Land Dispute : గుంటూరులో భూవివాదానికి రాజకీయరంగు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గుంటూరు జిల్లాలో ఓ భూవివాదం ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది. తాడేపల్లిలోని ఓ ప్రాంతంలో తమ భూమిలో నాగి రెడ్డి అనే వ్యక్తి దౌర్జన్యంగా ఆక్రమించే ప్రయత్నం చేశాడని , తమ పై దాడి చేశాడని కోటేశ్వరావు అనే వ్యక్తి ఆరోపించాడు. ఈ నేపథ్యంలోనే నాగిరెడ్డి అనే వ్యక్తిపై అతనికి మద్దతు ఇస్తున్న వారిపై కోటేశ్వరరావు రాజకీయంగా ఆరోపణలు చేయడంతో ఇప్పుడు వివాదం రాజకీయ రంగు పులుముకుంది.
గుంటూరు జిల్లా తాడేపల్లి లోని పొలకం పాడులో ఓ భూ వివాదం టీడీపీ వర్సెస్ వైసీపీ పార్టీల పోరుగా మారుతోంది. తాడేపల్లి ప్రాంతానికి చెందిన కోటేశ్వర రావు, శ్రీనివాస రావు అన్నదమ్ములు. తండ్రి నుంచి వారసత్వంగా సంక్రమించిన ఆస్తి ఏడు సెంట్ల స్థలంలో అన్నదమ్ములు ఇద్దరికీ వాటా ఉంది. అయితే ఇందులో శ్రీనివాస్ రావ్ అనే వ్యక్తి నాగిరెడ్డి అనే వ్యక్తికి స్థలం అమ్మేశాడనీ మిగిలిన భాగం కోటేశ్వర రావు పేరుతో ఉంది. అయితే తమ్ముడు శ్రీనివాసరావును భూమి అమ్మడానికి వీలు లేదని అన్న కోటేశ్వరరావు చెప్పడంతో కోటేశ్వరరావు, శ్రీనివాసరావు కుటుంబాల మధ్య గత కొంత కాలంగా వివాదం నడుస్తోంది.
Also Read
- OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
- OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
- OTR: గూడూరు వైసీపీలో ఇంచార్జ్ మార్పు చిచ్చు.. నేతలను బుజ్జగించేందుకు మిథున్ రెడ్డి ఎంట్రీ
- Amaravati Land Pooling: అమరావతిలో మరో విడత ల్యాండ్ పూలింగ్.. 1,654 ఎకరాల భూమి సమీకరణకు నోటిఫికేషన్..
ఈ వివాదాల నేపథ్యంలో నాగి రెడ్డి అనే వ్యక్తి తమ ఇంటిపై దౌర్జన్యానికి వచ్చాడని, దాడి చేసి మమ్మల్ని కొట్టాడని కోటేశ్వర రావు ,అతని కుటుంబం ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా వైరల్ కావడం… ఆ తర్వాత కోటేశ్వరరావు టిడిపి నాయకులతో కలిసి ప్రెస్ మీట్ పెట్టడం జరిగిపోయాయి. భూ యజమాని కోటేశ్వరరావు చేసిన ఆరోపణల పై స్పందించిన స్థానిక ఎమ్మెల్యే ఆర్కే ఘటన స్థలానికి చేరుకుని అక్కడ స్థానికులతో మాట్లాడారు.
విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి జరిగిన విషయం పై మీడియాకి వివరణ ఇచ్చారు. నాగిరెడ్డి కొనుక్కున్న భూమి లోకి వెళ్లేందుకు వస్తుంటే కోటేశ్వరరావు అడ్డుకునే ప్రయత్నం చేశాడని, పైగా ఈ చిన్న భూ వివాదాన్ని పార్టీల వివాదంగా మార్చి లబ్ధి పొందాలని కోటేశ్వరరావు అతని కుటుంబం చూస్తున్నారని ఎమ్మెల్యే ఆర్కే ఆరోపిస్తున్నారు. మొత్తంగా అన్నదమ్ముల కుటుంబాల మధ్య ఓ చిన్న వివాదం చిలికి చిలికి గాలివానలా మారి ఇప్పుడు రెండు రాజకీయ పార్టీలకు వివాద వేదికగా మారింది. దీనిపై పోలీసులతో దర్యాప్తు చేయించి అసలు కారణాలు బయట పెడతానని అంటున్నారు ఎమ్మెల్యే ఆర్కే.
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!