తెలుగుదేశం 40 ఏళ్ళ పండుగ తెలుగు తమ్ముళ్ళను ఖుషీ చేస్తోంది. ఒంగోలు మహానాడు సభ సక్సెస్ తో ఉమ్మడి ప్రకాశం జిల్లా టీడీప శ్రేణులు జోష్ మీదున్నాయి. ఆల్ టైం రికార్డులు సృష్టించిన ఈ సభతో వచ్చే ఎన్నికల్లో తాము ముందే గెలిచినట్లుగా భావిస్తున్నారు. ఎన్నో ఇబ్బందులను అధిగమించి టీడీపీ కార్యకర్తలు లక్షల సంఖ్యలో సభకు హాజరు కావటం టీడీపీ నేతలకు కొత్త ఉత్యాహాన్నిచ్చింది. అయితే వైసీపీ నేతలు మాత్రం టీడీపీ నేతలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని..…
ఒకవైపు ఒంగోలులో టీడీపీ మహానాడు.. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ మంత్రుల సామాజిక న్యాయభేరీ బస్సు యాత్రతో ఏపీలో ఎన్నికల వాతావరణం ప్రారంభం అయినట్టే కనిపిస్తోంది. మహానాడు వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు గర్జించారు. యుద్ధం ప్రకటించారు. వైసీపీని భూస్థాపితం చేస్తానని ప్రతిన బూనారు. జగన్ పాలనపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. ఇదీ వైసీపీ అవినీతి, అక్రమాల, దౌర్జన్యాలు, దారుణాల చిట్టా అంటూ లెక్క చెప్పారు. జగన్ మింగిన అవినీతి సొమ్ము మొత్తం కక్కిస్తామని తెలుగు తమ్ముళ్ళ సాక్షిగా…
టీడీపీ నేతల విమర్శలపై ఘాటుగా స్పందించారు వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి. మహానాడు ఒక మహా స్మశానం. ఎన్టీఆర్ బతికి ఉంటే ఇవాళ వందో పుట్టినరోజు చేసుకుని ఉండేవారు. 73 ఏళ్ళ వయసులోనే ఆయనను హత్య చేసి ఇవాళ మహానాడు చేస్తున్నారు. ఆయన ఆత్మక్షోభ ప్రభావాన్ని చంద్రబాబు అనుభవిస్తున్నారన్నారు విజయసాయిరెడ్డి. పప్పునాయుడు వచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రిని పదవి దించే పరిస్థితి ఉంటుందా? మంత్రులు పార్టీకి రిపోర్ట్ చేస్తారు అన్నాడంటే చంద్రబాబు అవగాహన లేని నాయకుడు అని…
ఏపీలో టీడీపీ వర్సెస్ వైసీపీ మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా మాజీ మంత్రి కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలతో వాతావరణం మరింతగా వేడెక్కింది. బస్సు యాత్ర పై చంద్రబాబు విషం కక్కుతున్నాడు. ప్రజలు రాజకీయ సమాధి కడతారు. మహానాడుకు భయపడుతున్నారు అనటానికి చంద్రబాబు కు సిగ్గు ఉండాలి. కొడుకును ఎమ్మెల్యేగా గెలిపించుకోలేని చవట సన్నాసి జగన్ ను ఓడిస్తాడట. చంద్రబాబు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని వార్నింగ్ ఇచ్చారు కొడాలి నాని. చంద్రబాబు, మహానాడు తీరుపై నిప్పులు…
ఏపీలో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంత బాబు ను అదుపులోకి తీసుకోవడంపై మండలి చైర్మన్,అసెంబ్లీ సెక్రటరీ కి సమాచారం ఇచ్చారు కాకినాడ పోలీసులు. ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ పోలీసు కస్టడీలో ఉన్నారని ఏఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. ఎమ్మెల్సీ కారు డ్రైవర్ కేసులో విచారణ కొనసాగుతుందన్నారు. పోలీస్ కష్టడీని నిర్థారించారు అడిషనల్ ఏస్పీ శ్రీనివాస్. అనంతబాబుని ఏలూరు రేంజ్ డీఐజీ పాల్ రాజ్ విచారిస్తున్నారు. ఈ వ్యవహారం మొత్తాన్ని అత్యంత గోప్యంగా వుంచుతున్నారు.
