RK Roja: మరోసారి రోజా సంచలన వ్యాఖ్యలు.. తప్పులు చేసి ఓడిపోలేదు..!
- ఆర్కే రోజా మరోసారి సంచలన వ్యాఖ్యలు..
- జైల్లో పెడతావా..? పెట్టుకో.. కేసులు పెడతావా? పెట్టుకో..
- మళ్లీ మా ప్రభుత్వం వస్తుంది.. వడ్డీతో సహా తిరిగి ఇస్తామని వార్నింగ్..
- ఇబ్బందులుపడిన కార్యకర్తల పేర్లను గుడ్ బుక్లో రాసి పెట్టుకుంటాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RK Roja: మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత ఆర్కే రోజా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఓవైపు తప్పులు చేసి మనం ఓడిపోలేదు అని పార్టీ శ్రేణులకు ధైర్యం చెబుతూనే.. మరోవైపు కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు రోజా.. జైల్లో పెడతావా..? పెట్టుకో.. కేసులు పెడతావా? పెట్టుకో.. ఉద్యోగాలు తీసేస్తావా తీసేసెయ్..! మళ్లీ మా ప్రభుత్వం వస్తుంది.. వడ్డీతో సహా తిరిగి ఇస్తామని హెచ్చరించారు.. ఇక, కూటమి ప్రభుత్వ హయాంలో ఇబ్బందులు పడ్డ కార్యకర్తల పేర్లను గుడ్ బుక్లో రాసి పెట్టుకుంటాం.. వారిని గుర్తుపెట్టుకుంటామని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Read Also: Pakistan: పామును పెంచిన పాకిస్తాన్.. దాడికి సిద్ధమైన 15,000 మంది తాలిబన్ ఫైటర్స్..
Also Read
- Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
- Off The Record : చీమకుర్తి గ్రానైట్ క్వారీల్లో అదృశ్య శక్తులు..? వైసీపీ ఎమ్మెల్యే క్వారీని టార్గెట్ చేశారా?
- YS Jagan : వైసీపీలోకి మోపిదేవి శ్రీనివాసరావు.. రేపల్లె బాధ్యత మనదే.. కార్యకర్తలే నా బలం
- Vizag: విశాఖలో ఘోర విషాదం.. పెళ్లి దండలతోనే నవ వధువు మృతి
ఉద్యోగస్తులందరూ ఎగిరెగిరి పడ్డారు.. మన ప్రభుత్వాన్ని దించేంతవరకు ఉద్యోగులందరూ కంకణం కట్టుకొని పనిచేశారు.. ఇప్పుడు ఉద్యోగస్తులు అందరూ నరకయాతన అనుభవిస్తున్నారని వ్యాఖ్యానించారు ఆర్కే రోజా.. ఇక, పవన్ కల్యాణ్కు, చంద్రబాబుకు, లోకేష్ కు మాత్రమే ఉద్యోగాలు వచ్చాయి.. ఏపీ యువతకు ఉద్యోగాలు రాలేదన్న ఆమె.. మనం తప్పులు చేసి ఓడిపోలేదు.. ఆరు నెలల్లోనే కూటమి ప్రభుత్వం ఆలీబాబా ఆరడజను దోంగల్లా మారిందని విమర్శించారు.. ఏపీ ప్రజలకు నరకం అంటే ఎంటో కూటమి ప్రభుత్వం చూపిస్తుందన్నారు.. జగన్ను ఓడించి తప్పుచేశామని ప్రజలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.. పశ్చాత్తాప పడుతున్నారని వ్యాఖ్యానించారు.. సంపద సృష్టిస్తా అని చెప్పి అప్పుల మీద అప్పులు చంద్రబాబు సృష్టిస్తున్నారు… ఎన్నికల ప్రచారంలో పచ్చ చొక్కాలు వేసుకుని, పచ్చ చీరలు కట్టుకుని నీకు 15 వేలు నీకు 15 వేలు అంటూ అబద్దాలు చెప్పారని మండిపడ్డారు.. జగన్ బిజినెస్ మాన్ గా, పార్టీ అధినేతగా, ఫ్యామిలీ మెన్ గా సక్సెస్ అయిన వ్యక్తిగా అభివర్ణించారు ఆర్కే రోజా..
Read Also: Asma Assad: ప్రాణాపాయ స్థితిలో సిరియా మాజీ అధ్యక్షుడి భార్య అస్మా.. చేతులెత్తేసిన వైద్యులు!
మరోవైపు.. పార్టీ కీలక నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉద్దేశించి మరోసారి పరోక్షంగా ఫైర్ అయ్యారు మాజీ మంత్రి రోజా… మన పార్టీలోని కొందరు చేసిన దిగజారుడు రాజకీయాల వల్ల ఎప్పుడూ అత్యధిక స్థానాలు గెలిచే జిల్లాలో ఈసారి గెలవలేకపోయామన్నారు.. వచ్చే ఎన్నికల్లో జిల్లా అధ్యక్షుడిగా భుమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో కుప్పంతో సహా 14 స్థానాలను గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు మాజీ మంత్రి ఆర్కే రోజా..
తాజావార్తలు
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!