జేసీలకు సీఎం మార్గనిర్దేశం.. పనిలో డూప్లికేషన్ ఉండకూడదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పేదలందరికీ ఇళ్లు పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు జిల్లాల్లో ప్రత్యేకంగా నియమించిన జేసీలతో క్యాంపు కార్యాలయంలో సమావేశమైన సీఎం వైఎస్ జగన్.. వారికి మార్గనిర్దేశం చేశారు.. మనం ఇప్పుడు కడుతున్న సంఖ్యలో ఇళ్లు గతంలో ఎప్పుడూ కట్టలేదని. దేశంలో కూడా గతంలో ఎన్నడూ ఇలా చేయలేదన్న ఆయన.. 28 లక్షలకుపైగా ఇళ్లు కడుతున్నాం.. 17 వేల లే అవుట్స్లో ఈ ఇళ్లను నిర్మిస్తున్నాం.. కొన్ని లే అవుట్స్ .. మున్సిపాల్టీల సైజులో ఉన్నాయి.. అధికారులంతా అందరికీ ఇళ్లు పథకం అమలుకోసం విశేషంగా పనిచేస్తున్నారని తెలిపారు.. అయితే, నిర్ణీత సమయాల్లోగా ఈ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తిచేయాలన్న ఏపీ సీఎం.. అంతేకాదు అర్హులైన వారికి కచ్చితంగా అనుకున్న సమయంలోగా పట్టా ఇవ్వాలని స్పష్టం చేశారు.. అవినీతి లేకుండా, పక్షపాతం లేకుండా వారికి ఇంటి పట్టాలు అందాలని పేర్కొన్న ఆయన.. శాచ్యురేషన్ పద్ధతిలో వారికి ఇంటి పట్టాలు అందించాలి.. అర్హులు 100 మంది ఉంటే.. 10 మంది ఇచ్చే పరిస్థితి ఎప్పుడూ ఉండకూడదన్నారు.. గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల సహకారంతో అర్హులైనవారికి సామాజిక తనిఖీచేసి శాచ్యురేషన్ పద్ధతిలో ఇవ్వగలుగుతున్నామని.. పెన్షన్లు, ఇంటిపట్టాలు, రేషన్కార్డులు, ఆరోగ్య శ్రీ… రెగ్యులర్ గా సమాన్యజనంతో లింకైన అంశాలు ఇవి.. నిర్ణీత సమయంలోగా వీటికి సంబంధించిన దరఖాస్తులను పరిష్కరించి వారికి ప్రయోజనాలు అందించాలన్నారు.
ఎవరైనా మిగిలిపోతే వారికి 90 రోజుల్లోగా ఇంటి పట్టాలు అందించాలన్నారు సీఎం వైఎస్ జగన్.. ఇలా ఇళ్లపట్టాలు అందుకున్నవారికి ఇళ్లుకూడా ఇవ్వాలన్నా యన.. ప్రతి ఏటా కూడా ఇలా పట్టాలు అందుకున్నవారికి ఇళ్లుకట్టించాల్సిన అవసరం ఉంటుందన్నారు.. పేదవాడి సొంతింటికలను నిజంచేసే దిశగా అడుగులు వేస్తున్నామన్న సీఎం… దరఖాస్తు చేసుకున్న 90 రోజుల్లోగా ఇంటి పట్టా ఇవ్వడం అన్నది చాలా ముఖ్యమైన అంశం.. ఇళ్లనిర్మాణం ద్వారా ఏర్పాటవుతున్న కాలనీలు ఎట్టి పరిస్థితుల్లోనూ మురికివాడలుగా మారొద్దని ఆదేశించారు.. అక్కడ మంచి మౌలిక సదుపాయాలను కల్పించాలి.. వివిధ పథకాలను సమర్థవంతంగా వినియోగించుకుని ఈమౌలిక సదుపాయాలను కల్పించేలా చూడాలని.. ఇళ్లస్థలాల రూపేణా, నిర్మాణం రూపేణా, మౌలిక సదుపాయాల రూపేణా సుమారు రూ.84వేల కోట్లకుపైగా ఖర్చు చేస్తున్నట్టు వెల్లడించారు. ఎక్కడా అవినీతికి తావు ఉండకూడదని స్పష్టం చేసిన సీఎం.. ప్రతి పనిలో కూడా పారదర్శకతను, నాణ్యతను దృష్టిలో ఉంచుకోండి.. నాణ్యత విషయలో రాజీ పడితే… ఇబ్బందులు వస్తాయని.. నిర్దేశించుకున్న సమయంలోగా ఇళ్ల నిర్మాణాన్ని పూర్తిచేయాలని.. సమర్థవంతమైన ప్రణాళికతో ముందుకుసాగాలని.. పనిలో డూప్లికేషన్ ఉండకూడదని ఆదేశించారు.
Also Read
తాజావార్తలు
-
Skoda Peak EV: స్కోడా కొత్త 7-సీటర్ ఎలక్ట్రిక్ SUV ‘పీక్’ ఆవిష్కరణ.. 647KM రేంజ్తో అదిరిపోయే ఫీచర్లు
-
IND vs BAN: నేడు టీమిండియాకు కీలక మ్యాచ్.. గెలవకుంటే ఇంటికే.. కొడితే గట్టిగా కొట్టాల్సిందే!
-
George Krish : ‘జార్జ్ క్రిష్’ షూటింగ్కు కౌంట్డౌన్.. హీరోయిన్పై సస్పెన్స్ వీడిందా?
-
Rule Change 1st July: జూలై 1 నుంచి మీ జేబుపై ప్రభావం.. మారుతున్న 7 ముఖ్యమైన నిబంధనలు ఇవే..!
-
US Citizenship Fee Hike: ఎన్నారైలకు బిగ్ షాక్.. భారీగా పెరగనున్న అమెరికా సిటిజన్షిప్ ఫీజులు?
ట్రెండింగ్
-
ట్యాబ్లెట్ కాదు.. మినీ ల్యాప్టాప్! 13-అంగుళాల 3.5K డిస్ప్లే, 144Hz డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో Moto Pad 70 Pro..
-
Reality Check: పేదరికం VS బాలికల హక్కులు.. బాల్య వివాహాల వెనుక దాగి ఉన్న చేదు నిజాలు..
-
Door Cleaning Tips : దుమ్ము పట్టిన తలుపులు మెరవాలా.? కిచెన్లోనే ఉంది సూపర్ సొల్యూషన్.!
-
Kitchen Tips : చెక్క, ప్లాస్టిక్, స్టీల్.. వంటగదికి ఏ చాపింగ్ బోర్డు ఆరోగ్యకరమో తెలుసా..?
-
సూపర్కార్ డిజైన్, ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. Infinix NOTE 60 Pro Pininfarina Limited Edition లాంచ్.!