YS Jagan: నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. హాజరుకానున్న వైఎస్ జగన్!
- నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
- వైఎస్ జగన్ హాజరయ్యే అవకాశం
- గవర్నర్ ప్రసంగం సమయంలో సభలో జగన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలకు మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సహా వైసీపీ ఎమ్మెల్యేలు హాజరయ్యే అవకాశముంది. గవర్నర్ ప్రసంగం జరిగే తొలి రోజు సభలో పాల్గొనాలని పార్టీ నాయకత్వం వ్యూహాత్మకంగా నిర్ణయించినట్లు సమాచారం. గత ఏడాది బడ్జెట్ సమావేశాల తొలి రోజున కూడా గవర్నర్ ప్రసంగ సమయంలో వైఎస్ జగన్ అసెంబ్లీకి హాజరైన విషయం తెలిసిందే. అదే తరహాలో ఈసారి కూడా తొలి రోజు సమావేశాలకు ఆయన హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి.
గురువారం (ఫిబ్రవరి 12) వైసీపీ శాసనసభా పక్ష సమావేశం నిర్వహించే అవకాశముంది. ఆ సమావేశం అనంతరం అసెంబ్లీ సమావేశాల్లో పార్టీ వ్యూహం, పాల్గొనబోయే రోజులు తదితర అంశాలపై అధికారిక నిర్ణయం వెల్లడించనున్నట్లు సమాచారం. మరోవైపు శాసనమండలి సమావేశాలకు మాత్రం వైసీపీ ఎమ్మెల్సీలు యథావిధిగా హాజరవుతారని తెలుస్తోంది.
Also Read
- Schools and Colleges Closed: ఎడతెరిపి లేని వర్షాలు.. ఈ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు
- WhatsApp Username Feature: వాట్సాప్ కొత్త ఫీచర్పై సందేహాలన్నింటికీ చెక్.. మెటా కీలక ప్రకటన
- Green Chillies Storage Tips: ఈ సింపుల్ ట్రిక్ చాలు.. పచ్చిమిరపకాయలు వారాల తరబడి ఫ్రెష్గా ఉంటాయి
- IND vs ENG: మ్యాచ్ రద్దు.. భారత్ బ్యాటింగ్లో కనిపించిన కీలక లోపాలు
కూటమి నాయకుల విమర్శలకు చెక్ పెట్టే దిశగా వైఎస్ జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతున్నారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే వైసీపీ నేతలపై జరిగిన దాడులు, తిరుమల లడ్డూ వ్యవహారంలో ప్రభుత్వ వైఖరిపై నిరసన వ్యక్తం చేసే అవకాశం ఉందని సమాచారం. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు రాజకీయంగా హాట్ టాపిక్గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also Read: Daily Horoscope: బుధవారం రాశి ఫలాలు.. ఆ రాశి వారికి పదోన్నతులు పక్కా!
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. 10.30 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తారు. దాదాపు ఓ గంట సేపు ఈ ప్రసంగం కొనసాగే అవకాశం ఉంది. గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశమై.. సభ ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై తుది నిర్ణయం తీసుకుంటుంది. దాదాపు 20 రోజుల పాటు సమావేశాలు కొనసాగనునాయి. ఈ నెల 14న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.
తాజావార్తలు
-
Ayodhya Ram Mandir: అయోధ్య రామ్ మందిర్ కొలువుల్లో ‘కమిషన్ల’ భాగోతం.. ట్రస్ట్ కీలక సభ్యుల రాజీనామా వెనుక అసలు రహస్యం ఇదేనా?
-
Schools and Colleges Closed: ఎడతెరిపి లేని వర్షాలు.. ఈ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు
-
Gold & Silver Prices Today: కనకం ఇలా షాకిచ్చిందేంటి.. వామ్మో సిల్వర్ కూడా..
-
Hardik Pandya-CSK: సీఎస్కేలోకి హార్దిక్ పాండ్యా.. క్లారిటీ ఇచ్చిన చెన్నై సీఈఓ!
-
Best Crime Thriller Movies: కేతన్ అగర్వాల్ కేసును గుర్తు చేసే థ్రిల్లర్లు.. ఈ సినిమాల ట్విస్టులు చూస్తే షాక్ అవుతారు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?