గుంటూరు జిల్లాలో ఓ భూవివాదం ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది. తాడేపల్లిలోని ఓ ప్రాంతంలో తమ భూమిలో నాగి రెడ్డి అనే వ్యక్తి దౌర్జన్యంగా ఆక్రమించే ప్రయత్నం చేశాడని , తమ పై దాడి చేశాడని కోటేశ్వరావు అనే వ్యక్తి ఆరోపించాడు. ఈ నేపథ్యంలోనే నాగిరెడ్డి అనే వ్యక్తిపై అతనికి మద్దతు ఇస్తున్న వారిపై కోటేశ్వరరావు రాజకీయంగా ఆరోపణలు చేయడంతో ఇప్పుడు వివాదం రాజకీయ రంగు పులుముకుంది. గుంటూరు జిల్లా తాడేపల్లి లోని పొలకం పాడులో ఓ…
ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ప్రశాంత్ కిషోర్ అంశం హాట్ టాపిక్ అవుతోంది. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్ళ టైం వుంది. కానీ అప్పుడే వేడి మరింతగా రాజుకుంది. ఎన్నికల వ్యుహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీకి సమర్పించిన రిపోర్ట్లో.. ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధికార వైసీపీతో పొత్తుపెట్టుకోవాలని ఓ ప్రతిపాదన చేశారని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై వైసీపీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి స్పందిస్తూ.. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే పార్టీకి…
ఏపీలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం మళ్ళీ మొదలైంది. టీడీపీ సీనియర్ నేత వెంకన్న 100 మందితో సూసైడ్ బ్యాచ్ రెడీగా వుందన్న వ్యాఖ్యలపై మంత్రి జోగిరమేష్ స్పందించారు. బుద్దా వెంకన్న వ్యాఖ్యలపై మంత్రి జోగి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెన్నుపోటు పొడవటం చంద్రబాబు రక్తంలోనే వుంది. టీడీపీ మాపై పోటీ పడి గెలిచే అవకాశమే లేదు. మేం వాళ్ళని టచ్ చెయ్యనవపరం లేదు. జనమే ఓట్లతో సమాధానం చెప్పారు. చంద్రబాబే సూసైడ్…
టీడీపీ పుట్టి 40 ఏళ్ళు అయ్యిందని సంబరాలు చేసుకుంటున్నారు. ఇలా సంబరాలు చేసుకోవడం లో తప్పు లేదు. 1995లో ప్రజా నిర్ణయంతో అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్ ను గద్దె దించటం కూడా చూడాల్సిన కోణం. అప్పటి నుంచి ఇప్పటి వరకు పార్టీ ఆవిర్భావం కూడా మీడియా మేనేజ్మెంట్ ఉంది. కానీ అప్పటి రాజకీయ అవసరం వేరు. అప్పుడు జర్నలిస్టుగా దగ్గరగా అన్ని పరిణామాలు చూసిన వాడిని. కానీ చంద్రబాబు హయాంలో ప్రజాస్వామ్య స్ఫూర్తిని తొక్కి పూర్తిగా వ్యవస్థలను…
ఏపీలో పెగాసస్ ప్రకంపనలు కలిగిస్తోంది. టెక్నాలజీకి ఆద్యుడిని అని చెప్పుకుంటారు చంద్రబాబు. మమతా బెనర్జీ సీనియర్ రాజకీయ నాయకురాలు. శాసనసభలో ఒక ముఖ్యమంత్రి హోదాలో అధికారికంగా చంద్రబాబు పెగాసస్ సాఫ్ట్వేర్ను కొనుగోలు చేసిన విషయాన్ని బయట పెట్టారు. చంద్రబాబు, లోకేష్ ఎందుకు భుజాలు తడుముకుంటున్నారు? మమతా బెనర్జీ పార్టీతో మాకు స్నేహపూర్వక సంబంధాలు ఏమీ లేవన్నారు. మోడీకి వ్యతిరేకంగా చంద్రబాబు, మమతా బెనర్జీ కలిసి పని చేసిన విషయం వాస్తవం కాదా? మమతా వ్యాఖ్యలు వాస్తవం కాకపోతే…