MP CM Ramesh: సీబీఐ, ఈడీకి ఫిర్యాదు చేస్తాం.. బీజేపీ ఎంపీ కీలక వ్యాఖ్యలు
- బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కీలక వ్యాఖ్యలు
- ఐదేళ్లుగా ఈ అసెంబ్లీ వైపే రాలేదు.. ఇప్పుడు అతి పెద్ద విజయంతో వచ్చాం
- గత ఐదేళ్ల కాలంలో వివిధ శాఖల్లో జరిగిన అవినీతిపై విచారణ చేపట్టాలని సీఎంను కోరాం
- ఏపీలో జరిగిన అవినీతిపై సీబీఐ.. ఈడీలకు ఫిర్యాదు చేస్తాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP CM Ramesh: ఆంధ్రప్రదేశ్ శాసన సభ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో శాసన సభకు వచ్చిన బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు.. ఐదేళ్లుగా ఈ అసెంబ్లీ వైపే రాలేదు.. ఇప్పుడు అతి పెద్ద విజయంతో వచ్చామని.. గత ఐదేళ్ల కాలంలో వివిధ శాఖల్లో జరిగిన అవినీతిపై విచారణ చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కోరామని మీడియా చిట్చాట్లో తెలిపారు.. రాష్ట్రంలో మద్యం, ఇసుక మాఫియాల మీదే కాకుండా.. చాలా శాఖల్లో అవినీతి భారీ ఎత్తున జరిగిందన్న ఆయన.. విద్యుత్ రంగంలో స్మార్ట్ మీటర్లు, పీపీఏల్లో భారీ కుంభకోణాలు జరిగాయన్నారు.. పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల కేటాయిపుల్లోనూ అక్రమ లావాదేవీలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు.. ఇక, సాంఘీక సంక్షేమ శాఖలో కూడా అవినీతి జరిగిందన్న ఆయన.. శాఖల వారీగా అవినీతి ఎక్కడెక్కడ జరిగిందో వెలికి తీయాలన్నారు.. ఇక, గత ఐదేళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్లో జరిగిన అవినీతిపై సీబీఐ, ఈడీలకు ఫిర్యాదు చేస్తామన్నారు బీజేపీ ఎంపీ సీఎం రమేష్.
Read Also: Air India Airlines : టాటా ఎయిర్లైన్ కంపెనీకి మళ్లీ నోటీసు.. 15రోజుల్లో తప్పు సరిదిద్దుకోవాలని సూచన
Also Read
- Bus Fitness Certificates: స్కూల్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు.. వందల సంఖ్యలో ఫిట్నెస్ లేని బస్సులు!
- Tragedy: తీవ్ర విషాదం.. ముగ్గురి ప్రాణాలు తీసిన ఈత సరదా.
- Mamata Banerjee: మమతా బెనర్జీకి షాక్ మీద షాక్.. ఆ 9 మంది ఎమ్మెల్యేలు ఏమయ్యారు..?
- Viral: ఓ వైపు బండ రాళ్ల మధ్య ఇరుక్కున్న బాలుడి తల.. అదే సందులో విషపూరిత పాము.. చివరకు ఏమైందంటే..
కాగా, ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. తొలిసారి అసెంబ్లీ సమావేశమైంది.. ఈ రోజు, రేపు.. రెండు రోజుల పాటు సమావేశాలు నిర్వహించనున్నారు.. ఇక, సభలో మొదట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఆ తర్వాత మంత్రులు.. ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు.. ఆ తర్వాత వైఎస్ జగన్ ప్రమాణం చేయగా.. మిగతా సభ్యులతో అక్షర క్రమంలో ఎమ్మెల్యేలతో ప్రమాణస్వీకారం చేయించారు ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి..
- Tags
- Andhra Pradesh
- bjp
- CBI
- cm chandrababu
- ED
తాజావార్తలు
-
Vivo X300 FE: 6,500mAh బ్యాటరీ, జైస్-ట్యూన్డ్ కెమెరాతో.. వివో X300 FE భారత్ లో విడుదల
-
Bus Fitness Certificates: స్కూల్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు.. వందల సంఖ్యలో ఫిట్నెస్ లేని బస్సులు!
-
Tragedy: తీవ్ర విషాదం.. ముగ్గురి ప్రాణాలు తీసిన ఈత సరదా.
-
MK Stalin: తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై తమ వైఖరిని స్పష్టం చేసిన స్టాలిన్.. కీలక ప్రకటన
-
NANI : నాని ఫ్యాన్స్కు నిరాశ.. ‘బ్లడీ రోమియో’ వాయిదా.. ‘OG 2’పై సుజీత్ ఫోకస్