YS Jagan: భూసర్వేను మహాయజ్ఞంలా చేపట్టాం.. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేశాం..!
- వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రెస్ మీట్
- భూముల రీ సర్వేపై చంద్రబాబు క్రెడిట్ చోరీ చేస్తున్నారని ఆరోపణ
- “ఇంత దారుణమైన క్రెడిట్ చోరీ ఈ భూమండలంపై ఎవరూ చేయలేరు” అంటూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా నిర్వహించిన ప్రెస్ మీట్లో ప్రజా సమస్యలు, తాజా రాజకీయ పరిణామాలపై వ్యాఖ్యానించారు. ముఖ్యంగా భూముల రీ సర్వే అంశంలో సీఎం చంద్రబాబు నాయుడు క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. ఈ భూమండలంపై ఇంత దారుణమైన క్రెడిట్ చోరీ చేయగలవారు ఎవరూ ఉండరు అంటూ జగన్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
Also Read
- Tamil Nadu Politics: విజయ్ ప్రభుత్వంపై కుట్ర కేసులో షాకింగ్ నిజాలు.. రూ.180 కోట్లతో స్కెచ్..!
- Astrology: జూలై 4 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి ఊహించని గుడ్ న్యూస్..
- TMC: హెడ్ క్వార్టర్స్ కోల్పోయిన మమతా బెనర్జీ.. తృణమూల్ సంక్షోభం తీవ్రం..
- Khamenei: ఖమేనీ అంత్యక్రియల్లో హృదయ విదారక దృశ్యం.. 14 నెలల మనవరాలి పార్థివదేహం
భూముల రీ సర్వే చేయాలన్న కనీస ఆలోచనైనా చంద్రబాబుకు ఎప్పుడైనా వచ్చిందా అని జగన్ ప్రశ్నించారు. రైతుల సమస్యలు తీర్చాలన్న చిత్తశుద్ధి బాబుకు లేదని వ్యాఖ్యానించారు. రైతులు ఎదుర్కొంటున్న భూ వివాదాలకు ఏకైక పరిష్కారం సమగ్ర భూ రీ సర్వేనేనని స్పష్టం చేశారు. 2019కు ముందు భూములు సర్వే చేయడానికి అవసరమైన ఆధునిక టెక్నాలజీనే లేదని, తన పాదయాత్ర సమయంలోనే భూముల రీ సర్వే చేయాలన్న నిర్ణయం తీసుకున్నానని జగన్ అన్నారు.
2019 ఎన్నికల మేనిఫెస్టోలో అధికారంలోకి వస్తే సమగ్ర భూ సర్వే చేపడతామని హామీ ఇచ్చామని, ఆ మాటకు కట్టుబడి పారదర్శకంగా భూముల రీ సర్వే నిర్వహించామని జగన్ అన్నారు. రైతులకు, భూ యజమానులకు వివాదాలు లేకుండా, ట్యాంపరింగ్కు అవకాశం లేని విధంగా శాశ్వత భూ పత్రాలు అందించామని తెలిపారు. భూ సర్వేను ఒక మహాయజ్ఞంలా చేపట్టినట్లు తెలిపారు. బ్రిటిషర్ల కాలంలో దాదాపు వందేళ్ల క్రితం జరిగిన భూ సర్వే తర్వాత మళ్లీ 2020 డిసెంబర్ 21న భూముల రీ సర్వే ప్రారంభించామని జగన్ గుర్తుచేశారు.
Peddi : రామ్ చరణ్ ‘పెద్ది’ ఫస్టాఫ్ లాక్.. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ వర్క్ స్టార్ట్ చేసిన రెహమాన్
నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు ఏనాడైనా ఇలాంటి సమగ్ర భూ సర్వే చేశారా? అని ప్రశ్నించారు. క్రయవిక్రయాలు జరిగినా, కుటుంబాల మధ్య భూ పంపకాలు జరిగినా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా వ్యవస్థను రూపొందించామని అన్నారు. అలాగే రాష్ట్రంలో 15 వేల గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయడం దేశంలోనే ఒక రికార్డని.. ప్రతి సచివాలయంలో 10 మంది ఉద్యోగులను నియమించడం, ఒక్క నోటిఫికేషన్తోనే 1.34 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం కూడా చరిత్రలో నిలిచిపోయే నిర్ణయాలేనన్నారు. యూరప్, అమెరికాలో ఉపయోగించే అత్యాధునిక టెక్నాలజీతో భూముల రీ సర్వే నిర్వహించామని, గ్రామ సచివాలయాల్లోనే భూ రిజిస్ట్రేషన్లు జరిగేలా వ్యవస్థను తీసుకొచ్చామని జగన్ ప్రెస్ మీట్ లో అన్నారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: వైభవ్ అరంగేట్రంపై విమర్శలు.. మా ఇష్టం అంటూ మాజీలకు గట్టిగా ఇచ్చిపడేసిన బీసీసీఐ!
-
National Film Awards: చివరి నిమిషంలో షాక్.. 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన వాయిదా
-
Tamil Nadu Politics: విజయ్ ప్రభుత్వంపై కుట్ర కేసులో షాకింగ్ నిజాలు.. రూ.180 కోట్లతో స్కెచ్..!
-
Rohit Sharma Records: వన్డే నుంచి టీ20 వరకు.. కోహ్లీ కూడా బ్రేక్ చేయలేని రోహిత్ శర్మ చారిత్రాత్మక రికార్డ్స్ ఇవే!
-
Lepakshi: లేపాక్షి ఆలయంలో వేలాడే స్తంభం వెనుక నిజం ఏంటి.. శతాబ్దాలుగా ఆశ్చర్యపరుస్తున్న నిర్మాణ రహస్యం!
ట్రెండింగ్
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!
-
Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్లో లాంచ్..!