YS Jagan Pulivendula Visit: నేడు పులివెందులకు వైఎస్ జగన్.. ఎన్నికల తర్వాత తొలిసారి సొంత నియోజకవర్గానికి..
- నేడు పులివెందులకు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి
- ఎన్నికల ఫలితాల తర్వాత తన సొంత నియోజకవర్గానికి జగన్
- ఐదు రోజులపాటు పులివెందులలోనే మకాం వేయనున్న మాజీ సీఎం
- భవిష్యత్ కార్యాచరణ పై పులివెందుల నాయకులతో భేటీ అయ్యే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan Pulivendula Visit: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ రోజు తన సొంత నియోజకవర్గం పులివెందులకు వెళ్లనున్నాఉ.. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఆయన సొంత నియోజకవర్గానికి వెళ్లడం ఇదే తొలిసారి.. ఈ రోజు ఉదయం ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి కడప విమానాశ్రయానికి చేరుకోనున్న ఆయన.. కడప విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో పులివెందులకు పయనం అవుతారు. ఇక, ఐదు రోజులపాటు పులివెందులలోనే మకాం వేయనున్నారు వైఎస్ జగన్. సోమవారం తిరిగి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకోనున్నారు.. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో పులివెందులకు చేరుకుంటారు వైఎస్ జగన్.. భవిష్యత్ కార్యాచరణ పైన పులివెందుల నాయకులతో భేటీ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నాయి వైసీపీ శ్రేణులు..
Read Also: Prabhas : ప్రిపేర్ అయి వచ్చా.. ఈ సారి బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే..
Also Read
- Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
- OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
- OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
- Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
మరోవైపు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో నేడు స్పీకర్గా చింతకాయల అయ్యన్నపాత్రుడు బాధ్యతలు స్వీకరించనున్నారు.. ఇప్పటికే ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.. అయితే, స్పీకర్ ఎన్నిక కార్యక్రమానికి దూరంగా ఉండాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు.. సభాపతిగా ఎన్నికైన వ్యక్తిని అధికార, విపక్ష నేతలు స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టడం సంప్రదాయంగా వస్తోంది. అయితే వైసీపీ అధినేత జగన్ ఈ రోజు ఉదయం వ్యక్తిగత పర్యటన కోసం పులివెందులకు వెళ్తున్న నేపథ్యంలో.. ఈ కార్యక్రమానికి దూరంగా ఉండాలని ఉండబోతున్నారు. కాగా, ఎన్నికల తర్వాత మొట్టమొదటిసారి పులివెందుల నియోజవర్గానికి వైఎస్ జగన్ వస్తుండడంతో ప్రాధాన్యత ఏర్పడింది. సీమ జిల్లాల నేతలు, కార్యకర్తలతో ఆయన సమావేశం కానున్నారు. రోజుకో నియోజకవర్గం నేతలు, కార్యకర్తలతో వైసీపీ అధినేత జగన్ సమావేశాలు నిర్వహించనున్నట్టుగా తెలుస్తోంది. అధైర్య పడకండి అండగా ఉంటానని భరోసా ఇచ్చే ప్రయత్నం చేయనున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగట్టేలా, ప్రజల్లోనే ఉండేందుకు వైఎస్ జగన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. ప్రతిపక్ష హోదాలో ఏం చేయాలన్న దానిపై ముఖ్య నేతలతో ఐదు రోజులపాటు సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?