టీడీపీ హయాంలో 2వేల కోట్ల భూ స్కాం-తోపుదుర్తి సంచలనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అనంతపురం జిల్లాలో రాప్తాడు నియోజకవర్గం హాట్ టాపిక్ అవుతోంది. పరిటాల-తోపుదుర్తి మాటలతో వేడెక్కిస్తున్నారు. తాజాగా ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి టీడీపీ నేతలపై కీలక వ్యాఖ్యలు చేశారు. పరిటాల సునీత మంత్రిగా ఉన్న సమయంలో వందల కోట్ల భూఆక్రమణ చేశారు. ఇందుకు రెవెన్యూ అధికారులు సహకరించారు.. కొన్ని ఫోర్జరీ సంతకాలతో చేశారన్నారు. ఈమేరకు సంచలన విషయాలను బయటపెట్టారు.
ఎక్స్ ఆర్మీ, వంక పరంబోకు, అసైన్డ్ ల్యాండ్ భూములను చట్ట బద్ధత చేసి కాజేశారు. వీటిపై ఇటీవల ఆధారాలతో సహా సేకరించానన్నారు. అందుకే బయట పెడుతున్నాను. కురుగుంట, రాచానపల్లి, కొడిమి, ప్రసన్నాయపల్లి ప్రాంతాల్లో భూములు కాజేశారు. 2 వందల కోట్ల రూపాయల భూముల స్కామ్ జరిగింది. మేము బయట పెట్టకుంటే ఏదో ఒక రూట్లో దానిని సెట్ చేస్తారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టులకు ఎవరు వెళ్లినా స్టేలు వచ్చేస్తున్నాయి.
Also Read
ప్రజా ప్రయోజనాలు అసలు చూడటం లేదు.. కోర్టులను అలా మార్చేశారు. ఇప్పటికీ అక్రమాలకు పాల్పడుతూ కొందరు నా పేరు వాడుకుంటున్నారు. ఇలా ఎవరైనా నా పేరు చెబితే చెప్పుతో కొట్టండి.. ఆ తర్వాత నాకు కాల్ చేయండి. ఎవరినీ వదలిపెట్టద్దు.పరిటాల అనుచరులు కూడా నా పేరు వాడుకునే స్థాయికి దిగజారారు. దీనిపై కలెక్టర్ కు చేశాం, త్వరలో సీఎంకు ఫిర్యాదు చేస్తున్నాం. ప్రభుత్వ, దళితుల భూముల ఆక్రమణల గురించి త్వరలో వెల్లడిస్తాం అని ప్రకాష్ రెడ్డి తెలిపారు.
తాజావార్తలు
-
Geoffrey Boycott: సచిన్, లారాలను మించిపోయే సత్తా అతడికి ఉంది.. సంచలన వ్యాఖ్యలు..
-
Sanju Samson: ప్రపంచకప్ గెలవాలనే ఆ ఒక్క నిర్ణయం శామ్సన్ కెరీర్ను మార్చేసిందా..? అసలు ఏం జరిగిందంటే..
-
Reservation row: కేంద్ర మంత్రుల మధ్య మాటల యుద్ధం.. మంట పెట్టిన ‘‘రిజర్వేషన్’’ అంశం..
-
Haryana: ప్రముఖ రెజ్లర్ గ్రేట్ ఖలీ కారుకు ప్రమాదం.. దెబ్బతిన్న వాహనం
-
TG SAFE: ఫుడ్ లవర్స్ అలర్ట్.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న చట్నీస్, పిస్తా హౌస్ సహా ఈ 7 రెస్టారెంట్లు!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!