Home
Ys Jagan
Ys Jagan News
-
Mudragada Padmanabham: ముద్రగడ పాడె మోసిన వైఎస్ జగన్.. అంత్యక్రియల్లో ఉద్రిక్తత
Mudragada Padmanabham: మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు కిర్లంపూడిలో కుటుంబ సభ్యులు, అభిమానులు, రాజకీయ నాయకుల సమక్షంలో ముగిశాయి. అయితే, అంత్యక్రియల సమయంలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది.. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు పోలీసులకు ముందుకు రాగా.. అధికారిక లాంఛనాలు అవసరం లేదంటూ ముద్రగడ అనుచరులు పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు, జక్కంపూడి గణేష్ పోలీసులను అడ్డుకుని… -
YS Jagan: ఆక్వా రైతుల కష్టాలు నాకు తెలుసు.. సిండికేట్ను కూకటివేళ్లతో పెకలిస్తా!
భీమవరంలో ఆక్వా రైతులతో మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆక్వా రంగం ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రైతులు భారీ నష్టాలు చవిచూస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో సుమారు ఐదు లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న ఆక్వా రంగాన్ని ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని జగన్ విమర్శించారు. ‘ఆక్వా రైతులు ఉపయోగించే… -
OTR: సింగనమల వైసీపీలో సెగలు..
OTR: పెద్దలు సర్దుకుపొమ్మన్నంత తేలిగ్గా… కింది స్థాయిలో అడ్జెస్ట్ అవలేకపోతున్నారా? పార్టీలోకి కొత్తగా వచ్చిన సీనియర్ లీడర్తో అక్కడి వైసీపీ కేడర్ కలవలేకపోతోందా? మాజీ మంత్రి కూడా అయిన సదరు సీనియర్ బయటి వ్యవహారాలు చక్కబెడుతున్నా ఇంటిని దిద్దుకోలేకపోతున్నారా? రెండు వర్గాలు ఉత్తర దక్షిణ ధృవాలుగా ఉన్న ఆ నియోజకవర్గం ఏది? కలవలేకపోవడానికి కారణాలేంటి? రాజకీయాల్లో నేతలు కండువాలు మార్చినంత తేలిగ్గా.. క్షేత్ర స్థాయి కేడర్ మారిపోదు. అందుకు కార్యకర్తల మనస్సాక్షి అంగీకరించదు కూడా. వారిలో బలమైన… -
OTR: తాడేపల్లిగూడెం వైసీపీలో ముదిరిన వర్గపోరు..
OTR: తాడేపల్లిగూడెం వైసీపీలో జూనియర్ వర్సెస్ సీనియర్ అన్నట్టుగా మారిపోయిందట వాతావరణం. మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, నియోజకవర్గ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురాం మధ్య విభేదాలు తారాస్థాయికి చేరినట్టు చెబుతున్నారు పార్టీ నాయకులు. ఇటీవల జరిగిన వైఎస్ఆర్ జయంతి కార్యక్రమం సాక్షిగా రెండు వర్గాలు బహిరంగ సవాళ్లకు దిగడం చర్చనీయాంశమైంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో డిప్యూటీ సీఎంతో పాటు దేవాదాయ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు కొట్టు సత్యనారాయణ. 2024లో ఓటమి తర్వాత అధినేత ఆయన్ని… -
YS Jagan: ముద్రగడకు జగన్ భావోద్వేగ నివాళి.. ‘పితృసమాన నేతను కోల్పోయాం’
YS Jagan: మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మరణంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా స్పందించిన జగన్, ముద్రగడ తనకు పితృసమానులని పేర్కొంటూ ఆయన మరణవార్త తనను తీవ్రంగా కలచివేసిందని అన్నారు. ఇటీవల అనారోగ్యానికి గురైన ముద్రగడ ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోందన్న సమాచారం తమకు ఆశ కలిగించిందని, సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజల మధ్యకు వస్తారని భావించిన… -
YS Jagan: మత్స్యకారుల కుటుంబాలకు వైఎస్ జగన్ పరామర్శ!
బోటు ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పరామర్శించారు. జబ్బర్ తోటలో ఆరుగురు మత్స్యకారుల నివాసాలకు వెళ్లి బాధిత కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. బోటు ప్రమాదంలో సురక్షితంగా బయటపడ్డ బోటు డ్రైవర్ కారె చిన్నాను కలిసిన జగన్.. ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. జగన్ వెంట బొత్స సత్యనారాయణ, ఉత్తరాంధ్ర నాయకులు ఉన్నారు. అంతకుముందు విశాఖకు వచ్చిన వైఎస్ జగన్కు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. మార్గ మధ్యంలో… -
YSR 77th Birth Anniversary: మీరే నా స్ఫూర్తి.. మీ ఆశీస్సులే నా ధైర్యం’.. వైఎస్ జగన్ ఎమోషనల్ ట్వీట్ వైరల్..
