YS Jagan Pulivendula Visit: నేడు పులివెందులకు వైఎస్ జగన్.. ఎన్నికల తర్వాత తొలిసారి సొంత నియోజకవర్గానికి..
- నేడు పులివెందులకు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి
- ఎన్నికల ఫలితాల తర్వాత తన సొంత నియోజకవర్గానికి జగన్
- ఐదు రోజులపాటు పులివెందులలోనే మకాం వేయనున్న మాజీ సీఎం
- భవిష్యత్ కార్యాచరణ పై పులివెందుల నాయకులతో భేటీ అయ్యే అవకాశం
YS Jagan Pulivendula Visit: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ రోజు తన సొంత నియోజకవర్గం పులివెందులకు వెళ్లనున్నాఉ.. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఆయన సొంత నియోజకవర్గానికి వెళ్లడం ఇదే తొలిసారి.. ఈ రోజు ఉదయం ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి కడప విమానాశ్రయానికి చేరుకోనున్న ఆయన.. కడప విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో పులివెందులకు పయనం అవుతారు. ఇక, ఐదు రోజులపాటు పులివెందులలోనే మకాం వేయనున్నారు వైఎస్ జగన్. సోమవారం తిరిగి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకోనున్నారు.. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో పులివెందులకు చేరుకుంటారు వైఎస్ జగన్.. భవిష్యత్ కార్యాచరణ పైన పులివెందుల నాయకులతో భేటీ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నాయి వైసీపీ శ్రేణులు..
Read Also: Prabhas : ప్రిపేర్ అయి వచ్చా.. ఈ సారి బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే..
Also Read
- Tragedy: వయ్యారాలు ఒలకబోస్తూ 5 గురు స్త్రీలు.. ఏకాంతంగా కలిసేందుకు ఆహ్వానాలు.. చివరకు ఇలా..
- White Towel: ప్రభుత్వ కార్యాలయాల్లో కుర్చీలపై తెల్ల టవల్ ఎందుకు?.. దీని వెనుక ఉన్న స్టోరీ ఇదే!
- TG EAPCET-2026 : షెడ్యూల్ విడుదల.. హాల్ టికెట్ల డౌన్లోడ్ ఎప్పుడంటే.?
- Free Bus Journey: సమ్మె వేళ వారికి భారీ ఊరట.. పురుషులకు కూడా ఉచిత బస్సు ప్రయాణం..
మరోవైపు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో నేడు స్పీకర్గా చింతకాయల అయ్యన్నపాత్రుడు బాధ్యతలు స్వీకరించనున్నారు.. ఇప్పటికే ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.. అయితే, స్పీకర్ ఎన్నిక కార్యక్రమానికి దూరంగా ఉండాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు.. సభాపతిగా ఎన్నికైన వ్యక్తిని అధికార, విపక్ష నేతలు స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టడం సంప్రదాయంగా వస్తోంది. అయితే వైసీపీ అధినేత జగన్ ఈ రోజు ఉదయం వ్యక్తిగత పర్యటన కోసం పులివెందులకు వెళ్తున్న నేపథ్యంలో.. ఈ కార్యక్రమానికి దూరంగా ఉండాలని ఉండబోతున్నారు. కాగా, ఎన్నికల తర్వాత మొట్టమొదటిసారి పులివెందుల నియోజవర్గానికి వైఎస్ జగన్ వస్తుండడంతో ప్రాధాన్యత ఏర్పడింది. సీమ జిల్లాల నేతలు, కార్యకర్తలతో ఆయన సమావేశం కానున్నారు. రోజుకో నియోజకవర్గం నేతలు, కార్యకర్తలతో వైసీపీ అధినేత జగన్ సమావేశాలు నిర్వహించనున్నట్టుగా తెలుస్తోంది. అధైర్య పడకండి అండగా ఉంటానని భరోసా ఇచ్చే ప్రయత్నం చేయనున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగట్టేలా, ప్రజల్లోనే ఉండేందుకు వైఎస్ జగన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. ప్రతిపక్ష హోదాలో ఏం చేయాలన్న దానిపై ముఖ్య నేతలతో ఐదు రోజులపాటు సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Vivo X300 Ultra, Vivo X300 FE: కెమెరా కింగ్గా రాబోతున్న Vivo X300 సిరీస్.. రిలీజ్ డేట్ ఫిక్స్
-
CM Chandrababu: వర్మ తీరుపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అసహనం..
-
Katte Pongali Recipe : టెంపుల్ స్టైల్ కట్టె పొంగలి రహస్యం ఇదే.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు.!
-
Google: గూగుల్ గురించి మీకు తెలియని క్రేజీ ఫ్యాక్ట్స్ ఇవే!
-
Tollywood Pan World Movies: అందరికీ ‘పాన్ వరల్డ్ మూవీ’నే కావాలా?
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?