నగరంలోని మెహదీపట్నంలో యువకులు వీరంగం సృష్టించారు. సోమవారం రాత్రి గంజాయి మత్తులో ఉన్న యువకులు ఆసిఫ్నగర్లో హల్చల్ చేశారు. పోలీసు వాహనం పైకి ఎక్కి ధ్వంసం చేశారు. మరికొన్ని వాహనాలపై దాడిచేశారు. దీంతో వారిని పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. వారిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ మెహిదీపట్నంలోని ఆసిఫ్నగర్లో అర్ధరాత్రి యువకులు హల్చల్ చేశారు. జిర్రా సమీపంలోని రాయల్స్ హోటల్ వద్ద గంజాయి మత్తులో యువకులు వీరంగం సృష్టించారు. అంతటితో ఆగకుండా నడిరోడ్డుపై…
ఈరోజుల్లో ప్రతి చిన్న అవసరానికి అప్పు చేయాలి. గతంలో బ్యాంకుల ద్వారా అప్పులు తీసుకోవడం, ఆ తర్వాత వాటిని చెల్లించడం చేసేవారు. అయితే, బ్యాంకుల్లో అప్పులకు వడ్డీలు తక్కువ. ఆలస్యం అయితే జరిమానాలు చెల్లించాలి. అంతేగానీ వేధింపులు వుండవు. కానీ ఇప్పుడు లోన్ యాప్ ల పేరుతో అప్పులిచ్చే సంస్థలు పుట్టుకువచ్చాయి. లోన్ యాప్ ల ద్వారా అప్పులు తీసుకునేవారు అప్రమత్తంగా వుండాలని పోలీసులు సూచిస్తున్నారు. లోన్ యాప్స్ ముఠాలు మళ్ళీ రెచ్చిపోతున్నారు. అధిక లాభాలు వస్తుండటంతో…
మంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఆర్ కె రోజా బిజీ అయిపోయారు. వివిధ అధికారిక కార్యక్రమాల్లో ఆమె పాల్గొంటున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఆమె పర్యటించారు. అక్కడ బాస్కెట్ బాల్ పోటీలను ఆమె ప్రారంభించారు. తాజాగా విజయవాడలో ఆమె శాప్ ఆధ్వర్యంలో వేసవి శిక్షణ శిబిరాలను ప్రారంభించారు. నగరంలోని మున్సిపల్ కార్పొరేషన్ క్రీడాప్రాంగణములో శిక్షణా శిబిరాలను ప్రారంభించి ప్రసంగించారు. కరోనా వల్ల రెండు ఏళ్లు క్రీడాకారులు ఇళ్ళకే పరిమితం అయ్యారు. క్రీడలు ఆరోగ్యాన్ని, అవార్డులను తెచ్చి పెడతాయి. 48 విభాగాల్లో…
ఈమధ్యకాలంలో చిన్నచిన్న సమస్యలకు ఆత్మహత్యాయత్నాలకు పాల్పడుతున్నారు యువత. అదే మద్యం మత్తులో అయితే వారుచేసే హడావిడి అంతా ఇంతా కాదు. తాజాగా హైదరాబాద్లో మద్యం మత్తులో ఒక యువకుడు చేసిన హడావిడి పోలీసులకు చెమటలు పట్టించింది. అడ్డగుట్ట ప్రాంతానికి చెందిన నర్సింగ్ రావు మద్యం మత్తులో ఫ్లెక్సీ కోసం ఏర్పాటు చేసిన టవర్ ఎక్కి హల్ చల్ చేశాడు. నర్సింగ్ రావు గతంలో రెండు పర్యాయాలు టవర్ ఎక్కి హల్ చల్ చేశాడు. శనివారం అర్థరాత్రి 11…
ఇంటర్నెట్ లోనే కాదు బహిరంగ ప్రదేశాల్లోనూ అశ్లీలత పెచ్చుమీరుతోంది. ఆపాల్సిన పోలీసులు దగ్గరుండి అశ్లీల డ్యాన్స్ లు వేయించడం వివాదాలకు దారితీసింది. అమ్యామ్యాలు పుచ్చుకొని చేజర్ల పోలీసులు చూసీచూడనట్టు వ్యవహరించారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. నెల్లూరు జిల్లా చేజర్ల మండలం ఆదూరుపల్లి గ్రామంలో అర్థరాత్రి వేళ చేజర్ల పోలీసుల సాక్షిగా అశ్లీల నృత్యాలు ప్రదర్శించారు. శ్రీ రామ నవమి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన సంబరాల్లో ఈ అశ్లీల నృత్యాలు రాజ్యమేలాయి. పోలీసులు ప్రభుత్వ ఆంక్షలని సైతం తుంగలో…
సంపాదన విలువ తెలియాలంటే రూపాయి.. రూపాయి కూడబెట్టాలి అని చెబుతుంటారు పెద్దలు.. ఓ యువకుడిని చూస్తే అది నిజమేగా అనాల్సిందే.. విషయం ఏదైనా సరే.. దాని వెనుక కృషిని బట్టే ఫలితం ఉంటుంది.. ఆ యువకుడు చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది… అత్యంత ఖరీదైన బైక్ను మొత్తం రూ.1 నాణాలతో కొనుగోలు చేసి వార్తల్లో నిలిచాడు ఆ యువకుడు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులోని సేలంలో భూబాతీ అనే యువకుడు బైక్ కొనాలని…
తెలంగాణలో నిరుద్యోగం ఇప్పుడు పార్టీలో ఏజెండాగా మారనుందా? అంటే అవుననే అంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ సమస్యను ప్రధానంగా చర్చిస్తోంది. లక్షలాది ఉద్యోగాల నియామకం చేపట్టాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్లు లేక నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. చాలీచాలని జీతాలతో ప్రయివేటు ఉద్యోగాలు చేస్తున్నామని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డిగ్రీలు, పీజీలు చేసిన పలువురు నిరుద్యోగులు ఉద్యోగాలు రాక హమాలీ పనికి, టీ, టిఫిన్ సెంటర్లు నడుపుతూ, కూరగాయలు…
ఖర్చులకు డబ్బులు కావాలా..ఇంట్లో స్నేహితులను అడిగితే డబ్బులు ఇవ్వడం లేదా..లేకపోతే ఎవరినైనా చేబదులు అడగాలంటే సిగ్గుగా అనిపిస్తుందా? బ్యాంకుల చూట్టు తిరిగే ఓపిక లేదా? డోంట్ వర్రీ ఇకపై మీకు ఆ ఇబ్బంది లేదు….ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండానే సెకన్లలో ఆన్ లైన్ లో మీ ఎకౌంట్ కు డబ్బులిచ్చేస్తాం అంటున్నారు ఆన్ లైన్ పర్సనల్ లోన్ యాప్ నిర్వాహకులు. ఇదేదో ప్రజాసేవ కాదు….మధ్యతరగతి ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని వారిని పీక్కుతినే మైక్రోఫైనాన్స్ లాంటి దిక్కుమాలిన ఆన్…
వివిధ ప్రాచీన కళలు కనుమరుగవుతున్నాయి. గతంలో ఏ చిన్న కార్యక్రమం వున్నా డప్పు ద్వారా అందరికీ తెలియచేసేవారు. విద్యార్థుల్లో ఉన్న సామాజిక చైతన్య స్పృహని ,వాళ్లలో ఉన్న కళని పైకి తెచ్చి ఉపాధి అవకాశాలను మెరుగు పరిచే విధంగా చర్యలు చేపడుతోంది ప్రభుత్వం. మరుగున పడిన డప్పు కళను ఈతరం సమాజానికి పరిచయం చేద్దామని సంగారెడ్డి పట్టణం తార ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డప్పు సర్టిఫికెట్ కోర్సు ఏర్పాటు చేశారు ప్రిన్సిపాల్ ప్రవీణ. ఈ సర్టిఫికెట్ కోర్స్…
ఈరోజు జాతీయ ఓటర్ల దినోత్సవం. ఈ సందర్భంగా యువతను ఉద్దేశిస్తూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ఎన్నికల ప్రక్రియ కీలకమైందని, అందుకే యువత అందరూ ఓటు వేయడం మన కర్తవ్యంగా పరిగణించాలని వైసీపీ నేత విజయసాయిరెడ్డి సూచించారు. ఓటు హక్కును వినియోగించుకునేందుకు యువత ముందుకు రావాలని కోరారు. ఎందుకంటే మన దేశ భవిష్యత్తును నిర్ణయించడంలో ప్రతి ఒక్క ఓటు ముఖ్యమైందేనని ఎంపీ విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు. కాగా ప్రతి ఏడాది జనవరి 25న…