పోలీసులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు తెలుగుదేశం పార్టీ నేత, తాడిపత్రి మున్సిపల్చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తనపై అక్రమ కేసులు పెట్టిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసి ఐదు నెలలైనా... నిర్లక్ష్యంగా వ్యవహరించారని.. ఆరోపిస్తున్నారు జేసీ..
సాగునీటి సంఘాల ఎన్నికలు వైఎస్ఆర్ కడప జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులకు దారి తీశాయి. పులివెందుల నియోజకవర్గంలోని పలు మండలాలలో రైతులకు నో డ్యూస్ సర్టిఫికెట్ ఇవ్వడం లేదని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మండిపడ్డారు. అయితే, వేములలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో.. ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు
ఆంధ్రప్రదేశ్లో పోరుబాట పట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. కూటమి ప్రభుత్వంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై కార్యాచరణ ప్రకటించారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఇక, అందులో భాగంగా.. నేడు ఏపీ వ్యాప్తంగా వైసీపీ ఆధ్వర్యంలో కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేత కార్యక్రమం చేపట్టారు.. రైతుల సమస్యలు కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్న వైసీపీ.. రైతులతో కలిసి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తోంది.. పెట్టుబడి, గిట్టుబాటు ధర.. ఉచిత పంటల బీమా రద్దుతో కూటమి ప్రభుత్వం అన్నదాతను దగా…
పశ్చిమ గోదావరి జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది.. భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పార్టీని వీడెందుకు సిద్ధమయ్యారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.. కొద్దికాలం రాజకీయాలకు దూరంగా ఉండే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది.. 2024 ఎన్నికల ఓటమి తర్వాత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు గ్రంధి శ్రీనివాస్.. ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీలో చేరే ప్రయత్నాలు కూడా చేశారు.
వైసీపీకి షాక్ ఇస్తూ.. ఆ పార్టీకి గుడ్బై చెప్పారు మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్.. కొత్త ప్రభుత్వానికి కనీసం ఏడాది సమయం ఇవ్వాలన్నారు అవంతి.. సమయం ఇవ్వకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా రొడ్డెక్కడం సరైనది కాదని హితవు చెప్పారు.. బ్రిటీష్ ప్రభుత్వం తరహాలో తాడేపల్లిలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుని అమలు చేయమని చెప్పడం కరెక్ట్ కాదన్న ఆయన.. ఎన్నికలు అయిన ఆరు నెలలు తిరగక ముందే మళ్లీ కేడర్ రొడ్డెక్క మనడం కరెక్ట్ కాదన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించిన కీలక కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.. ఏపీ రాజధాని అమరావతిపై గత ప్రభుత్వం వేసిన పిటిషన్పై విచారణ చేయనుంది సుప్రీం.. అయితే, అమరావతి ఆంధ్రప్రదేశ్కి ఏకైక రాజధాని అని గతంలో హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం తీర్పు వెలువరించింది.. కాగా, ఏపీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది
చంద్రబాబు అబద్ధాలు, మోసాలపట్ల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు, గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. ప్రతినెలా ఒక్కో అంశాన్ని పట్టుకుని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు వైఎస్ జగన్.. వాళ్లు రాస్తున్న కథనాలు చూస్తుంటే.. ప్రభుత్వంలో ఎరున్నారు? అనే సందేహం కలుగుతుంది. ప్రభుత్వంలో మంత్రులు వాళ్లవాల్లే, అధికారులు వాళ్ల మనుషులే, చివరకు చెక్పోస్టులు వాళ్లు పెట్టినవే పోర్టులో కస్టమ్స్ వాళ్లు, భద్రతా సిబ్బంది వాళ్లే.. కేంద్రంలోనూ వాళ్లే ఉన్నారు, రాష్ట్రంలోనూ వాళ్లే ఉన్నారు. ఆర్థిక…
ఓవైపు కేసుల భయం, మరోవైపు ఏం మాట్లాడినా ఇరుక్కుంటామన్న ఆందోళనతో ఇప్పుడు రోజా డైవర్షన్ కోసం చూస్తున్నట్టు సమాచారం. ఉక్కిరి బిక్కిరి చేస్తున్న రాజకీయ సెగ నుంచి తప్పించుకోవడానికి... తిరిగి టాలీవుడ్, కోలీవుడ్ వైపు చూస్తున్నారట రోజా. క్యారెక్టర్ రోల్స్ చేయడానికి నేను రెడీ... అంటూ తన టీమ్ ద్వారా తెలుగు, తమిళంలోని పలువురు దర్శకులకు, నిర్మాతలకు సంకేతాలు పంపినట్టు సమాచారం.
INDIA bloc Rift Widens: ఇండియా కూటమిలో చీలిక వచ్చినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. కూటమి అధ్యక్ష బాధ్యతలను తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి అప్పగించాలని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తెలిపారు. ఇండియా కూటమి నాయకత్వాన్ని మమతా బెనర్జీకి అప్పగించాలని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పోస్ట్ చేశారు.