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. నిరుపేదలకు ఇళ్లు కట్టి ఇచ్చేందుకు 2023 ఫిబ్రవరి టార్గెట్గా పెట్టుకుని కృషి చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం తరహాలో గ్రాఫిక్స్లో కాకుండా తాము విజన్తో అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Tamannah: ఐటెం అని పిలవద్దట.. తమన్నా డబుల్ స్టాండర్డ్స్ బట్టబయలు
-
Telangana : IFS అధికారుల బదిలీలు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.!
-
EV Push: ఢిల్లీలో సర్కార్ సంచలనం.. 2028 నుంచి పెట్రోల్ బైక్లపై కంప్లీట్ బ్యాన్!
-
Nabha Natesh : శాకాహారులుగా మారిపోయాం!.. నభా నటేష్ సెన్సేషనల్ కామెంట్స్!
-
Arrears Release: బకాయిల క్లియరెన్స్.. తెలంగాణ ఉద్యోగులకు ఊరట!
ట్రెండింగ్
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!