Chandrababu Naidu: ప్రభుత్వంతో పోరాడి గెలిచిన సర్పంచ్లే హీరోలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో జగన్ పాలనా తీరుపై తనదైన రీతిలో విమర్శలు చేశారు మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. ప్రభుత్వంతో పోరాడి గెలిచిన సర్పంచ్లే నిజమైన హీరోలు అన్నారు. జగన్ లాంటి సీఎంను నా జీవితంలో ఇప్పటి వరకూ చూడలేదు.గ్రామ పంచాయతీల పరిధిలో ఉండే మైనింగ్, ఇసుక క్వారీలపై పంచాయతీలదే అధికారం అన్నారు.
నరేగా నిధులు కూడా పంచాయతీలకు రావాల్సిందే. పంచాయతీలకు రావాల్సిన డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం తీసేసుకుంటే దొపిడీ అనాలా..? ఇంకేమైనా అనాలా..? రాష్ట్రానికి రావాల్సిన డబ్బులను కేంద్రం తీసేసకుంటే రాష్ట్ర ప్రభుత్వం అంగీకరిస్తుందా..? ట్రస్టీగా ఉండి రాజ్యాంగం ప్రకారం పరిపాలన చేయమంటే జగన్ చేస్తున్నారా..? చెత్తపన్ను వసూలు చేసేదే లేదని పంచాయతీల్లో తీర్మానం చేయాలని సూచించారు.
Also Read
- CM Chandrababu Naidu: డేటానే కొత్త సంపద.. స్వర్ణాంధ్ర 2047 సాధనే లక్ష్యం.!
- Retirement Age Increase: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారందరికీ పదవీ విరమణ వయస్సు పెంపు.!
- Chandrababu: 'అప్పుడు మూడు రాజధానులు.. ఇప్పుడు మావిగన్'.. జగన్పై చంద్రబాబు సెటైర్లు
- CM Chandrababu: వీబీజీ రామ్జీ పథకానికి శ్రీకారం.. గ్రామాల అభివృద్ధిపై చంద్రబాబు భారీ ప్రకటనలు
నా గవర్నమెంటు నా ఇష్టం అన్నట్టుగా జగన్ వ్యవహరిస్తున్నారు.. నా పంచాయతీ నా ఇష్టం అని సర్పంచులూ చెప్పాలి. సీఎం జగనుకు రాజ్యాంగం ఎలాంటి హక్కులిచ్చిందో.. సర్పంచులకూ రాజ్యాంగం అలాంటి హక్కులే ఇచ్చింది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం.. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం.. పార్టీ సర్పంచ్లు గెలిచిన చోట టీడీపీ ప్రభుత్వం వుంటుందన్నారు చంద్రబాబు.
అంతకుముందు టీడీపీ కార్యాలయంలో సర్పంచ్ల అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సుకు కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల సర్పంచ్లు హాజరయ్యారు. ఇప్పటికే రెండు విడతలుగా సర్పంచ్ల అవగాహన సదస్సు నిర్వహించింది టీడీపీ. క్షేత్ర స్థాయిలో సమస్యలపై పోరాడాలని చంద్రబాబు సూచించారు. చెత్త పన్ను వసూలు చేయబోమంటూ గ్రామ పంచాయతీల్లో తీర్మానం చేయాలని తెలుగుదేశం సర్పంచ్లకు ఇప్పటికే సూచించారు టీడీపీ అధినేత చంద్రబాబు. స్థానిక సంస్థల విషయంలో ప్రభుత్వ తీరును తప్పు పడుతూ ఢిల్లీ స్థాయిలో పోరాటానికి ప్రణాళికలు సిద్దం చేస్తోంది టీడీపీ.
తాజావార్తలు
-
CM Chandrababu Naidu: డేటానే కొత్త సంపద.. స్వర్ణాంధ్ర 2047 సాధనే లక్ష్యం.!
-
Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
-
Telangana Police : మాజీ డీజీపీలకు షాక్.. బుల్లెట్ప్రూఫ్ కార్లు వెనక్కి.!
-
Harish Rao : జూపల్లి మాట మార్చారు.. చర్చకు రాకుండా తప్పించుకున్నారు
-
Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!