YS Jagan: నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. హాజరుకానున్న వైఎస్ జగన్!
- నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
- వైఎస్ జగన్ హాజరయ్యే అవకాశం
- గవర్నర్ ప్రసంగం సమయంలో సభలో జగన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలకు మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సహా వైసీపీ ఎమ్మెల్యేలు హాజరయ్యే అవకాశముంది. గవర్నర్ ప్రసంగం జరిగే తొలి రోజు సభలో పాల్గొనాలని పార్టీ నాయకత్వం వ్యూహాత్మకంగా నిర్ణయించినట్లు సమాచారం. గత ఏడాది బడ్జెట్ సమావేశాల తొలి రోజున కూడా గవర్నర్ ప్రసంగ సమయంలో వైఎస్ జగన్ అసెంబ్లీకి హాజరైన విషయం తెలిసిందే. అదే తరహాలో ఈసారి కూడా తొలి రోజు సమావేశాలకు ఆయన హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి.
గురువారం (ఫిబ్రవరి 12) వైసీపీ శాసనసభా పక్ష సమావేశం నిర్వహించే అవకాశముంది. ఆ సమావేశం అనంతరం అసెంబ్లీ సమావేశాల్లో పార్టీ వ్యూహం, పాల్గొనబోయే రోజులు తదితర అంశాలపై అధికారిక నిర్ణయం వెల్లడించనున్నట్లు సమాచారం. మరోవైపు శాసనమండలి సమావేశాలకు మాత్రం వైసీపీ ఎమ్మెల్సీలు యథావిధిగా హాజరవుతారని తెలుస్తోంది.
Also Read
- CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
- Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
- Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
- Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
కూటమి నాయకుల విమర్శలకు చెక్ పెట్టే దిశగా వైఎస్ జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతున్నారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే వైసీపీ నేతలపై జరిగిన దాడులు, తిరుమల లడ్డూ వ్యవహారంలో ప్రభుత్వ వైఖరిపై నిరసన వ్యక్తం చేసే అవకాశం ఉందని సమాచారం. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు రాజకీయంగా హాట్ టాపిక్గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also Read: Daily Horoscope: బుధవారం రాశి ఫలాలు.. ఆ రాశి వారికి పదోన్నతులు పక్కా!
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. 10.30 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తారు. దాదాపు ఓ గంట సేపు ఈ ప్రసంగం కొనసాగే అవకాశం ఉంది. గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశమై.. సభ ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై తుది నిర్ణయం తీసుకుంటుంది. దాదాపు 20 రోజుల పాటు సమావేశాలు కొనసాగనునాయి. ఈ నెల 14న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.
తాజావార్తలు
-
Dragon Glimpse: ‘డ్రాగన్’ బాక్సాఫీస్ ఊచకోత ఖాయం.. ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్!
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!