YS Jagan: రెండేళ్లలో చంద్రబాబు రూ. 3 లక్షల కోట్ల అప్పు చేశారు..
- సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అబద్దాలని తేలిపోయింది..
- రెండేళ్లలో ప్రజలకు ఈ ప్రభుత్వం ఒక్క మంచైనా చేసిందా..
- రెండేళ్లలో చంద్రబాబు రూ. 3 లక్షల కోట్ల అప్పు చేశారు: వైఎస్ జగన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: సీఎం చంద్రబాబుపై వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు అవుతోంది.. ఈ కాలంలో ప్రజలకు ఒక్క మంచి పని కూడా జరగలేదని ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికే మూడు బడ్జెట్లు ప్రవేశ పెట్టింది.. అయినా ప్రజల జీవన పరిస్థితుల్లో ఎలాంటి మెరుగుదల లేదన్నారు. గతంలో తమ ప్రభుత్వం మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావించి, ఇచ్చిన ప్రతి హామీని నిబద్ధతతో అమలు చేశామన్నారు. కోవిడ్ లాంటి తీవ్ర సంక్షోభ పరిస్థితుల్లో కూడా సంక్షేమ పథకాలను ప్రజలకు అందించామని వైఎస్ జగన్ గుర్తు చేశారు.
Read Also: Ajit Pawar Plane crash: సమస్యను ముందే గుర్తించిన పైలట్.. మూడోసారి ల్యాండింగ్ చేస్తుండగా..!
Also Read
- Rama Nandana: లగ్జరీ లైఫ్స్టైల్ వెనుక "గలీజ్ దందా".. యూట్యూబర్ రమానందన, మధుకర్కు లుకౌట్ నోటీసులు!
- East Godavari Thief: తూర్పుగోదావరి జిల్లాలో ఘరానా దొంగ అరెస్ట్.. జూదం కోసం వరుస చోరీలు.. బెయిల్పై బయటకు వచ్చి!
- CM Chandrababu: ఏయూ వీసీ రాజశేఖర్పై సీఎం చంద్రబాబు ఫైర్!
- Kolar Tragedy: గుండెల్ని పిండేసే ఘటన.. ఇద్దరు పసిబిడ్డల ప్రాణాలు తీసిన కన్నతల్లి.. చివరకు..!
అయితే, చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత తమ ప్రభుత్వ హయాంలో అమలైన అన్ని పథకాలు రద్దు చేశారని మాజీ సీఎం జగన్ విమర్శించారు. ‘సూపర్ సిక్స్, సూపర్ సెవెన్’ పేరుతో చంద్రబాబు చెప్పిన హామీలు అబద్ధాలని తేలిపోయాయి.. వైసీపీ ఐదేళ్ల పాలనలో.. కోవిడ్ ఉన్నా కేవలం రూ.3.32 లక్షల కోట్ల అప్పులు మాత్రమే చేశాం.. అందులో రూ.2.73 లక్షల కోట్లను నేరుగా ప్రజల ఖాతాల్లో జమ చేశామని చెప్పారు. బ్యాంకు ఖాతాలు, ఆధార్ కార్డుల ఆధారంగా డబ్బులు ఎవరికెక్కడికి వెళ్లాయో చూపిస్తామన్నారు. కానీ, చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్లు తిరక్కముందే రూ.3 లక్షల కోట్ల అప్పులు చేసిందని ఆరోపించారు. ఆ డబ్బు ఎక్కడికి వెళ్లిందో చెప్పాలని జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు.
Read Also: MLA Arava Sridhar: ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై వచ్చిన ఆరోపణలపై విచారణకు కమిటీ..
ఇక, మద్యం షాపులన్నీ చంద్రబాబు అనుచరుల చేతుల్లోనే ఉన్నాయని వైసీపీ అధినేత జగన్ పేర్కొన్నారు. బెల్ట్ షాపుల ద్వారా ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారని ఆరోపించారు. తమ ప్రభుత్వ హయాంలో ఇసుక ద్వారా ప్రభుత్వానికి రూ.750 కోట్ల ఆదాయం వచ్చేది, ఇప్పుడు ఇసుక డబుల్ రేట్లకు అమ్ముతున్నా ప్రభుత్వానికి ఆదాయం రావడం లేదన్నారు. అలాగే, రాష్ట్రం పూర్తిగా ‘జంగిల్ రాజ్’గా మారిపోయింది. సంక్రాంతి సమయంలో కోడిపందాలు, రికార్డింగ్ డ్యాన్సులు, బహిరంగ మద్యం సేవలు జరగడం చూస్తే ప్రభుత్వం ఉందా లేదా అన్న సందేహం కలుగుతోందని మాజీ సీఎం జగన్ అన్నారు.
అలాగే, పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు మహిళలపై వేధింపులు, దాడులు, బెదిరింపుల ఆరోపణలు ఉన్నాయని వైఎస్ జగన్ గుర్తు చేశారు. అయినా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదన్నారు. చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రజలు ఈసారి ‘ఫుట్బాల్ తన్నినట్లు తంతారు’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను ఒకటిన్నర సంవత్సరం పాటు 150 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేసి ప్రజల మధ్య ఉంటానని ప్రకటించా.. వైఎస్సార్సీపీ క్యాడర్ బలంగా ఉంది.. గ్రామస్థాయి కమిటీలు మరింత పటిష్టంగా నిర్మించాల్సిన అవసరం ఉందని జగన్ స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Gautam Gambhir: టెస్టుల్లో నంబర్-3పై కోచ్ గంభీర్ క్లారిటీ.. రిషభ్ పంత్పై కీలక వ్యాఖ్యలు!
-
Jhanvi Kapoor : ఇన్స్టాగ్రామ్లో పెద్ది నెగిటివ్ రివ్యూ పోస్ట్ను లైక్ చేసిన జాన్వీ.. ఫీలైనట్టుంది?
-
Rama Nandana: లగ్జరీ లైఫ్స్టైల్ వెనుక “గలీజ్ దందా”.. యూట్యూబర్ రమానందన, మధుకర్కు లుకౌట్ నోటీసులు!
-
OnePlus Community Sale 2026: వన్ప్లస్ కమ్యూనిటీ సేల్ ప్రారంభం.. ఫ్లాగ్షిప్ ఫోన్లు, ట్యాబ్లెట్లపై భారీ డిస్కౌంట్లు
-
KS Bharat Retirement: ఇట్స్ అఫీషియల్.. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన తెలుగు క్రికెటర్
ట్రెండింగ్
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!