YSR 77th Birth Anniversary: దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 77వ జయంతి సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భావోద్వేగంగా స్పందించారు. తన తండ్రిని స్మరించుకుంటూ సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో చేసిన పోస్టు పార్టీ శ్రేణులను, అభిమానులను ఆకట్టుకుంది. వైఎస్సార్ జయంతి సందర్భంగా వైఎస్ జగన్ తన ఎక్స్ ఖాతాలో భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు. “మీరే నా స్ఫూర్తి.. మీ ఆశీస్సులే నా ధైర్యం” అంటూ తండ్రి వైఎస్… -
YS Jagan : హే రామ్.. సేవ్ ఆంధ్రప్రదేశ్.. కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు
YS Jagan : ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం , ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా ఘాటు విమర్శలు చేశారు. రాష్ట్రంలో పోలీసు యంత్రాంగం అత్యంత ప్రమాదకరమైన ధోరణిలో నడుస్తోందని ఆరోపిస్తూ.. “హే రామ్.. సేవ్ ఆంధ్రప్రదేశ్” అంటూ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఒక సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. చంద్రబాబు పాలనలో ప్రతిచోటా విషపు విత్తనాలు నాటారని, ఇది రాజ్యాంగ హక్కులపై , ప్రజాస్వామ్య… -
OTR : ఉమ్మడి గుంటూరులో రీఛార్జ్ అవని వైసీపీ లీడర్స్
వైసీపీ అధ్యక్షుడు జగన్ వేవ్లెంగ్త్కు ఆ ఉమ్మడి జిల్లా నేతలు సింక్ అవలేకపోతున్నారా? ఆయన సీరియస్గా చెప్పిన మాటలు కూడా వాళ్ళ బుర్రలకు ఎక్కడం లేదా? ఎలాగైనా యాక్టివ్ చేద్దామని ఆయన ప్రయత్నిస్తుంటే… వాళ్ళు మాత్రం ససేమిరా అంటున్నారా? పార్టీ వరుస కార్యక్రమాలకు పిలుపునిస్తున్నా… అధినేత వార్నింగ్ ఇస్తున్నా… మాకు కాదులే అన్నట్టుగా ఉన్న ఆ నాయకులు ఎవరు? ఏ జిల్లాలో ఉందా పరిస్థితి? ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైసీపీ నాయకులు చాలా మంది వ్యవహారశైలి పార్టీ… -
Chandrababu: ‘అప్పుడు మూడు రాజధానులు.. ఇప్పుడు మావిగన్’.. జగన్పై చంద్రబాబు సెటైర్లు
Chandrababu: తిరుపతి జిల్లా ముక్కాపారిపల్లెలో నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి, అమరావతి నిర్మాణం, కూటమి ప్రభుత్వ లక్ష్యాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించిన ఆయన, ఎన్నికలకు ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత మరో మాట చెప్పడం వారి రాజకీయ విధానంగా మారిందన్నారు. గతంలో మూడు రాజధానుల పేరుతో ప్రజలను గందరగోళానికి గురిచేశారని విమర్శించిన చంద్రబాబు, ఇప్పుడు “మావిగన్” అంటూ కొత్త నినాదం…
తాజావార్తలు
-
Story Board : స్వతంత్ర భారత ప్రస్థానం ఎలా ఉంది..? ఇన్నేళ్లలో మనం ఏం సాధించాం..?
-
CM Revanth Reddy : ఉత్తర తెలంగాణకు సీఎం రేవంత్ వరాలు.. రూ.16 వేల కోట్ల పనులకు శ్రీకారం..
-
OTR: కోదండరాంకు యువత సెగ..! నాడు నమ్మినవాళ్లే ఇప్పుడు నిలదీస్తున్నారా..?
-
Nitin Nabin: నితిన్ నబీన్ ఏపీ పర్యటన ఖరారు.. ఆగస్టు 17 నుంచి 21 వరకు..
-
OTR: బీఆర్ఎస్కు కాంగ్రెస్ బిగ్ కౌంటర్..! 10 ఏళ్ల భూ కేటాయింపుల చిట్టా..!
ట్రెండింగ్
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్రేంజ్లో బెస్ట్ స్మార్ట్ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!