ఆంధ్రప్రదేశ్లో కరోనా కారణంగా డ్రైవర్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటులన్నారు. వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం వాహనమిత్ర పేరుతో ఆర్ధిక సాయం చేస్తున్నది. ఇప్పటి వరకు రెండుసార్లు వాహనమిత్ర సాయం అందించింది. కాగా ఇప్పుడు మూడోసారి కూడా డ్రైవర్లకు వాహనమిత్ర ఆర్ధిక సాయం చేస్తున్నది. ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆన్లైన్ ద్వారా వాహనమిత్ర సాయాన్ని విడుదల చేయబోతున్నారు. ఆటో, ట్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లకు రూ.10వేల చొప్పున ఆర్ధికసాయం చేయబోతున్నారు. ఈ వాహనమిత్ర పథకం ద్వారా రాష్ట్రంలోని 2.48 లక్షలమంది…
ఆంధ్రప్రదేశ్లో గవర్నర్ కోటాలో కొత్తగా ఎంపిక కానున్న ఆ నలుగురు ఎమ్మెల్సీలు ఎవరు? అనే ఉత్కంఠకు తెరపడింది.. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన ఆ నలుగురు ఎమ్మెల్సీలకు ఆమోదముద్ర వేశారు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్.. సాయంత్రం తన శ్రీమతి వైఎస్ భారతితో కలిసి రాజ్భవన్కు వెళ్లారు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. సరిగ్గా 40 నిమిషాల పాటు గవర్నర్ దంపతులు విశ్వభూషణ్ హరిచందన్, సుప్రవా హరిచందన్తో సమావేశం జరిగింది.. ఈ సందర్భంగా గవర్నర్ కోటాలో…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన ఈరోజు ఎస్ఎన్బీసీ సమావేశం జరిగింది. 2021-22 వార్షిక రుణ ప్రణాళికను ఆవిష్కరించారు. స్కూళ్లు, ఆసుపత్రులను నాడు-నేడు కింద అభివృద్ది చేస్తున్నామని, అగ్రి ఇన్ఫ్రా, గృహాలు, ఇతర వ్యవసాయ రంగాల్లో బ్యాంకుల సమర్ధత పెరగాలని వైఎస్ జగన్ పేర్కొన్నారు. వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాలు పెంచాలని పేర్కొన్నారు. ప్రభుత్వ స్కూళ్లకు పిల్లలు తిరిగి వస్తున్నట్టు తెలిపారు. చికిత్సకోసం చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చినట్టు సీఎం తెలిపారు.…
కేంద్ర పెట్రోలియం మరియు సహజవాయువులు, ఉక్కుశాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో సీఎం వైయస్.జగన్ భేటీ అయ్యారు. కాకినాడ పెట్రో కాంప్లెక్స్, విశాఖ స్టీల్ ప్లాంట్ అంశాలపై చర్చించారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తాము సూచించిన ప్రత్యామ్నాయాలను మరోసారి కేంద్ర మంత్రికి వివరించిన సీఎం… కాకినాడ ఎస్ఈజెడ్లో పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు చర్యలను వేగవంతం చేయాలన్నారు. వయబిలిటీ గ్యాప్ ఫండ్విషయంలో రాష్ట్రంపై పెద్దగా భారంలేకుండా చూడాలన్నారు సీఎం. అయితే ఏపీలో కచ్చితంగా పెట్రో కాంప్లెక్స్ను ఏర్పాటు చేస్తామన్న కేంద్రమంత్రి…
హస్తిన పర్యటనలో ఉన్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బిజీబిజీగా గడుపుతున్నారు.. మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకున్న ఆయన… మొదటగా కేంద్ర మంత్రి ప్రకాష్ జావడేకర్తో సమావేశమయ్యారు.. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పెండింగ్ ప్రాజెక్టులు, రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇతర అంశాలపై చర్చించారు.. ఆ తర్వాత కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్లో భేటీ అయ్యారు.. రాత్రి 9 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాతో సమావేశం కానున్నారు ఏపీ సీఎం.. కాగా, ఇవాళ రాత్రికి ఢిల్లీలోనే బస…
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిశారు 2008 డీఎస్సీ అభ్యర్థులు.నోటిఫికేషన్ విడుదల తర్వాత నిబంధనల మార్చడం వల్ల తమకు అన్యాయం జరిగిందని 11 ఏళ్ల నుంచి పోరాటం చేస్తున్నారు 2,193 మంది అభ్యర్థులు. కాంట్రాక్టు పద్ధతిలో నియామకాలు చేపట్టటానికి అంగీకరించారు ముఖ్యమంత్రి. ఈ సందర్బంగా ఉద్యోగసంఘం నేత వెంకటరామి రెడ్డి మాట్లాడుతూ… ఈ ఏడాది అక్టోబరు 2న రెండేళ్ళు పూర్తి చేసుకోనున్నారు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు. ప్రొబేషన్ పూర్తి చేసుకున్న అందరినీ రెగ్యులరైజ్ చేయాలని కోరాం.…
చిరువ్యాపారుల కోసం జగనన్న తోడు పథకాన్ని ప్రారంభించారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కోసం రూ.370 కోట్ల రూపాయలను రిలీజ్ చేశారు. 3.7 లక్షల మందికి ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. చిరు వ్యాపారులకు బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదని, గత్యంతరం లేక వ్యాపారులు అధిక వడ్డీకి రుణాలు తీసుకుంటున్నారనీ, వాటిని చెల్లించలేక పేదలు అష్టకష్టాలు పడుతున్నారని, వ్యవస్థలను పేదలకు ఉపయోగపడేలా తీసుకురావాలని, లేకపోతే ప్రభుత్వాలు విఫలం అయినట్టే అని…
కరోనా సమయంలో చిరు వ్యాపారులు తీవ్రంగా నష్టపోయిన సంగతి తెలిసిందే. చిన్న చిన్న వ్యాపారులు వ్యాపారాలు లేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వీరిని ఆదుకోవడానికి సీఎం… జగనన్న తోడు పథకాన్ని తీసుకొచ్చారు. ఈ పథకం కింద చిరు వ్యాపారులను అదుకోబోతున్నారు. చిరువ్యాపారులకు రూ.10వేల రూపాయల వడ్డీలేని రుణాలను మంజూరు చేయబోతున్నారు. తాడెపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి 11 గంటలకు వర్చువల్ విధానంలో నగదును బదిలీ చేయనున్నారు. ఈ పథకం ద్వారా 3.7 లక్షల మంది చిరువ్యాపారులకు లబ్ది చేకూరబోతున్నది.…
రాష్ట్రంలో పేదల కోసం ప్రభుత్వం ఇళ్లను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇళ్ల నిర్మాణం కోసం ఇప్పటికే పేదలకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేసింది. ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో ఇళ్లు నిర్మించుకోలేని వారికి ప్రభుత్వమే పక్కాగా ఇళ్లను నిర్మించి ఇచ్చేందుకు సిద్దమైన విషయం తెలిసిందే. ఇటీవలే దీనికి సంబందించిన కార్యక్రమం అధికారికంగా ప్రారంభించారు. ఇక ఇదిలా ఉంటే, సీఎం వైఎస్ జగన్ ప్రధాని మోడీకి లేఖ రాశారు. ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆ…