Kodali Nani: ప్రభుత్వ భవనాల్లో ఉండాల్సిన కర్మ జగన్కు లేదు..
- రుషికొండ భవనాలపై దుష్ప్రచారం చేస్తున్నారు
- రుషికొండ భవనాలు కేవలం టూరిజం శాఖ కోసం మాత్రమే నిర్మించారు
- జగన్ సొంత భవనాల్లో మాత్రమే ఉంటారు తప్ప ప్రభుత్వ భవనాల్లో ఉండరు
- మాజీ మంత్రి కొడాలి నాని ప్రెస్మీట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kodali Nani: త్వరలోనే టీడీపీ శ్రేణులు దాడులు చేసిన వారిని వైసీపీ అధినేత జగన్ పరామర్శిస్తారని మాజీ మంత్రి కొడాలి నాని తెలిపారు. జగన్తో భేటీ అనంతరం మీడియాతో కొడాలి నాని మాట్లాడారు. నియోజకవర్గాల్లో వారం రోజుల పాటు నేతల పర్యటనలు ఉంటాయన్నారు. ఓటమి ఒక మిరాకిల్ మాదిరి ఉందని.. ఇంత మంచి చేసినా ఓటమి పాలవడం నమ్మశక్యంగా లేదన్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని.. 1500 మహిళలకు ఫించన్, 3 గ్యాస్ సిలిండర్లు, ఉచిత బస్సు అంశాల గురించి చంద్రబాబు మాట్లాడటం లేదని ఆయన విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు ఈ నెల ఒకటో తేదీన అమలు చేస్తారా లేదా ఇప్పటికే క్లారిటీ లేదన్నారు. పోలవరం, అమరావతి పేరుతో హామీలు పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
Read Also: CM Chandrababu: 5 కోట్ల మంది ఆంధ్రులకు అమరావతి చిరునామా.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Also Read
- Ambati Rambabu: పెట్రో ధరలపై రిక్షా తొక్కి అంబటి నిరసన.. రెడ్ బుక్ నా మీదే కాదు.. జనసేన వాళ్లపై కూడా అమలు..!
- Virat Kohli: కోహ్లీ ‘స్టంప్ మైక్’ సీక్రెట్ లీక్.. పంజాబ్ను దెబ్బకొట్టిన ఆర్సీబీ వ్యూహం.. ప్లేఆఫ్స్ వేళ సరికొత్త చర్చ..
- Greater Noida: కోటి రూపాయలతో పెళ్లి.. 14 నెలలకే విషాదాంతం! కట్నం వేధింపులకు వివాహిత బలి
- Sattu Chaas Recipe: మండుటెండలో కూల్గా ఉండాలా..? ప్రోటీన్ పవర్తో ‘సత్తు ఛాస్’ తాగండి!.. సింపుల్గా తయారు చేయండి..
సూపర్ సిక్స్ ఎప్పటి నుంచి అమలు చేస్తారో చంద్రబాబు చెప్పాలన్నారు. టీడీపీ బెదిరింపులకు ఎవరు భయపడడం లేదని.. ఎన్నికల కౌంటింగ్ ముగిసి రోజులు కూడా గడవక ముందే జగన్ ఇంటి దగ్గర భద్రత లేకుండా చేశారని మండిపడ్డారు. నన్ను టార్గెట్ చేసి నాకేం అయినా వైసీపీకి ఏం అవ్వదన్నారు. రుషికొండ భవనాలపై అసత్య ప్రచారం చేస్తున్నారన్న కొడాలి నాని.. జగన్ సొంత భవనాల్లో మాత్రమే ఉంటారు తప్ప ప్రభుత్వ భవనాల్లో ఉండరన్నారు. జగన్కు ప్రభుత్వ భవనాల్లో ఉండాల్సిన కర్మ లేదన్నారు. రుషికొండ భవనాల్లో జగన్ ఉంటారు అని ఎవరు చెప్పారని అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రుషికొండ భవనాలు కేవలం టూరిజం శాఖ కోసం మాత్రమే నిర్మించారని చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో వచ్చే వారి కోసం మాత్రమే వీటిని నిర్మించారన్నారు. కోడెల అసెంబ్లీలో ఉండే ఫర్నీచర్ను బైక్ షోరూమ్ లో పెడితే దొంగ అన్నారని.. ఫర్నీచర్ ఎంత వ్యయం అని చెబితే చెల్లిస్తారు, లేకపోతే తీసుకు వెళ్లిపోండని కొడాలి నాని వ్యాఖ్యానించారు. ఏది ఏమైనా సూపర్ సిక్స్ అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. త్వరలోనే నియోజకవర్గాలలో పర్యటన ఉంటుందని కొడాలి నాని వెల్లడించారు.
తాజావార్తలు
-
SEYON : శివకార్తికేయన్ & కమల్ హాసన్ ‘సెయాన్’ షూటింగ్ స్టార్ట్
-
Salman Khan: స్కూల్ పిల్లల కోసం..సల్మాన్ రూ.15 కోట్ల విరాళం..
-
Health Awareness Wedding: ఆలోచింపజేస్తున్న ఈ వధూవరుల నిర్ణయం.. ఆ టెస్ట్ తర్వాతే వివాహబంధంలోకి అడుగుపెట్టిన జంట
-
Ambati Rambabu: పెట్రో ధరలపై రిక్షా తొక్కి అంబటి నిరసన.. రెడ్ బుక్ నా మీదే కాదు.. జనసేన వాళ్లపై కూడా అమలు..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బలహీనత బయటపడిందా?.. రాజస్థాన్ కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..