RK Roja: మరోసారి రోజా సంచలన వ్యాఖ్యలు.. తప్పులు చేసి ఓడిపోలేదు..!
- ఆర్కే రోజా మరోసారి సంచలన వ్యాఖ్యలు..
- జైల్లో పెడతావా..? పెట్టుకో.. కేసులు పెడతావా? పెట్టుకో..
- మళ్లీ మా ప్రభుత్వం వస్తుంది.. వడ్డీతో సహా తిరిగి ఇస్తామని వార్నింగ్..
- ఇబ్బందులుపడిన కార్యకర్తల పేర్లను గుడ్ బుక్లో రాసి పెట్టుకుంటాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RK Roja: మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత ఆర్కే రోజా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఓవైపు తప్పులు చేసి మనం ఓడిపోలేదు అని పార్టీ శ్రేణులకు ధైర్యం చెబుతూనే.. మరోవైపు కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు రోజా.. జైల్లో పెడతావా..? పెట్టుకో.. కేసులు పెడతావా? పెట్టుకో.. ఉద్యోగాలు తీసేస్తావా తీసేసెయ్..! మళ్లీ మా ప్రభుత్వం వస్తుంది.. వడ్డీతో సహా తిరిగి ఇస్తామని హెచ్చరించారు.. ఇక, కూటమి ప్రభుత్వ హయాంలో ఇబ్బందులు పడ్డ కార్యకర్తల పేర్లను గుడ్ బుక్లో రాసి పెట్టుకుంటాం.. వారిని గుర్తుపెట్టుకుంటామని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Read Also: Pakistan: పామును పెంచిన పాకిస్తాన్.. దాడికి సిద్ధమైన 15,000 మంది తాలిబన్ ఫైటర్స్..
Also Read
- Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
- YS Jagan : మహిళల భద్రత ఎక్కడ? చంద్రబాబుపై జగన్ తీవ్ర విమర్శలు
- CM Chandrababu : అమరావతి దేవతల రాజధాని.. నవ్యాంధ్రను నెంబర్ వన్ చేయడమే నా లక్ష్యం
- MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
ఉద్యోగస్తులందరూ ఎగిరెగిరి పడ్డారు.. మన ప్రభుత్వాన్ని దించేంతవరకు ఉద్యోగులందరూ కంకణం కట్టుకొని పనిచేశారు.. ఇప్పుడు ఉద్యోగస్తులు అందరూ నరకయాతన అనుభవిస్తున్నారని వ్యాఖ్యానించారు ఆర్కే రోజా.. ఇక, పవన్ కల్యాణ్కు, చంద్రబాబుకు, లోకేష్ కు మాత్రమే ఉద్యోగాలు వచ్చాయి.. ఏపీ యువతకు ఉద్యోగాలు రాలేదన్న ఆమె.. మనం తప్పులు చేసి ఓడిపోలేదు.. ఆరు నెలల్లోనే కూటమి ప్రభుత్వం ఆలీబాబా ఆరడజను దోంగల్లా మారిందని విమర్శించారు.. ఏపీ ప్రజలకు నరకం అంటే ఎంటో కూటమి ప్రభుత్వం చూపిస్తుందన్నారు.. జగన్ను ఓడించి తప్పుచేశామని ప్రజలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.. పశ్చాత్తాప పడుతున్నారని వ్యాఖ్యానించారు.. సంపద సృష్టిస్తా అని చెప్పి అప్పుల మీద అప్పులు చంద్రబాబు సృష్టిస్తున్నారు… ఎన్నికల ప్రచారంలో పచ్చ చొక్కాలు వేసుకుని, పచ్చ చీరలు కట్టుకుని నీకు 15 వేలు నీకు 15 వేలు అంటూ అబద్దాలు చెప్పారని మండిపడ్డారు.. జగన్ బిజినెస్ మాన్ గా, పార్టీ అధినేతగా, ఫ్యామిలీ మెన్ గా సక్సెస్ అయిన వ్యక్తిగా అభివర్ణించారు ఆర్కే రోజా..
Read Also: Asma Assad: ప్రాణాపాయ స్థితిలో సిరియా మాజీ అధ్యక్షుడి భార్య అస్మా.. చేతులెత్తేసిన వైద్యులు!
మరోవైపు.. పార్టీ కీలక నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉద్దేశించి మరోసారి పరోక్షంగా ఫైర్ అయ్యారు మాజీ మంత్రి రోజా… మన పార్టీలోని కొందరు చేసిన దిగజారుడు రాజకీయాల వల్ల ఎప్పుడూ అత్యధిక స్థానాలు గెలిచే జిల్లాలో ఈసారి గెలవలేకపోయామన్నారు.. వచ్చే ఎన్నికల్లో జిల్లా అధ్యక్షుడిగా భుమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో కుప్పంతో సహా 14 స్థానాలను గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు మాజీ మంత్రి ఆర్కే రోజా..
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!