Mudragada Daughter: ముద్రగడపై కూతురు ఘాటు వ్యాఖ్యలు.. పేరు మార్చుకున్నారు.. కానీ..!
- ముద్రగడపై ఘాటు వ్యాఖ్యలు చేసిన ఆయన కూతురు క్రాంతి
- ఆయన పేరు మార్చుకున్నారు.. కానీ ఆలోచానా విధానం మార్చుకోక పోవటం ఆందోళనగా ఉంది
- శేషజీవితం ఆయన ఇంటికి పరిమితమై విశ్రాంతి తీసుకోవలసిందిగా సలహా
- మళ్లీ పవన్ ను విమర్శిస్తే.. నేను గట్టిగా ప్రతిఘటిస్తాను అని వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mudragada Daughter: కాపు ఉద్యమనేత, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం.. సార్వత్రిక ఎన్నికల సమయంలో చేసిన సవాల్ మేరకు తన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకున్నారు.. ముద్రగడ పద్మనాభం పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మారుస్తూ గెజిట్ విడుదల చేసింది ప్రభుత్వం.. అయితే, సొంత కూతురే ముద్రగడపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.. తాజా పరిణామాలపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన ముద్రగడ కుమార్తె క్రాంతి..
Read Also: Apple School Sale 2024: ‘యాపిల్’ స్కూల్ సేల్.. ఐప్యాడ్, మ్యాక్బుక్లపై భారీ డిస్కౌంట్!
Also Read
- Amazon Offers: అమెజాన్లో సేల్స్.. టాప్ బ్రాండెడ్ స్మార్ట్ఫోన్లపై భారీ ఆఫర్లు..
- IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
- Ketan Agarwal Case: కేఫ్లో గంటపాటు ప్రియుడితో కలిసి హత్యకు కుట్ర.. వెలుగులోకి వీడియోలు
- Khamenei funeral: ఖమేనీ అంత్యక్రియలకు ఇరాన్ ఆహ్వానం.. ఇరకాటంలో మోడీ సర్కార్..
‘మా తండ్రి గారు ఇటీవల ఆయన పేరు పద్మనాభ రెడ్డిగా మార్చుకున్న సంగతి అందరికి తెలిసిందే, ఆయన పేరు మార్చుకున్నారు గాని, అయన ఆలోచానా విధానం మార్చుకోక పోవటం ఆందోళనగా ఉందని మండిపడ్డారు క్రాంతి.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఏనాడూ ప్రశ్నించని ఆయనకు పవన్ కల్యాణ్ని ప్రశ్నించే అర్హత ఉందా? అని నిలదీశారు. ఒకసారి, తనపేరును పద్మనాభం నుంచి పద్మనాభ రెడ్డిగా మార్చుకున్నాక, కాపుల విషయం, ఉప ముఖ్యమంత్రి వర్యులు, యువత భవిష్యత్ ఆశాజ్యోతి అయిన పవన్ కళ్యాణ్ విషయం ఆయనకు ఎందుకో అర్ధం కావడం లేదన్నారు.. పవన్ కళ్యాణ్ ఏమి చేయాలో ఆయనకు స్పష్టత ఉంది. ఏమి చేయాలో మా తండ్రి గారికే స్పష్టత లేదు అనిపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.. శేషజీవితం ఆయన ఇంటికి పరిమితమై విశ్రాంతి తీసుకోవలసిందిగా ఒక కూతురుగా సలహా యిస్తున్నాను.. మళ్లీ పవన్ కళ్యాణ్ ను విమర్శిస్తే, నేను గట్టిగా ప్రతిఘటిస్తాను” అని హెచ్చరిస్తూ ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్లో నిలదీశారు ముద్రగడ కూతురు క్రాంతి. కాగా, సార్వత్రిక ఎన్నికల ప్రచార సమయంలో పవన్ కల్యాణ్ను టార్గెట్ చేస్తూ ముద్రగడ వ్యాఖ్యలు చేస్తూ రాగా.. ఆయనకు వ్యతిరేకంగా ఆయన కూతురు క్రాంతి గొంతు విప్పిన విషయం విదితమే.
మా తండ్రి గారు ఇటీవల ఆయన పేరు పద్మనాభ రెడ్డిగా మార్చుకున్న సంగతి అందరికి తెలిసిందే, ఆయన పేరు మార్చుకున్నారు గాని ,అయన అలోచానా విదానం మార్చుకోక పోవటం ఆందోళనగా ఉన్నది.
జగన్ మోహన్ రెడ్డి గార్ని ఏనాడూ ప్రశ్నించని అయన , పవన్ కళ్యాణ్ గార్ని ప్రెశ్నించే అర్హత ఆయనకు ఉందా?
ఒకసారి,…
— Kranthi Barlapudi (@kr_barlapudi) June 21, 2024
తాజావార్తలు
-
Specific Carbohydrate Diet for Gut Health: పేగుల సమస్యలకు డైట్ థెరపీ.. వైద్యులు ఏమంటున్నారు?
-
Amazon Offers: అమెజాన్లో సేల్స్.. టాప్ బ్రాండెడ్ స్మార్ట్ఫోన్లపై భారీ ఆఫర్లు..
-
Rahul Ravindran: “మహిళలు పురుషులపై దారుణాలు చేయడం నేనెక్కడా చూడలేదు… రాహుల్ రవీంద్రన్ సంచలనం!”
-
IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
-
Ketan Agarwal Case: కేఫ్లో గంటపాటు ప్రియుడితో కలిసి హత్యకు కుట్ర.. వెలుగులోకి వీడియోలు
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!