YS Jagan: వచ్చేది మా ప్రభుత్వమే, వడ్డీతో సహా చెల్లిస్తాం.. జగన్ మాస్ వార్నింగ్!
- కాపు కులంలో అంబటి రాంబాబు టైగర్
- వచ్చేది మా ప్రభుత్వమే, వడ్డీతో సహా చెల్లిస్తాం
- విషపూరిత విత్తనాలు నాటడం ఆపండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాపు కులంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు టైగర్ అని ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ పేర్కొన్నారు. నల్లపాడు సీఐ వంశీ, పట్టాభిపురం సీఐ వెంకటేశ్వర్లు అంబటిని దారుణంగా కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చేది తమ ప్రభుత్వమే అని.. అన్నింటికి వడ్డీతో సహా చెల్లిస్తాం అని అధికార పార్టీకి వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడైనా బుద్ధి, జ్ఞానం తెచ్చుకోండని.. విషపూరిత విత్తనాలు నాటడం ఆపండని వైఎస్ జగన్ సూచనలు చేశారు. ఈరోజు జగన్ గుంటూరు జిల్లాలో పర్యటించారు. టీడీపీ నేతల దాడిలో ధ్వంసమైన మాజీ మంత్రి అంబటి ఇంటికి వెళ్లి.. ఆయన కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించారు.
Also Read: YS Jagan: పవన్ కళ్యాణ్ కూడా అసత్య ప్రచారం చేశారు.. ఫ్లెక్సీలు మాక్కూడా కట్టొచ్చు!
Also Read
- Sugar Price Hike: ఇథనాల్ వల్లే చక్కెర ధరలు పెరిగాయా.? కేంద్రం క్లారిటీ..
- Laura Wright: ‘జన గణ మన’ గేయంపై బ్రిటిష్ సింగర్ కీలక వ్యాఖ్యలు!
- YS Viveka M*urder Case: వైఎస్ వివేకా కేసులో ఈడీ కీలక ప్రకటన.. అవినాష్ రెడ్డి ఇంట్లో రూ.24 లక్షలు సీజ్
- Deputy CM Pawan Kalyan: పవన్ కల్యాణ్కు ఆయుర్వేద థెరపీ.. రేపు కేరళకు డిప్యూటీ సీఎం
వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ… ‘అంబటి రాంబాబును ఎందుకు అరెస్టు చేశారు?. మరి రాంబాబు ఇంటిపై దాడి చేసిన ఎమ్మెల్యేపై చర్యలేవి?. తూతూమంత్రంగా అరెస్టు చేసి.. స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపేశారు. ఇది జంగల్ రాజ్యం కాదా?. జోగి రమేష్ ఇంటిపై పోలీసుల సమక్షంలోనే పెట్రోల్ బాంబులేసి తగులపెట్టారు. మా వాళ్ళపై దాడులు చేసి.. వాళ్ళపైనే రివర్స్ కేసులు పెట్టారు. సీఎం చంద్రబాబు పాపాలకు అడ్డుఅదుపూ లేకుండా పోయింది. చంద్రబాబు చేసిన తప్పుకి దేవుడే సీబీఐ చేత మొట్టికాయలు వేయించాడు. కాపు కులంలో అంబటి ఒక టైగర్. గొప్పగా బ్రతికినాడు.. విలువలతో కూడిన వ్యక్తిత్వం కలవాడు. సీనియర్ లీడర్.. మాజీ మంత్రి. స్టేషన్లో అలాంటి వ్యక్తిని కొడతారా?. ఎల్లకాలం ఇలానే అన్యాయం చేస్తే.. మీ ప్రభుత్వమే ఉండదు గుర్తు పెట్టుకోండి. మూడేళ్ళల్లో మా ప్రభుత్వం వస్తుంది.. జాగ్రత్త. వడ్డీతో సహా చెల్లిస్తాం.. తప్పు చేసిన వాళ్ళని న్యాయ పరంగా బొక్కలో పెట్టి బుద్ది చెప్తాం. దెబ్బ తిన్న మా వాళ్ళు రేపు ఊరుకుంటారా?. మేము వచ్చాక మా వాళ్ళు ఇలానే స్పందిస్తే మీ పరిస్థితి ఏంటి ఆలోచించుకోండి. ఇలాంటి ఘటనలు జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పిలుపు కూడా ఇస్తాం. కేంద్ర స్థాయిలో వీళ్ళ పాపాలు తీసుకుని వెళ్తాం. సీబీఐ రిపోర్ట్ ఇచ్చాక మళ్లీ కమిటీలు ఏంటి?. చేసిన తప్పు బయట పడేసరికి కమిటీ అంటున్నాడు’ అని జగన్ రెడ్డి ఫైర్ అయ్యారు.
తాజావార్తలు
-
Venkatesh VP : “కింగ్డమ్” ఫేమ్ వెంకటేష్.వి.పి. హీరోగా తెలుగు సినిమా
-
Sugar Price Hike: ఇథనాల్ వల్లే చక్కెర ధరలు పెరిగాయా.? కేంద్రం క్లారిటీ..
-
Laura Wright: ‘జన గణ మన’ గేయంపై బ్రిటిష్ సింగర్ కీలక వ్యాఖ్యలు!
-
Khelo India : ఖేలో ఇండియాకి భారీ నిధులు.. భారత క్రీడారంగానికి సరికొత్త వెలుగులు..
-
YS Viveka M*urder Case: వైఎస్ వివేకా కేసులో ఈడీ కీలక ప్రకటన.. అవినాష్ రెడ్డి ఇంట్లో రూ.24 లక్షలు సీజ్
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!