Perni Nani: ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యలపై పేర్ని నాని కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ప్రశాంత్ కిషోర్ అంశం హాట్ టాపిక్ అవుతోంది. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్ళ టైం వుంది. కానీ అప్పుడే వేడి మరింతగా రాజుకుంది. ఎన్నికల వ్యుహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీకి సమర్పించిన రిపోర్ట్లో.. ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధికార వైసీపీతో పొత్తుపెట్టుకోవాలని ఓ ప్రతిపాదన చేశారని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై వైసీపీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి స్పందిస్తూ.. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే పార్టీకి వైసీపీ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. సీఎం జగన్ కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారని చెప్పారు. అంటే అటు కాంగ్రెస్ తో పొత్తు వుంటుందని గానీ, వుండదు అని గానీ స్పష్టత ఇవ్వలేకపోతున్నారు.
దీనిపై మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. విజయసాయిరెడ్డి మాదిరిగానే కామెంట్లు చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని కాగితంపై రాసి ఇచ్చే ఏ పార్టీతోనైనా పొత్తుకు తాము సిద్ధమని అన్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని.. పొత్తులు అవసరం లేదని చెప్పారు. ఎన్నికల తర్వాత రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంలో ఎవరికైనా మద్దతు ఇస్తామని చెప్పారు. ఎన్నికల తర్వాత కేంద్రంలో మా ఎంపీల అవసరం అనుకునే ఏ కూటమికైనా సరే మద్దతు తెలుపుతాం. కానీ ముందుగా ఆ కూటమి ఏపీ ప్రత్యేక హోదా ఇస్తామని కాగితం మీద రాసివ్వాలన్నారు పేర్ని నాని. వైసీపీని ఎవరూ శాసించలేరని చెప్పారు. పీకే తమ పార్టీకి కన్సల్టెంట్ అని.. ఎన్నికల్లో ఆయన ఆలోచనలు వాడుకుంటామని తెలిపారు.
Also Read
- CM Chandrababu Vizag Tour: రేపు విశాఖకు సీఎం చంద్రబాబు..
- AP NDA: కూటమి భారీ ప్లాన్.. రెండేళ్ల పాలన ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యాచరణ
- NDA Meeting Andhra Pradesh: ఎన్డీఏ భేటీలో రాజ్యసభ స్థానాల పంపకం.. టీడీపీకి 3, జనసేనకు 1..?
- Pawan Kalyan: పాత వీడియో షేర్ చేసిన పవన్ కల్యాణ్.. తెలంగాణపై నా వైఖరి ఇదే..!
అంతకుముందు మంత్రి గుడివాడ అమర్నాథ్.. కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసేందుకు పుట్టిందే వైసీపీ అన్నారు. వ్యూహకర్తలు సలహాలు ఇస్తారు.. కానీ అమలు చేయాలో లేదో నిర్ణయం తీసుకోవాల్సింది మాత్రం జగనే అన్నారు. సోనియాని ఎదిరించి బయటకి వచ్చిన జగన్ అదే కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటారా అని హేళన చేశారు.
Read Also: TSRTC : ఆర్టీసీ కీలక నిర్ణయం.. ఉద్యోగులకు తీపి కబురు..
తాజావార్తలు
-
RCB Player: అభిమానులకు బిగ్షాక్.. రిటైర్మెంట్ ప్రకటించిన కీలక ప్లేయర్..
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
CM Chandrababu Vizag Tour: రేపు విశాఖకు సీఎం చంద్రబాబు..
-
MS Dhoni: ఇన్వెస్టర్లకు అదిరే న్యూస్.. ధోని మద్దతిస్తున్న కంపెనీ ఐపీఓకు రెడీ.. రూ.1500 కోట్లే లక్ష్యంగా..
-
Delimitation Bill: మళ్లీ తెరపైకి డీలిమిటేషన్ బిల్లు.. 2029 ఎన్నికలే లక్ష్యంగా కేంద్రం కసరత్తు?
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!