నాలుగు బోధనాసుపత్రుల్లో సీటీ, ఎంఆర్ఐ పరికరాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు ముఖ్యమంత్రి వైయస్.జగన్. రాష్ట్రంలోని 11 టీచింగ్ ఆస్పత్రులు ప్రస్తుతం ఉంటే కేవలం 7 ఆస్పత్రుల్లో మాత్రమే సీటీ, ఎం ఆర్ఐ సదుపాయాలు ఉన్నాయి. ఈ ఏడింటిలో కూడా పీపీపీ పద్దతిలో, టెక్నాలజీ అప్డేట్స్ లేకుండా ఉన్నాయి. 4 చోట్ల అస్సలు ఇలాంటి పరికరాలు, సదుపాయాలు లేవు. మనం 16 కొత్త టీచింగ్ ఆస్పత్రులను తీసుకు వస్తున్నాం. వ్యాధి నిర్ధారణ పరికరాలు అందుబాటు ఉండాలనే దృక్పథంతో…
అసలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల ప్రాధాన్యత ఏంటి? అంటూ రెండు రాష్ట్ర ప్రభుత్వాలపై ఫైర్ అయ్యారు కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు… ప్రస్తుతం తెలంగాణలో మాజీ మంత్రి ఈటల వ్యవహారం హాట్ టాపిక్ కాగా.. ఏపీలో ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారం సంచలనంగా మారింది.. అయితే, కోవిడ్ సమయంలో.. ఈ పరిస్థితి ఏంటి? అంటూ రెండు ప్రభుత్వాలను నిలదీశారు వీహెచ్. హైదరాబాద్లో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఏపీలో రఘురామకృష్ణంరాజు, తెలంగాణలో ఈటల రాజేందర్ మీద పెడుతున్న శ్రద్ధ..…
ఆంధ్ర రాష్ట్రంలో వింత ప్రభుత్వం… వింతైన ముఖ్యమంత్రి వున్నారు అంటూ ఎద్దేవా చేశారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణు కుమార్ రాజు… న్యాయ వ్యవస్థను, న్యాయమూర్తులను కించపరిచేలా అధికార వైసీపీ సోషల్ మీడియా ప్రచారం చేసినప్పుడు అది వ్యవస్థను అస్థిరపరచడం కాదా…!? అంటూ ఫైర్ అయిన ఆయన.. చంద్రబాబును కాల్చాలని నంద్యాల బహిరంగ సభలో జనాన్ని రెచ్చగొట్టిన జగన్ పై కేసులు ఎందుకు నమోదు చేయలేదు… అప్పుడు సీఐడీ ఏం చేస్తోంది..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు……
రాయలసీమలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. ఇటీవలే తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 11 మంది రోగులు మృతి చెందిన విషయం తెలిసిందే. కర్ణాటక, తమిళనాడు ఆక్సిజన్ ప్లాంట్స్ నుంచి రాయలసీమకు ఆక్సిజన్ సరఫరా అవుతుంది. ప్రస్తుతం రాష్ట్రానికి 910 మెట్రిక్ టన్నుల మెడికల్ ఆక్సిజన్ అవసరం అవుతున్నది. అయితే, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి రావాల్సిన ఆక్సిజన్ సమయానికి అందటం లేదని, ఫలితంగా రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, గుజరాత్ లోని జామ్ నగర్ లో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్…
రాష్ట్రంలో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్న తరుణంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్షను నిర్వహించారు. ఈ సమీక్షలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 104 వ్యవస్థను బలోపేతం చేయాలని ఆదేశించారు. 104 కు ఫోన్ చేసిన వెంటనే అవసరం మేరకు బెడ్లను ఇచ్చే విధంగా వ్యవస్థను బలోపేతం చేయాలని వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. బెడ్లు అవసరం లేని వారిని కరోనా కేర్ సెంటర్లకు పంపాలని, ప్రతి ఆసుపత్రిలో ఆరోగ్య మిత్రను తప్పనిసరిగా అమలు జరిగేలా…
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ ఇంటర్ పరీక్షల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇంటర్ పరీక్షలను వాయిదా వేస్తూ ఇటీవలే నిర్ణయం తీసుకున్నారు. పరిస్థితులను బట్టి తరువాత పరీక్షలపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇక ఇదిలా ఉంటె, ఏపీ సీఎం జగన్ కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు. మే లో జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేయాలని కోరారు. ఏపీలో కరోనా పరీక్షలు లక్ష…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ప్రశంసలు కురిపించారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి.. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా నకిరేకల్ మున్సిపాల్టీలో ప్రచారం నిర్వహించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి అంటే వైఎస్ జగనే అన్నారు.. ఆంధ్రప్రదేశ్లో వెయ్యి రూపాయలు దాటిన వైద్యం అంతా ఆరోగ్య శ్రీలోనే అన్న ఆయన.. కరోనా ట్రీట్ మెంట్ కూడా ఆరోగ్యశ్రీలో చేర్చారంటూ ప్రశంసించారు.. అయితే, కరోనా వైరస్ బారినపడి ప్రజలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో…
ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజువారీ కేసులు ఐదువేలు దాటిపోతున్నాయి. కరోనా కట్టడికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కరోనా నివారణ, వ్యాక్సినేషన్ పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈరోజు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ను నిర్వహించబోతున్నారు. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో జిల్లాల కలెక్టర్లతో ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం కాబోతున్నారు. కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేయబోతున్నారు.