వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణపై ఏసీబీకి ఫిర్యాదు చేసింది తెలుగుదేశం పార్టీ.. దీనిపై మీడియాతో మాట్లాడిన టీడీపీ పొలిట్బ్యూరో సభ్యులు వర్ల రామయ్య.. మేం ఇచ్చిన కంప్లైంట్ తీసుకున్నట్టు ఏసీబీ ఎస్పీ అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చారని తెలిపారు.. అవినీతి చేసిన మంత్రులందరూ తగిన మూల్యం చెల్లించాల్సిందే అని హెచ్చరించారు.
లేపాక్షిలో ఉత్సవాలను మళ్లీ పునః ప్రారంభిస్తాం... అభివృద్ధి చేసి చూపిస్తాం అన్నారు హిందూపురం ఎమ్మెల్యే, నటసింహ నందమూరి బాలకృష్ణ.. వరుసగా మూడోసారి గెలిచి హిందూపురంలో హ్యాట్రిక్ కొట్టిన బాలయ్య.. ఈ రోజు శ్రీ సత్యసాయి జిల్లాలోని తన నియోజకవర్గం హిందూపురంలో పర్యటించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూడోసారి ముచ్చటగా గెలిపించినందుకు హిందూపురం ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు..
బెట్టింగ్ తప్పు అని తెలిసినా కొంత మంది అదే రూట్లో వెళ్తున్నారు. పరువు కోసం, ఆధిపత్యం కోసం.. కారణం ఏదైనా సరే పందెం కాసి ఆస్తులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఎన్నో కుటుంబాలకు తీరని శోకాన్ని మిగుల్చుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఏలూరు జిల్లాలోని నూజివీడు మండలం తూర్పుదిగవల్లిలో జరిగింది.
వైసీపీకి షాక్ తగిలింది. నెల్లూరు మేయర్ స్రవంతి, ఆమె భర్త జయవర్ధన్ వైసీపీకి రాజీనామా చేశారు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెంట నడుస్తామని వారు వెల్లడించారు.
అమరావతి ప్రాంతంలో జగన్ పేదలకు సెంటు స్థలాలను కేటాయించిన ప్రాంతంలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు దారుణాలకు తెగబడ్డారు. కృష్ణాయపాలెం శివారులో శంకుస్థాపన చేసిన నమూనా, ఇంటితోపాటు స్థూపాన్ని కూడా ఏర్పాటు చేశారు. అయితే కొందరు గుర్తు తెలియని వ్యక్తులు స్థూపాన్ని అలాగే శిలాఫలకాన్ని జెసిబితో ధ్వంసం చేశారు. ఈ విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన నేపద్యంలో వైఎస్ఆర్సిపి నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు. SBI ATM: ఎస్బీఐ ఏటీఎం సెంటర్లో చోరీ.. రూ.18,41,300 నగదు…
చిత్తూరు నగరంలోని గాంధీ విగ్రహం సెంటర్ వద్ద తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని 2019 ఎన్నికల తర్వాతనే ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఉన్న విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించి దానికి బదులుగా పాత పోలీస్ స్టేషన్ వద్ద ఉన్న ఆవరణంలో కొత్తగా ఏర్పాటు చేసిన గార్డెన్ లో నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. Tirumala : కొనసాగుతున్న రద్దీ.. దర్శనానికి 10 గంటలు.. 2019 ఎన్నికల కంటే…
చిన్న వయసులో తుడా ఛైర్మన్ పదవి ఇచ్చిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రగిరి అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. తుడా ఛైర్మన్, టీటీడీ ఎక్స్ అఫిషియో సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని ఆయన వెల్లడించారు.
ప్రతి నియోజకవర్గంలో దాడులకు గురైనవారి ఇళ్లకు వెళ్లి వారికి అండగా నిలుస్తాం అని ప్రకటించారు మాజీ మంత్రి కొడాలి నాని.. కౌంటింగ్ అనంతరం టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తలు వైసీపీ నేతలపై ఉద్దేశ పూర్వకంగా దాడులు చేస్తున్నారని ఆరోపించిన ఆయన.. ఇళ్లు, కార్లు ద్వంసం చేసి దాడులు చేస్తున్నారు.. వైసీపీ నేతలను, క్యాడర్ ను భయభ్రాంతులకు గురి చేసే విధంగా దాడులు జరుగుతున్నాయన్నారు.