ముందస్తు ఎన్నికలు వస్తాయంటూ కొంత ప్రచారం జరుగుతోంది.. ఇప్పటికే అన్ని పార్టీలు ఎన్నకల మూడ్లోకి వెళ్లిపోయినట్టు సభలు, సమావేశాలు, రాజకీయా నేతల పర్యటనలతో హీట్ పెంచుతున్నారు.. కోవిడ్ మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో కాస్త వెనక్కి తగ్గినా.. స్టేట్మెంట్లు, ఆరోపణలు, విమర్శలతో మాత్రం హీట్ పెంచుతూనే ఉన్నారు.. అయితే, ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా.. ఇవాళ తిరుమలలో మీడియాతో మాట్లాడిన ఆమె.. ముందస్తూ…
రాజ్యాధికారం దిశగా కాపు సామాజికవర్గం యాక్టివ్ కావడం టీడీపీలో గుబులు రేపుతోందా? వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలంటే కాపుల ఓట్లే కీలకమని లెక్కలేసుకుంటున్న తరుణంలో.. కొత్త పరిణామాలు టీడీపీని కలవర పెడుతున్నాయా? విపక్ష పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి? బీసీల తిరిగి దగ్గరయ్యారనే అంచనాల్లో టీడీపీఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు దాటింది. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని.. క్షేత్రస్థాయిలో తమ పార్టీకి అనుకూల వాతావరణం ఉందని లెక్కలేస్తోంది టీడీపీ. గత ఎన్నికల్లో టీడీపీ ఓటమికి బీసీ,…
సంక్రాంతికి ముందే కోనసీమలో రాజకీయ పందెంకోళ్లు సెగ పుట్టిస్తున్నాయా? రోడ్డు పనులపై రచ్చ రంబోలా అవుతోందా? వైసీపీ, టీడీపీ నేతల సవాళ్లు.. విమర్శలు.. అవినీతిలో కొత్తకోణాన్ని ఆవిష్కరిస్తున్నాయా? రాజకీయంగా వేడెక్కిస్తున్న అంశాలేంటి? తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ముఖద్వారమైన రావులపాలెం-కొత్తపేట రోడ్డు నిర్మాణ పనులు రాజకీయంగా హీటెక్కిస్తున్నాయి. పది కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం అనేక మలుపులు తిరిగి వైసీపీ, టీడీపీ మధ్య రచ్చ రచ్చ అవుతోంది. అధ్వాన్నంగా తయారైన ఈ రహదారికి మరమ్మతులు చేయాలని టీడీపీ, జనసేన, బీజేపీలు…
తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు సమావేశం నిర్వహించారు. ఓటీఎస్ వసూళ్ల పేరుతో పేదల మెడకు ఉరితాళ్లు బిగిస్తున్నారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం అంటూ ప్రకటనలతో జగన్ పైశాచిక ఆనందం పొందుతున్నారు. జూనియర్ కిమ్ మాదిరిగా జగన్ వ్యవహరిస్తున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నా పట్టించుకోవడం లేదన్నారు చంద్రబాబు. ధరల నియంత్రణలో జగన్ విఫలమయ్యారు. రాష్ట్రాన్ని జగన్ రెడ్డి అప్పుల మయం చేశారు. పుట్టే ప్రతి బిడ్డ పైనా అప్పు చేస్తున్నారు. ఉపాధి హామీ…
ఇటీవల ఏపీలో కురిసిన భారీ వర్షాలకు పలు జిల్లాలో వరదలు సంభవించాయి. వాగులు, వంకలు పొంగిపొర్లి గ్రామాల్లోకి వరద నీరు చేరడంతో తీవ్ర పంట, ఆస్తి నష్టం చోటు చేసుకుంది. వర్షాలతో అన్నమయ్య ప్రాజెక్ట్కు భారీగా వరద నీరు చేరడంతో అన్నమయ్య జలాశయం కొట్టుకుపోయింది. దీంతో అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకుపోవడం మానవ తప్పిదం అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపణలు చేశారు. చంద్రబాబు మాటలకు కౌంటర్గా మంత్రి అనిల్ మాట్లాడుతూ.. అన్నమయ్య ప్రాజెక్ట్ కెపాసిటీ 2లక్షల 17…
టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై ఎవరూ అనుచిత వ్యాఖ్యలు చేయలేదని బొత్స స్పష్టం చేశారు. లేనిది ఉన్నట్లుగా చంద్రబాబు క్రియేట్ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఆడపడచుల ఆత్మగౌరవం పేరుతో టీడీపీ డ్రామాలు ఆడుతోందని బొత్స ఆరోపించారు. మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచే సంస్కృతి టీడీపీ నేతలకే ఉందన్నారు. ఆనాడు వైసీపీ ఎమ్మెల్యే రోజా కన్నీరు పెట్టినప్పుడు చంద్రబాబుకు ఆత్మగౌరవం గుర్తుకురాలేదా అని బొత్స ప్రశ్నించారు. Read…
ఏపీలో ఇటీవల నెల్లూరు కార్పొరేషన్తో పాటు 12 నగరపంచాయతీ, గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. కొన్ని స్థానాల్లో వైసీపీ దూసుకుపోగా, మరొకొన్ని స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు సత్తాచాటారు. అయితే తాజాగా కొండపల్లి మున్సిపాలిటీకి చైర్మన్, వైస్ చైర్మన్లను ఎన్నుకోనున్నారు. ఈ నేపథ్యంలో కొండపల్లి మున్సిపాలిటీ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొండపల్లి మున్సిపాలటీలో 29 స్థానాలు ఉండగా అందులో 14 స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు గెలువగా, మరో 14 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. వీరితో…
ఏపీలో స్థానిక ఎన్నికల సందడి ముగిసింది. ఇక మునిసిపల్ ఛైర్ పర్సన్ల ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. కొండపల్లి ఛైర్ పర్సన్ ఎన్నిక రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 29 స్థానాలకు గానూ ఎన్నికలు జరిగాయి. చెరో 14 స్థానాలు దక్కించుకున్నాయి వైసీపీ, టీడీపీ. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ హవా నడిచినా టీడీపీ తన సత్తా చాటుకుంది. టీడీపీకి మద్దతిస్తూ పార్టీలో చేరారు ఇండిపెండెంటుగా గెలిచిన లక్ష్మీ. దీంతో ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. ఎక్స్ అఫీషియో ఓటు కీలకంగా మారింది. ఎక్స్…
చిత్తూరు జిల్లాలో స్థానిక ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. కుప్పం మునిసిపల్ పోలింగ్ ప్రారంభమై ప్రశాంతంగా సాగుతోంది. పోలింగ్ స్టేషన్లకు చేరుకుంటున్నారు ఓటర్లు.కుప్పం మున్సిపాలిటీకి తొలిసారిగా జరుగుతున్న ఎన్నికలు జరుగుతుండడంతో అటు అధికార, ఇటు విపక్ష పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. టీడీపీ నేతల అరెస్టులు అర్ధరాత్రి నుంచి కొనసాగుతున్నాయి. కుటుంబంలో స్థానికేతరులు తిష్టవేసి ఉన్నారని ఆరోపిస్తున్నారు టీడీపీ నేతలు. ఉదయం నుంచి రెండుసార్లు పార్టీ ముఖ్యనేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు చంద్రబాబు నాయుడు. కుప్పంలో పరిస్థితిపై ఆరా తీశారు.…