వైసీపీపై టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయన్నారు సోమిరెడ్డి. టీడీపీ నేతలు.. కొందరు అధికారుల ఫోన్లను వైసీపీ ట్యాప్ చేస్తుందని మా అనుమానం. ప్రభుత్వ పరంగా కాకుండా.. వైసీపీ పార్టీ పరంగా ఓ సాఫ్ట్ వేర్ ద్వారా ట్యాపింగుకు పాల్పడుతున్నారని మేం నమ్ముతున్నాం. దీనిపై గతంలోనే మా అనుమానాలు వ్యక్తం చేశాం.
పెగాసెస్ స్పై వేర్ చంద్రబాబు కొనుగోలు చేశారన్నది ఓ పెద్ద బ్లండర్. దేశాల మధ్య రహాస్యాలు తెలుసుకునేందుకు ఈ సాఫ్ట్ వేర్ రూపొందించారు. రాష్ట్ర ప్రభుత్వాలు పెగాసెస్ స్పై వేర్ కొనుగోలు చేసే అవకాశమే లేదు. ఏపీ ప్రభుత్వం పెగాసెస్ స్పై వేర్ కొనుగోలు చేయలేదని మాజీ డీజీపీనే సమాధానమిచ్చారు. మమతా బెనర్జీకి ఈ పెగాసెస్ స్పైవేర్ మీద అవగాహన లేకుండా ఉండొచ్చు. పీకేలు.. కేకేలు వంటి వారు మమతా బెనర్జీతో చెప్పించి ఉంటారని భావిస్తున్నాం.
పెగాసెస్ స్పై వేర్ నాటి ప్రభుత్వం కొనుగోలు చేసి ఉంటే వివేకా హత్య జరిగి ఉండేదే కాదు. కేంద్ర ప్రభుత్వాల అనుమతి లేకుండా ఈ స్పై వేర్ ను కొనుగోలు చేసే అవకాశం లేదు. మోడీ ప్రభుత్వం మీద ఈ ఆరోపణలు ఉన్నాయి.. దీనిపై సుప్రీం కోర్టు ఎంక్వైరీ కమిషన్ వేసింది.విచారణలో వాస్తవాలు నిగ్గు తేలుతాయి. పెగాసెస్ స్పై వేర్ కొనుగోలు చేసే ఇల్లీగల్ యాక్టీవేట్సుని చంద్రబాబు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయరు.
చంద్రబాబును.. లోకేష్ను పీకే తన వ్యూహాలతో తీవ్రంగా డామేజ్ చేసి ఎడ్వాంటేజ్ తీసుకున్నారు. కోడికత్తి, వివేకా హత్య విషయంలో టీడీపీపై ఆరోపణలు వంటివి పీకే వ్యూహాలే. పశ్చిమ బెంగాల్లో మమత కాలుకు కట్టు కట్టించి రాజకీయం చేసింది పీకేనే. మమతకు.. జగనుకు పీకేనే స్ట్రాటజీలు రూపొందిస్తున్నారు. పెగాసెస్ స్పై వేర్ ను చంద్రబాబు కొనుగోలు చేశారని మమత బెనర్జీకి పీకేనే తప్పుడు సమాచారం అందించారని నమ్ముతున్నాం అన్నారు సోమిరెడ్డి.