Minister Atchannaidu: జనవరి నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం
- జనవరి నుండి ఇంటర్మీడియట్ విద్యలో మధ్యాహ్న భోజనం
- నాడు-నేడు పనులపై విచారణకు ఆదేశిస్తాం
- మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Atchannaidu: గతంలో 117 జీఓ తెచ్చి విద్యా వ్యవస్థ నిర్వీర్యం చేశారని.. 117 జీఓను రద్దు చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.జనవరి నుండి ఇంటర్మీడియట్ విద్యలో మధ్యాహ్న భోజనం పథకాన్ని ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. విద్యా కిట్లు ఇస్తున్నామని ఆయన వెల్లడించారు. మూలపేట పోర్టులో శరవేగంగా పనులు జరుగుతున్నాయని.. జూన్ నాటికి మొదటి షిప్ రావడానికి ప్రయత్నం చేస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. 5 వేల ఎకరాల సాల్ట్ ల్యాండ్ తీసుకుంటామని చెప్పారు.
Read Also: Sandhya Theatre Stampede: : ఇకపై నో బెనిఫిట్ షోలు.. టీ సర్కార్ షాకింగ్ నిర్ణయం
Also Read
- PM Modi: అప్పుడు బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారు.. హైదరాబాద్ టూర్పై మోడీ ట్వీట్
- Agni Missile: అగ్ని మిస్సైల్ మరో స్థాయికి.. MIRV క్షిపణి పరీక్ష విజయవంతం
- Intel Alert: ఢిల్లీలో ఉగ్రదాడికి కుట్ర.. నిఘా వర్గాల హెచ్చరికతో హై అలర్ట్..
- TVK Vijay: విజయ్ ప్రమాణస్వీకారం సమయం మార్పు.. ఎప్పుడంటే..!
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. గత ఐదేళ్లు రైతులను మభ్యపెట్టారని.. గతంలో మాదిరిగానే వైసీపీ అబద్ధాలు చెబుతోందన్నారు. ఐదేళ్లలో వ్యవస్థలు నిర్వీర్యం చేశారని.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయిందని విమర్శించారు. చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఐదేళ్లలో లక్ష కోట్లు అప్పు చేశారన్నారు. కేంద్రం ఇచ్చిన పథకాలు కూడా వైసీపీ వినియోగించలేదన్నారు. గత ప్రభుత్వం 1600 కోట్ల రూపాయలు రైతులకు బకాయిలు పెట్టిందన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన నాలుగు గంటల్లోనే రైతులకు డబ్బులు చెల్లిస్తున్నామన్నారు. నేటి వరకు 21 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి మూడు లక్షల ఇరవై వేల మంది రైతులకు సొమ్మును ఖాతాలో జమ చేశామన్నారు. యాంత్రీకరణకు అధిక ప్రాధాన్యత ఇస్తూ 24 శాతం ఉన్న తేమను 14 శాతానికి తగ్గించామన్నారు. రాష్ట్రంలో రూ.4,600 కోట్లతో రోడ్లను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. నాడు-నేడు పనులపై విచారణకు ఆదేశిస్తామని ఆయన వెల్లడించారు.
తాజావార్తలు
-
Suriya: సూర్య ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ‘విశ్వనాథ్ & సన్స్’ రిలీజ్ అప్పుడే!
-
PM Modi: అప్పుడు బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారు.. హైదరాబాద్ టూర్పై మోడీ ట్వీట్
-
Agni Missile: అగ్ని మిస్సైల్ మరో స్థాయికి.. MIRV క్షిపణి పరీక్ష విజయవంతం
-
Manity: వేల కోట్ల టార్గెట్’తో ఇద్దరు టాలీవుడ్ స్టార్ హీరోలతో పాన్ ఇండియా మూవీ?
-
Mango Sharbat : ఎండవేడిని తరిమికొట్టే ‘మామిడి పండ్ల షర్బత్’.. ఇంట్లోనే సులభంగా ఇలా తయారు చేసుకోండి.!