MP CM Ramesh: సీబీఐ, ఈడీకి ఫిర్యాదు చేస్తాం.. బీజేపీ ఎంపీ కీలక వ్యాఖ్యలు
- బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కీలక వ్యాఖ్యలు
- ఐదేళ్లుగా ఈ అసెంబ్లీ వైపే రాలేదు.. ఇప్పుడు అతి పెద్ద విజయంతో వచ్చాం
- గత ఐదేళ్ల కాలంలో వివిధ శాఖల్లో జరిగిన అవినీతిపై విచారణ చేపట్టాలని సీఎంను కోరాం
- ఏపీలో జరిగిన అవినీతిపై సీబీఐ.. ఈడీలకు ఫిర్యాదు చేస్తాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP CM Ramesh: ఆంధ్రప్రదేశ్ శాసన సభ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో శాసన సభకు వచ్చిన బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు.. ఐదేళ్లుగా ఈ అసెంబ్లీ వైపే రాలేదు.. ఇప్పుడు అతి పెద్ద విజయంతో వచ్చామని.. గత ఐదేళ్ల కాలంలో వివిధ శాఖల్లో జరిగిన అవినీతిపై విచారణ చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కోరామని మీడియా చిట్చాట్లో తెలిపారు.. రాష్ట్రంలో మద్యం, ఇసుక మాఫియాల మీదే కాకుండా.. చాలా శాఖల్లో అవినీతి భారీ ఎత్తున జరిగిందన్న ఆయన.. విద్యుత్ రంగంలో స్మార్ట్ మీటర్లు, పీపీఏల్లో భారీ కుంభకోణాలు జరిగాయన్నారు.. పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల కేటాయిపుల్లోనూ అక్రమ లావాదేవీలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు.. ఇక, సాంఘీక సంక్షేమ శాఖలో కూడా అవినీతి జరిగిందన్న ఆయన.. శాఖల వారీగా అవినీతి ఎక్కడెక్కడ జరిగిందో వెలికి తీయాలన్నారు.. ఇక, గత ఐదేళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్లో జరిగిన అవినీతిపై సీబీఐ, ఈడీలకు ఫిర్యాదు చేస్తామన్నారు బీజేపీ ఎంపీ సీఎం రమేష్.
Read Also: Air India Airlines : టాటా ఎయిర్లైన్ కంపెనీకి మళ్లీ నోటీసు.. 15రోజుల్లో తప్పు సరిదిద్దుకోవాలని సూచన
Also Read
కాగా, ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. తొలిసారి అసెంబ్లీ సమావేశమైంది.. ఈ రోజు, రేపు.. రెండు రోజుల పాటు సమావేశాలు నిర్వహించనున్నారు.. ఇక, సభలో మొదట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఆ తర్వాత మంత్రులు.. ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు.. ఆ తర్వాత వైఎస్ జగన్ ప్రమాణం చేయగా.. మిగతా సభ్యులతో అక్షర క్రమంలో ఎమ్మెల్యేలతో ప్రమాణస్వీకారం చేయించారు ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి..
- Tags
- Andhra Pradesh
- bjp
- CBI
- cm chandrababu
- ED
తాజావార్తలు
-
INDW Vs PAKW: కుప్పకూలిన పాకిస్థాన్.. 55 పరుగులకే ఆలౌట్..
-
PM Modi: ‘‘వారి గ్లాస్ ఎప్పుడూ సగం ఖాళీనే’’.. GDPపై మోదీ ఘాటు వ్యాఖ్యలు
-
CM Revanth Reddy : సిరిసిల్ల, సిద్దిపేట గడ్డమీద మూడు రంగుల జెండా ఎగరేస్తాం
-
HYDRAA : గణేష్ నిమజ్జనాలపై ఫేక్ ప్రచారం.. రంగనాథ్ క్లారిటీ..!
-
PM Modi: ఎస్ఆర్సీసీ నుంచి బయటకొచ్చినోళ్లు గొప్పోళ్లు కాకపోవచ్చు.. కానీ..!
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!