Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Ys Jagan Questioned Cm Chandrababu On Land Resurvey Press Meet Highlights Are

YS Jagan: భూముల రీ సర్వేలో నిజాలను తొక్కిపెట్టలేరు..!

Published Date :January 22, 2026 , 12:56 pm
By Kothuru Ram Kumar
  • భూముల రీ సర్వేపై సీఎం చంద్రబాబు నాయుడిపై వైఎస్ జగన్ ఘాటు విమర్శలు..
  • రీ సర్వే క్రెడిట్‌ను చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటున్నారని..
  • వైసీపీ హయాంలో ఇచ్చిన భూ పాసు పుస్తకాలే కొనసాగుతున్నాయి
  • యూనిక్ నెంబర్, QR కోడ్ అదే ఉంచి రంగు మాత్రమే మార్చారు
  • కొత్త పాస్ పుస్తకాలలో అనేక తప్పులు ఉన్నాయని..
  • పాత సర్వే రాళ్లపై పేర్లు చెరిపేందుకు కోట్ల ఖర్చు చేస్తున్నారు.
YS Jagan: భూముల రీ సర్వేలో నిజాలను తొక్కిపెట్టలేరు..!
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

YS Jagan: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై ఘాటు విమర్శలు చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన భూముల రీ సర్వేకు సంబంధించిన క్రెడిట్‌ను చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటున్నారని మండిపడ్డారు. 80 ఏళ్ల వయసున్న చంద్రబాబు తన రాజకీయ జీవితంలో ఎప్పుడైనా ఇలాంటి సమగ్ర భూ సర్వే చేశారా?అంటూ ప్రశ్నించారు.

భూముల రీ సర్వే కోసం హెలికాప్టర్లు, డ్రోన్లు వినియోగించామని.. అత్యాధునిక టెక్నాలజీపై అవగాహన కల్పించేందుకు 40 వేల మందికి శిక్షణ ఇచ్చామని జగన్ తెలిపారు. కోట్ల సంఖ్యలో సర్వే రాళ్లను గ్రామాలకు తరలించి కేవలం 5 cm తేడా కూడా లేకుండా కొలతలు వేశామని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా భూవివాదాల పరిష్కారం కోసం 1,358 మండల మొబైల్ మెజిస్ట్రేట్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

Also Read

  • Pratyusha Paul : చార్మినార్ సాక్షిగా బెంగాల్ నటికి వేధింపులు: నిందితుడికి ‘చిప్పకూడు’!
  • DMK-Congress: ‘‘కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచింది’’.. డీఎంకే తీవ్ర ఆగ్రహం..
  • AP Govt: ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.2 లక్షల కోట్లకు ఎస్ఐపీబీ ఆమోదం.. 39 వేల మందికి ఉద్యోగ అవకాశాలు..
  • Tamil Nadu: విజయ్‌‌కు గవర్నర్ బిగ్ షాక్!.. లోక్‌భవన్ కీలక ప్రకటన.. ఇప్పట్లో ప్రమాణస్వీకారం లేనట్లేనా?
Add as a preferred
source on google

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్ స్టీల్ ప్లాంట్‌లో భారీ పేలుడు.. ఏడుగురు సజీవదహనం

భూసర్వే కోసం కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నామని, 2020 డిసెంబర్ 9న సర్వే ఆఫ్ ఇండియాతో అధికారిక ఒప్పందం చేసుకున్నామని జగన్ గుర్తుచేశారు. భూ సర్వే ప్రక్రియలో 3,640 GNSS పరికరాలు వినియోగించామని తెలిపారు. భూముల రీ సర్వేను నీతి ఆయోగ్ ప్రశంసించిందని.. కేరళ, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర రాష్ట్రాల అధికారులు ఈ సర్వే విధానాన్ని అధ్యయనం చేసి మెచ్చుకున్నారని వెల్లడించారు. అప్పటి సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ కూడా ఈ ప్రక్రియను ప్రశంసించారని తెలిపారు. అసోం రాష్ట్రం సైతం తమ ప్రభుత్వ సహకారం కోరిందన్నారు.

ఎన్నికల సమయంలో IVRS కాల్స్ ద్వారా రైతులను భయపెట్టారని, మీ భూములు మీకు దక్కవని దుష్ప్రచారం చేశారని జగన్ ఆరోపించారు. భూముల రీ సర్వేపై చంద్రబాబు ఎందుకు యూటర్న్ తీసుకున్నారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వ చర్యల వల్లే కేంద్రం నుంచి రూ. 400 కోట్ల రాయితీ వచ్చిందని, భూముల రీ సర్వేకు రూ. 6 వేల కోట్లకు పైగా ఖర్చు చేశామని తెలిపారు. ఈ రీ సర్వేకు ఏపీకి కేంద్రం నుంచి “ప్లాటినమ్ గ్రేడ్” దక్కిందని పేర్కొన్నారు.

YS Jagan: భూసర్వేను మహాయజ్ఞంలా చేపట్టాం.. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేశాం..!

వైసీపీ హయాంలో ఇచ్చిన భూ పాసు పుస్తకాలనే ఇప్పటికీ కొనసాగిస్తున్నారని జగన్ అన్నారు. యూనిక్ నెంబర్, క్యూఆర్ కోడ్ అన్నీ అదే ఉంచి, కేవలం పాస్ పుస్తకాల రంగు మాత్రమే మార్చి ఇస్తున్నారని విమర్శించారు. సీఎం చంద్రబాబు కొత్తగా చేసింది ఏమీ లేదని.. రంగులు మార్చడం తప్ప అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఇస్తున్న పాస్ పుస్తకాల్లో అనేక తప్పులు దొర్లుతున్నాయని, వైసీపీ హయాంలో పాతిన కొలత రాళ్లపై ఉన్న పేర్లను చెరిపేయడానికి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని అన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • AP politics news
  • chandrababu
  • Land Resurvey
  • land survey

తాజావార్తలు

  • Ragi Burfi Recipe: ఎముకలకు బలం.. రక్తహీనతకు చెక్.. వంటరాని వాళ్లు కూడా ఈజీగా చేసుకునే హెల్తీ స్వీట్!

  • Pratyusha Paul : చార్మినార్ సాక్షిగా బెంగాల్ నటికి వేధింపులు: నిందితుడికి ‘చిప్పకూడు’!

  • DMK-Congress: ‘‘కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచింది’’.. డీఎంకే తీవ్ర ఆగ్రహం..

  • Peddi : థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి!

  • CM Revanth Reddy: సీఎం సీరియస్.. నా కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపొద్దు.. డీజీపీకి కీలక ఆదేశాలు!

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions