Dappu Course: డిగ్రీకాలేజీలో డప్పు సర్టిఫికెట్ కోర్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వివిధ ప్రాచీన కళలు కనుమరుగవుతున్నాయి. గతంలో ఏ చిన్న కార్యక్రమం వున్నా డప్పు ద్వారా అందరికీ తెలియచేసేవారు. విద్యార్థుల్లో ఉన్న సామాజిక చైతన్య స్పృహని ,వాళ్లలో ఉన్న కళని పైకి తెచ్చి ఉపాధి అవకాశాలను మెరుగు పరిచే విధంగా చర్యలు చేపడుతోంది ప్రభుత్వం. మరుగున పడిన డప్పు కళను ఈతరం సమాజానికి పరిచయం చేద్దామని సంగారెడ్డి పట్టణం తార ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డప్పు సర్టిఫికెట్ కోర్సు ఏర్పాటు చేశారు ప్రిన్సిపాల్ ప్రవీణ. ఈ సర్టిఫికెట్ కోర్స్ తెలుగు యూనివర్సిటీ సిలబస్ ప్రకారమే నిర్వహిస్తున్నారు.
ఇప్పటికే ఈ డప్పు కోర్సు కి స్థానిక ప్రజల నుండి ప్రజాదరణ పొందడంతో సభలు సమావేశాలు నిర్వహిస్తున్న వారి నుండి విద్యార్థులకు మంచి అవకాశాలు వస్తున్నాయి. డప్పు శిక్షణ సర్టిఫికెట్ కోర్స్ నేర్చుకుంటున్న విద్యార్థులకు విద్యతో పాటు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులు. కళాశాల సిబ్బంది విద్యార్థులకు ఎన్ఎస్ఎస్ యూనిట్ ద్వారా ఏదైనా నేర్పించాలని ప్రారంభించిన ఈ కోర్స్ స్థానిక ప్రజల మన్ననలు పొంది ముందుకు సాగుతుంది. మరుగున పడిన డబ్బు కళను పైకి తెచ్చి కుల మతాలతో సంబంధం లేకుండా కొత్త తరానికి పరిచయం చేయాలని ప్రారంభించారు అందే మ్యూజిక్ అకాడమీ డైరెక్టర్ అందె భాస్కర్.
Also Read
- CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
- HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
- HYDRA Ranganath: నేను చట్టపరిధిలోనే పనిచేస్తున్నా, పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తి లేదు
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
కిషన్ అనే విద్యార్థి డప్పు నేర్చుకోవడం వల్ల తన ప్రదర్శన ద్వారా రిపబ్లిక్ డే పరేడ్ లో పాల్గొని సంగారెడ్డి తార కళాశాలకు, తెలంగాణకు మంచి పేరు తీసుకు రావడం జరిగింది. ప్రిన్సిపాల్ ప్రవీణ, ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ జగదీష్ సహకారంతో డప్పును 52 గంటల సర్టిఫికెట్ కోర్సు గా ప్రవేశ పెట్టడం జరిగింది. ఇప్పటి వరకు సుమారుగా వంద మంది విద్యార్థినీ, విద్యార్థులు నేర్చుకొని స్థానికంగా ప్రజలనుండి ప్రజాదరణ పొంది సభలు సమావేశల్లో డప్పు ప్రదర్శన నిర్వహిస్తున్నారు విద్యార్దినీ, విద్యార్దులు.

సంగారెడ్డిలోని తార ప్రభుత్వ కళాశాలలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో అందె మ్యూజిక్ అకాడమీ డైరెక్టర్ అందె భాస్కర్ ఆధ్వర్యంలో అంతరించిపోతున్న, జానపద కళలకు ప్రాణం పోస్తున్నారు. భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ ప్రోత్సాహంతో తార డిగ్రీ కళాశాల విద్యార్థినీ విద్యార్థులకు, ఎన్ ఎస్ ఎస్ యూనిట్ విద్యార్థులకు డప్పు నేర్పిస్తున్నారు.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!